-
అయోధ్యలో మందిర నిర్మాణం ప్రారంభం
అయోధ్య: అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనులు గురువారం ప్రారంభమయ్యాయి. వచ్చే మూడు–మూడున్నరేళ్లలో మందిరం పూర్తవుతుందని నిర్మాణ పనుల్ని పర్యవేక్షించే ట్రస్టు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర వెల్లడించింది. భారత్కు చెందిన అత్యంత పురాతన నిర్మాణ శైలితో పటిష్టంగా మందిర నిర్మాణాన్ని చేస్తున్నట్టుగా తెలిపింది. దీనికి సంబంధించి ట్రస్ట్ వరుస ట్వీట్లు చేసింది. ‘‘ఎల్ అండ్ టీ సంస్థతో పాటుగా సీబీఆర్ఐ రూర్కీ, ఐఐటీ మద్రాస్ ఇంజనీర్లు మందిర నిర్మాణ స్థలంలో మట్టిని పరీక్షిస్తున్నారని, 36–40 నెలల్లో నిర్మాణం పూర్తయిపోతుందని ట్రస్ట్ తన ట్వీట్లో పేర్కొంది. భూకంపాలు, తుపాన్ బీభత్సాలు, ఇతర ప్రకృతి వైపరీత్యాలు తట్టుకునేలా ఆలయ నిర్మాణం సాగుతుంది. అందుకే ఈ నిర్మాణంలో ఇనుము వాడడం లేదు. వేల ఏళ్లయినా చెక్కు చెదరకుండా ఉండడానికి రాతితో నిర్మించే మందిరంలో ప్రతీ రాయికి మధ్య రాగి పలకల్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం 18 అంగుళాల పొడవు, 30 మి.మీ. వెడల్పు, 3 మి.మీ. లోతు కలిగిన 10 వేల రాగి పలకలు అవసరమవుతాయి. ఈ రాగి పలకల్ని విరాళంగా అందివ్వాలని మందిరం ట్రస్ట్ రామ భక్తులకు పిలుపునిచ్చింది. దాతలు వాటిపై తమ కుటుంబ సభ్యుల పేర్లు, వంశం పేరు రాయవచ్చునని పేర్కొంది. -
వ్యాగన్ వర్క్షాపునకు కదలిక
రాష్ట్రంలోనే ఇలాంటి వర్క్షాపు విజయవాడలో ఉంది. వడ్లపూడిలో ఏర్పాటు కానున్నది రెండో వ్యాగన్ వర్క్షాపు. అయితే విజయవాడ వర్క్షాపు కంటే అత్యాధునిక యంత్ర పరికరాలు, సామగ్రిని కలిగి ఉంటుంది. సాక్షి, విశాఖపట్నం: వడ్లపూడిలో నిర్మించ తలపెట్టిన వ్యాగన్ వర్క్షాపునకు ఎట్టకేలకు కదలిక వచ్చింది. ఈ బడ్జెట్లో రూ.150 కోట్లు కేటాయించడంతో త్వరలోనే ఈ వ్యాగన్ వర్క్షాపు పనులు ప్రారంభం కానున్నాయి. ఈ వ్యాగన్ వర్క్షాపును 2015–16 రైల్వే బడ్జెట్లో మంజూరు చేశారు. అప్పట్లో దీనికి రూ.213.97 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. 2016–17లో రూ.30 కోట్లు, 2017–18లో రూ.80 కోట్లు వెరసి రూ.110 కోట్లు కేటాయించారు. అయినప్పటికీ రైల్వే మంత్రిత్వశాఖ తీసుకున్న నిర్ణయాల వల్ల జాప్యం జరుగుతూ వచ్చింది. పలు తర్జన భర్జనల అనంతరం ఈ వర్క్షాపునకు గత జూన్ 15న అప్పటి రైల్వే మంత్రి సురేష్ప్రభు విజయవాడ నుంచి వీడియో లింకు ద్వారా శంకుస్థాపన చేశారు. 240 ఎకరాలు కేటాయింపు వడ్లపూడిలో ఈ వ్యాగన్ వర్క్షాపు నిర్మాణానికి 240 ఎకరాలు కేటాయించారు. దీని నిర్మాణ బాధ్యతను చేపట్టడానికి తొలుత బీహార్లోని పాట్నాకు చెందిన ఓ సంస్థ ముందుకొచ్చింది. కానీ కొన్నాళ్ల తర్వాత వెనక్కి తగ్గింది. దీంతో రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆర్వీఎన్ఎల్)కు అప్పగించారు. ఈ వ్యాగన్ వర్క్షాప్ వ్యయం రూ.328.81 కోట్లకు పెరుగుతుందని ఆ సంస్థ అంచనా వేసింది. ఇందులో సివిల్ ఇంజినీరింగ్ పనులకు రూ.137 కోట్లు, మెకానికల్కు రూ.126 కోట్లు, విద్యుత్ పనులకు రూ.22 కోట్లు, సిగ్నలింగ్, టెలికాం అవసరాలకు రూ.8 కోట్లు, ఇతరత్రా పనులకు రూ.36 కోట్లు అవసరమవుతుందని పేర్కొంది. దీనికి రైల్వేశాఖ కూడా ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో తాజా బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం రూ.150 కోట్లు కేటాయించింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఈ పీరియాడికల్ ఓవర్ హాలింగ్ (పీవోహెచ్) వ్యాగన్ వర్క్షాపు పనులు ప్రారంభం కావడానికి మార్గం సుగమమైంది. మరమ్మతులు, నిర్వహణ పనులు ఈ వర్క్షాపులో 200 వరకు పాసింజరు, ఎక్స్ప్రెస్, గూడ్స్ రైళ్ల బోగీలు, ఆయిల్ ట్యాంకర్లకు మరమ్మతులు, నిర్వహణ పనులు చేయడానికి వీలవుతుంది. ఇన్నాళ్లూ నిధులు కేటాయించినా, శంకుస్థాపన చేయడానికి వీలుపడలేదు. శంకుస్థాపన జరగకుండా పనులు మొదలు పెట్టే అవకాశం లేదు. ఈ బడ్జెట్లో ఆశించిన స్థాయిలో రూ.150 కోట్లు కేటాయించడంతో త్వరలోనే ఈ వ్యాగన్ వర్క్షాపు పనులు మొదలు పెడతామని రైల్వే వర్గాలు ‘సాక్షి’కి చెప్పాయి. దీంతో వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి ఈ వ్యాగన్ వర్క్షాప్ను పూర్తి చేస్తామని చెబుతున్నాయి. -
హడావుడిగా పనుల ప్రారంభం
వజ్రకరూరు : హంద్రీనీవా ద్వారా నియోజకవర్గంలోని 80 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని కోరుతూ ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో నేడు మండలంలోని రాగులపాడు ఎత్తిపోతల ముట్టడి కార్యక్రమాన్ని తలపెట్టిన నేపథ్యంలో హంద్రీనీవా డిస్ట్రిబ్యూటరీల పనులను ప్రభుత్వం హడావుడిగా ప్రారంభించింది. మండల పరిధిలోని ధర్మపురి వద్ద హంద్రీనీవా మైనర్కాలువlపనులను అధికారులు ఆదివారం ప్రారంభించారు. నియోజకవర్గంలోని 80 వేల ఎకరాల ఆయకట్టుకు ప్రభుత్వం డిస్ట్రిబ్యూటరీల పనులు ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఒకప్పుడు ఎన్నో కష్టాలు.. పాన్ ఇండియా హీరో అయ్యాడు!
వేసవిలో నెయ్యిని తీసుకుంటే బోలెడన్ని లాభాలు!
టీడీపీ నేతల రౌడీయిజం.. YSRCP నేతలపై దాడులు
HBD Pat Cummins: సన్రైజర్స్ కెప్టెన్ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)
జేపీ నడ్డాకు పోలీసుల సమన్లు
కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారు: లక్ష్మీ పార్వతి
ఉద్యోగుల తొలగింపు..టీసీఎస్లో అసలేం జరుగుతోంది?
టీడీపీ నేతల రౌడీయిజం.. పిన్నెల్లి భార్యకు గాయాలు
Haryana: మైనార్టీలో బీజేపీ! మాజీ సీఎం కీలక వ్యాఖ్యలు
పాక్ను ఓడించగానే రాత్రంతా సంబరాలు: రషీద్ ఖాన్
తప్పక చదవండి
- ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ఏనుగుల దాడిలో వీడియో జర్నలిస్టు మృతి
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- తెలుగులో డైరెక్ట్గా ఓటీటీలోకి వస్తున్న మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- వెస్ట్ నైలు వైరస్ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..
- SRH vs LSG: ఉప్పల్ మ్యాచ్కు వెళ్తున్న వారికి అలర్ట్! ఇలా అయితే..
- అధికారం శాశ్వతం కాదు.. వడ్డీతో చెల్లించే టైం వస్తుంది:కేటీఆర్
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- Konathala Ramakrishna: మీ సంగతి చూస్తాం
Advertisement