-
ఎల్ఆర్ఎస్ పిడుగు!
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్).. రాష్ట్రంలో లక్షలాది మందిని ఇరకాటంలో పడేసింది. లే–అవుట్లు లేని వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన పాపానికి ఇప్పుడు మూల్యం చెల్లించుకునే పరిస్థితి దాపురించింది. గ్రామాలు, పట్టణాల్లో లే–అవుట్లు లేని ప్లాట్లను క్రమబద్ధీకరించుకోవాలన్న ప్రభుత్వ ఆదేశాలతో పరిస్థితులు ఒక్కసారిగా తారుమారయ్యాయి. నూతన విధానంతో ప్లాట్లు క్రమబద్ధీకరణ ఫీజు అధికంగా ఉండటంతో ఆ మేరకు వెచ్చించడం పేదలకు భారంగా మారింది. ఇప్పుడు ఎల్ఆర్ఎస్ పేరుతో మళ్లీ రూ. వేలల్లో చెల్లించాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 14,569 లే–అవుట్లు ఉండగా.. వాటిలో 3,568కు మాత్రమే నిబంధనల ప్రకారం అనుమతులు ఉన్నాయి. 11,001 లే–అవుట్లకు ఎలాంటి అనుమతులు లేవు. అనధికార లే–అవుట్లు అని తెలియక చాలామంది భవిష్యత్తు, ఇతర అవసరాల దృష్ట్యా ప్లాట్లు కొనుగోలు చేశారు. వీటిలో రెండు, మూడుసార్లు చేతులు మారి రిజిస్ట్రేషన్లు జరిగిన సందర్భాలు ఉన్నాయి. అయితే అనధికార లే–అవుట్లలో ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయకుండా ఉండి ఉంటే తాము జాగ్రత్త పడి ఉండేవారమని బాధితులు చెబుతున్నారు. ఇదిలాఉండగా అక్రమ లే–æఅవుట్లలో ప్లాట్లు రిజిస్ట్రేషన్లు చేయడాన్నీ వారు తప్పుబడుతున్నారు. అక్రమ లే–అవుట్లను గుర్తించి వాటిలో ప్లాట్ల క్రయవిక్రయాలు నిషేధించడం, బోర్డులు ఏర్పాటు చేసి కొనుగోలు చేస్తే ఎదురయ్యే ఇబ్బందులపై అవగాహన కల్పించాల్సిన అధికారులు గతంలో ఇవేమీ పట్టించుకోకపోవడంతోనే తాము మోసపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘రియల్’వ్యాపారులకు వరం అక్రమ ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం ప్రవేశపెట్టిన ఎల్ఆర్ఎస్ చాలామంది సామాన్యులపై భారం మోపుతుండగా, కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మాత్రం వరంగా మారింది. రియల్టర్లు ఎలాంటి అనుమతులు లేకుండా ప్లాట్లు చేసి అమాయకులకు అంటగట్టారు. తాజాగా ఎల్ఆర్ఎస్ అమలుతో ఆ ప్లాట్లు కొనుగోలు చేసిన పేదలపై చార్జీల భారం పడింది. ఇదిలాఉండగా జిల్లా టౌన్ కంట్రీ ప్లానింగ్ (డీటీసీపీ) అనుమతి లేకుండానే నాలా కన్వర్షన్ చేయకుండా, సరైన రోడ్లు, కనీస వసతులు లేకుండా ఏర్పాటు చేసిన అక్రమ వెంచర్లకు ఎల్ఆర్ఎస్ వరంగా మారింది. ఎల్ఆర్ఎస్ చార్జీ చెల్లించడం ద్వారా అక్రమ లే–అవుట్లు సక్రమంగా మార్చుకునే వీలు కలుగుతుంది. ప్రస్తుతం ప్లాట్లు విక్రయిస్తున్న రియల్టర్లు ఈ ప్లాట్లు విక్రయించేటప్పుడు ఎల్ఆర్ఎస్ సైతం కలుపుకొని ధరలు పెంచి చెబుతున్నారు. ఫలితంగా భవిష్యత్లో ప్లాట్ల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. జిల్లాల వారీగా ఇలా.. రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 3,416 లే–అవుట్లు ఉండగా వాటిలో 1,609కి మాత్రమే ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలో 1,014 లే–అవుట్లు ఉండగా 296, యాదాద్రి భువనగిరి జిల్లాలో 1,480 లే–అవుట్లకు గాను 489, నిజామాబాద్ జిల్లాలో 952 లే–అవుట్లకు 176, మేడ్చల్ జిల్లా మల్కాజిగిరిలో 825కు 223, నాగర్కర్నూల్ జిల్లాలో 676 లే–అవుట్లు ఉంటే 72కు మాత్రమే అనుమతులు ఉన్నాయి. కాగా పెద్దపల్లి జిల్లాలో 58, జగిత్యాలలో 170 లే–అవుట్లు ఉంటే వాటిలో ఒక్క దానికి అనుమతి లేదు. ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు బుజగౌని రాఘవేందర్గౌడ్. మూడేళ్ల క్రితం మహబూబ్నగర్ రూరల్ మండలం బొక్కలోనిపల్లిలో సర్వే నం.375/ఆ లో 150 గజాల ప్లాటు కొనుగోలు చేశాడు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నాడు. ఆ ప్లాట్లు అక్రమమని, ఎల్ఆర్ఎస్ చెల్లించాలని మున్సిపల్ అధికారులు చెప్పడంతో ఆందోళనలో పడ్డాడు. అయితే.. అప్పుడే అక్రమమని చెప్పి రిజిస్ట్రేషన్ ఆపితే కొనేవాళ్లమే కాదని, ఇప్పుడు ఈ తిప్పలు తప్పేవంటున్నాడు. ఇతనొక్కడే కాదు రాష్ట్రంలో అక్రమ వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారందరిదీ ఇదే ఆవేదన. రాష్ట్రంలో మొత్తం లే–అవుట్లు: 14,569 లే–అవుట్ల పరిధిలో ప్లాట్లు: 16,22,681 ప్లాట్ల విస్తీర్ణం (ఎకరాల్లో): 1,22,338.24 అనుమతులు లేని లే–అవుట్లు: 11,001 వాటి పరిధిలో ప్లాట్లు: 12,14,574 విస్తీర్ణం: 83,452.12 అనుమతులున్న లే–అవుట్లు: 3,568 వాటి పరిధిలో ప్లాట్లు: 4,08,107 విస్తీర్ణం: 38,886.12 -
పొలాలు.. ప్లాట్లు
లేఔట్ను తలపించేలా హంగూ ఆర్భాటాలు హద్దు రాళ్లు తొలగిస్తున్నా ఆగని వ్యాపారం తాజాగా హాజీపూర్ మండల ప్రకటన ఇక జోరందుకోనున్న భూ వ్యాపారాలు మంచిర్యాల రూరల్ : జిల్లా కేంద్రంగా మారనున్న మంచిర్యాల మండలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతోంది. పచ్చని పంట పొలం వెంచర్ గా మారుతోంది. మంచిర్యాల జిల్లా, నస్పూర్, హాజీపూర్ మండలాల ప్రకటనతో రియల్ వ్యా పారం వేగం పుంజుకుంది. లేఔట్ పొలాలు.. ప్లాట్లు అనుమతి లేకున్నా.. హంగూ ఆర్భాటాలతో లేఔట్ను తలపిస్తూ ప్లాట్లు విక్రరుుస్తున్నారు. అనుమతి లేని లేఔట్లపై కొరడా ఝళిపించాలని ఇప్పటికే కలెక్టర్ జగన్మోహన్ డివిజన్, మండల స్థారుు అధికారులను ఆదేశించారు. దీంతో జిల్లా పంచాయతీ అధికారి పోచయ్య ఆధ్వర్యంలో డివిజనల్ పంచాయతీ అధికారి ప్రత్యేక అధికారిగా ఈవోపీఆర్డీ, పంచాయతీ కార్యదర్శులతో ఐదు ప్రత్యేక బృందాలు ఏర్పాటయ్యూరుు. నెల రోజుల క్రితం మంచిర్యాల మండల పరిధిలోని పలు గ్రామాల్లో 120 ఎకరాల్లో ఏర్పాటు చేసిన అనుమతిలేని లేఔట్లలో హద్దు రాళ్లు తొలగించారు. అరుునా రియల్ వ్యాపారులు అదేం పట్టించుకోకుండా భూ దందా సాగిస్తున్నారు. అధికారులు ఓ వైపు నోటీసులు జారీ చేస్తూ దశలవారీగా హద్దు రాళ్లు తొలగిస్తున్నా రియల్ వ్యాపారుల ఆగడాలు ఆగడం లేదు. మండలంలో 16 గ్రామ పంచాయతీలు ఉండగా.. ప్రధానంగా నస్పూర్, తీగల్పహాడ్, వేంపల్లి, ముల్కల్ల, గుడిపేట, హాజీపూర్, దొనబండ, నర్సింగాపూర్, రాపల్లి గ్రామాల్లో రియల్ దందా సాగుతోంది. తాజాగా హాజీపూర్ మండల ప్రకటనతో భూముల ధరకు రెక్కొలొచ్చాయి. మంచిర్యాల జిల్లా ఏర్పాటుతోపాటు హాజీపూర్, నస్పూర్ మండలాల ప్రకటనతో భూములకు భారీగా డిమాండ్ పెరిగింది. ఇదే అదునుగా రియల్ వ్యాపారులు ఇష్టారాజ్యంగా వెంచర్లు ఏర్పాటు చేస్తున్నారు. రోడ్లు, విద్యుత్ స్తంభాలు వేస్తున్నారు. పచ్చని పంట పొలాల మధ్య.. జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న పంట పొటాలు, మామిడి వనాల్లో వెంచర్లు తయారవుతున్నాయి. గత నెలలో తొలగించిన హద్దురాళ్లను తిరిగి యధాస్థానంలో ఏర్పాటు చేస్తూ కొత్తగా ప్లాట్లు చేస్తున్నారు. అమాయక ప్రజలకు లేఔట్లేని ప్లాట్లను అంటగడుతూ సొమ్ము చేసుకుంటున్నారు. అనుమతి లేకుండా ప్లాట్లు చేస్తున్న వారికి నోటీసులు అందతున్నా స్పందించని కారణంగా అధికారులు చర్యలకు సిద్ధమయ్యూరు. నిర్ధారించుకుని కొనుగోలు చేయాలి.. మండలంలోని ఆయా గ్రామాల్లో అనుమతి లేకుండా అక్రమ లేఔట్లు వెలుస్తున్నారుు. అలాంటి స్థలాలు కొనుగోలు చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు ఉంటాయి. రియల్ వ్యాపారుల వలలో పడి మోసపోవద్దు. ఇప్పటికే నోటీసులు జారీ చేయగా హద్దురాళ్లను సైతం తొలగించాం. ప్రజలు స్థలాలు కొనుగోలు చేసే సమయంలో అన్ని పరిశీలించి తగిన నిర్ధారణకు వచ్చిన తర్వాత కొనుగోలు చేయూలి. - శంకర్, ఈఓపీఆర్డీ, మంచిర్యాల
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement