
‘బీఏఎస్’ ఎంపిక ప్రక్రియ పూర్తి
ఉట్నూర్రూరల్: ఈ విద్యాసంవత్సరానికి గా ను జిల్లాలోని బెస్ట్ అవైలబుల్ స్కూళ్ల(బీవైఎస్)లో ప్రవేశాలకు సంబంధించి గిరిజన విద్యార్థుల ఎంపిక కోసం శనివారం లక్కీ డ్రా నిర్వహించారు. ఐటీడీఏ సమావేశ మందిరంలో పీవో ఖుష్బూ గుప్తా ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. మూడో తరగతిలో 24 సీట్లకు గాను 244 దరఖాస్తులు, ఐదో తరగతిలో 12 సీట్లకు గాను 270, అలాగే 8వ తరగతిలో 12 సీట్లకు గాను 88 దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు. డ్రా ద్వారా ఎంపిక చేసిన విద్యార్థుల వివరాలను పీవో ప్రకటించారు. ఇందులో గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జాదవ్ అంబాజీ, ఏపీవో పీవీటీజీ మెస్రం మనోహర్, ఏటీడీవో క్రాంతి, జిల్లా గిరిజన క్రీడల అధికారి పార్థసారథి, జీసీడీవో చాయ, ఏవో వేణుమాధవ్, కిషన్ తదితరులు పాల్గొన్నారు.