
సమయపాలన పాటించాలి
తలమడుగు: ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని డీఈవో శ్రీనివాస్రెడ్డి అన్నారు. మండలంలోని సుంకిడి, రుయ్యా డి, తలమడుగులోని ప్రాథమిక, జెడ్పీ పాఠశాలలను శనివారం తనిఖీ చేశారు. హాజరు పట్టికలతో పాటు ఆయా తరగతి గదులు, కి చెన్, స్టోర్ రూమ్లను పరిశీలించారు. విద్యార్థుల హాజరుశాతం వివరాలు అడిగి తెలుసుకున్నారు. పదో తరగతి విద్యార్థులతో మాట్లాడుతూ, కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగా లని సూచించారు. కార్యక్రమంలో ప్రధానో పాధ్యాయులు వెంకట్రమణ, సుకుమార్, వి నోద్రెడ్డి, మురళి, సుజాత తదితరులున్నారు.
ఇక్కడ కనిపిస్తున్న రైతు సూర్యవంశీ రాజేందర్. సిరికొండ మండల కేంద్రంలో అయిదెకరాల్లో పత్తి సాగు చేపట్టాడు. ఈ వానాకాలంలో ఆరు బ్యాగుల విత్తనాలు వేశాడు. తొమ్మిది రోజులు దాటినా వర్షాలు లేక ఇంకా మొలకలు రాలేదు. వాన పడితే మళ్లీ గింజలు కొని వేయాల్సి ఉంటుందని రైతు వాపోతున్నాడు.