కంబాలకొండలో ప్రపంచబ్యాంక్ బృందం
ఆరిలోవ: నగరంలో ఎకో టూరిజం పార్కు కొంబాలకొండలో ప్రపంచబ్యాంక్ బందం గురువారం సాయంత్రం పర్యటించింది. కంబాలకొండ పార్కు అభివద్ధిపై అటవీశాఖ అధికారులు నగరంలో నవోటల్ హోటల్లో ఉదయం నిర్వహించిన సదస్సు అనంతరం సాయంత్రం ఈ బందంతో పాటు ఏయూ పర్యావరణ విభాగం అధ్యాపకులు, పలువురు పర్యావరణ శాస్త్రవేత్తలు కలసి సుమారు 60 మంది ప్రతినిధులు ఇక్కడ క్షేత్ర పర్యటనకు వచ్చారు. నేరుగా ఇక్కడ పరిస్థితిని గమనించారు. విశాలమైన పార్కులు, పచ్చదనం, వక్షాలు, కొలను, ఇక్కడ అందాలు తదితర వాటిని పరిశీలించారు. వాటి గురించి ఇక్కడ అధికారులు ఆయా ప్రతినిధులకు వివరించారు. ఈ ప్రాంతంలో ఎలాంటి వక్షాలు, మొక్కలు, ఔషదాలు, దీని విస్తీర్ణం తదితర వాటి గురించి వివరించారు.