ఆధ్యాత్మిక భావంతోనే ప్రశాంతత | - | Sakshi
Sakshi News home page

ఆధ్యాత్మిక భావంతోనే ప్రశాంతత

Apr 14 2025 12:31 AM | Updated on Apr 14 2025 12:31 AM

ఆధ్యాత్మిక భావంతోనే ప్రశాంతత

ఆధ్యాత్మిక భావంతోనే ప్రశాంతత

నార్నూర్‌: ఆధ్యాత్మిక భావంతోనే ప్రశాంతత కలుగుతుందని విష్ణు మహరాజ్‌ అన్నా రు. మండలంలోని గుంజాలలో 14 రోజు లుగా కొనసాగుతున్న హరినామ సప్తాహ కార్యక్రమం ఆదివారంతో ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుందన్నారు. ప్రతిఒక్కరూ ఆధ్యాత్మిక భావంతో మెలగాలని సూచించారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామపెద్దలు పెందూర్‌ రాంషావ్‌ మహరాజ్‌, కుమ్రా లక్ష్మణ్‌ పటేల్‌, రాయి సెంటర్‌ సార్‌మేడి కొట్నాక్‌ కృష్ణ, కుమ్రా జ్ఞానేశ్వర్‌, పెందూర్‌ డిగంబర్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement