-
కోవిన్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్కు తీవ్ర ఇక్కట్లు
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా సంక్రమణకు ముకుతాడు వేసేందుకు మే 1వ తేదీ నుంచి ప్రారంభంకానున్న వ్యాక్సినేషన్ మూడోదశకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల నుంచి రిజిస్ట్రేషన్కు అనుమతించగా... రద్దీ కారణంగా నమోదు చేసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. 18 నుంచి 44 ఏళ్ల లోపు వారికి వ్యాక్సినేషన్ కోసం ఆన్లైన్లో అపాయింట్మెంట్ తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. అయితే దేశవ్యాప్తంగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసం ప్రజలు ఒక్కసారిగా ప్రయత్నించడంతో కోవిన్ పోర్టల్ క్రాష్ అయ్యింది. ఆరోగ్య సేతు, ఉమంగ్ యాప్లోనూ ప్రజలు ఇలాంటి సమస్యను ఎదుర్కొన్నారు. కోవిన్ సైట్ నిమిషానికి దాదాపు 27 లక్షల హిట్లు వచ్చాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. భారీ ట్రాఫిక్ కారణంగా రిజిస్ట్రేషన్కు ప్రజలు ఇక్కట్లు పడ్డారు. రాష్ట్రాలు, ప్రైవేటు టీకా కేంద్రాలు అందుబాటులో ఉంచిన స్లాట్ల ఆధారంగా టీకా సమయాన్ని కేటాయిస్తామని అధికారులు తెలిపారు. అయితే కొద్దిగంటల తర్వాత కోవిన్ పోర్టల్పై లోడ్ తగ్గిన అనంతరం ప్రజలు తమపేరు నమోదు చేసుకోగలిగారు. అయినప్పటికీ వారి ప్రాంతం ఆధారంగా స్లాట్ బుకింగ్కు మాత్రం అవకాశం ఇంకా ఇవ్వలేదు. టీకాల లభ్యత ఉంటేనే... వ్యాక్సిన్ వేయించుకోవాలనుకొనే 18 ఏళ్లు నిండిన వారికి ప్రైవేటు, రాష్ట్ర ప్రభుత్వ కేంద్రాలు అందుబాటులో ఉంచే స్లాట్ల లభ్యత ఆధారంగా మాత్రమే అపాయింట్మెంట్లు లభిస్తాయి. అంటే వ్యాక్సిన్లు లభ్యంగా ఉండి... మే 1 నుంచి టీకాలు వేయడానికి సిద్ధం గా ఉన్న కేంద్రాల ఆధారంగా మాత్రమే ప్రజలకు అపాయింట్మెంట్ ఇవ్వనున్నారు. ఆర్డర్లు పెట్టి నా సరే.. పలు రాష్ట్రాలు, ప్రైవే టు ఆసుపత్రులకు టీకాలు అందడానికి సమయం పడుతుందని ఫార్మారం గ నిపుణులు అంటున్నారు. మరోవైపు పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా టీకాల లభ్యత లేనందున మే 1 నుంచి 18–44 ఏళ్ల వారికి వ్యాక్సిన్ వేయడం సాధ్యం కాదనే చెబుతున్నాయి. అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ప్రయత్నించి ఫెయిల్ అయిన అనేకమంది సోషల్మీడియా వేదికగా తమ ఆగ్రహాన్ని వెళ్ళగక్కారు. కోవిన్ పోర్టల్ స్పందించడం లేదని కొందరు, సైట్ క్రాష్ అయ్యిందని మరికొందరు సోషల్ మీడియాలో ఫిర్యాదు చేశారు. అయితే కోవిన్ పోర్టల్ పనిచేస్తోందని, సాయంత్రం 4 గంటలకు సైట్లో వచ్చిన చిన్న లోపం పరిష్కారం అయ్యిందని ఆరోగ్య సేతు ట్విట్టర్ హ్యాండిల్ నుంచి సాయంత్రం 4.35 గంటలకు ఒక ట్వీట్ వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేట్ వ్యాక్సినేషన్ కేంద్రాలు వ్యాక్సినేషన్ సెషన్లను షెడ్యూల్ చేసిన తర్వాత 18+ వారికి వ్యాక్సిన్ అపాయింట్మెంట్లు సాధ్యమవుతాయని సాయం త్రం 4.54 గంటలకు ఆరోగ్యసేతు యాప్ నుంచి ట్వీట్ వచ్చింది. కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలే అందుబాటులో ఉన్నాయి. కేంద్రం ఇటీవలే రష్యాకు చెందిన స్పుత్ని క్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతించి విషయం తెలిసిందే. మరికొద్ది వారాల్లో స్పుత్నిక్ కూడా అందుబాటులోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఇతర విదేశీ వ్యాక్సిన్లకు కూడా అత్యవసర వినియోగానికి వేగంగా అనుమతులు ఇచ్చే ప్రక్రియను కేంద్రం మొదలుపెట్టింది. సాఫీగానే జరిగాయి: ఆరోగ్యశాఖ ప్రజలు సోషల్మీడియాలో చేసిన ఫిర్యాదులు, మీడియా రిపోర్టులపై కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం రాత్రి వివరణ ఇచ్చింది. రిజిస్ట్రేషన్లు సాఫీగానే జరిగాయని తెలిపింది. తొలిరోజు బుధవారం 4 నుంచి 7 గంటల మధ్యలో 80 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగాయని పేర్కొంది. ఆరంభంలో నిమిషానికి 27 లక్షల హిట్లు వచ్చాయని... తర్వాత ప్రతిసెకనుకు 55 వేల హిట్లు వస్తున్నాయని, కోవిన్ పోర్టల్ సాఫీగా, సమర్థవంతంగా పనిచేస్తోందని తెలిపింది. త్వరలోనే రిజిస్ట్రేషన్ల వివరాలను కోవిన్ పోర్టల్లో పెడతామని పేర్కొంది. -
ఎన్ఆర్సీ జాబితా: వెబ్సైట్ క్రాష్
గువాహటి : అసోం ఎన్ఆర్సీ తుది జాబితా విడుదల నేపథ్యంలో ఎన్ఆర్సీ అధికారిక వెబ్సైట్ క్రాష్ అయింది. భారత పౌరులను గుర్తించే నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్(ఎన్ఆర్సీ) గురువారం ఉదయం 10 గంటలకు తుది జాబితా విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ జాబితా విడుదల అయిన పది నిమిషాలకే వెబ్సైట్ స్తంభించిపోయింది. మీసేవా కేంద్రాలలో ప్రస్తుతం సైట్ను చేరుకోలేం అంటూ చూపిస్తోంది. దీంతో అనేకమంది తుది జాబితాలో తమ పేరు ఉందో లేదో చూసుకోడానికి క్యూ లైనల్లో నిల్చోని ఉండిపోయారు. కాగా తుది ఎన్ఆర్సీ జాబితాలో మొత్తం 3.11 కోట్ల మందిని అసోం పౌరులుగా గుర్తించగా, 19 లక్షల మందికి ఈ జాబితాలో చోటు దక్కలేదు. జాబితాలో చోటు లేని వారిని చట్టపరమైన ఎంపికలు జరిగే వరకు విదేశీయులుగా ప్రకటించలేమని కేంద్రం తెలిపింది. అంతేగాక జాబితాలో పేరు లేని వారు విదేశీయుల ట్రిబ్యునల్కు అప్పీలు చేసుకోవచ్చని వెల్లడించింది. ప్రజలు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మీ సేవ కేంద్రాలలో తమ పేర్లను చూసుకోవాలని అధికారులు వెల్లడించారు. చదవండి: ఎన్ఆర్సీ అసోం తుది జాబితా; 19.6 లక్షల మంది అవుట్! -
బీబీసీ సహా.. ప్రధాన వెబ్సైట్లు క్రాష్!
బీబీసీ, ఉబెర్, నెట్ఫ్లిక్స్.. ఇలాంటి డజన్ల కొద్దీ ప్రధాన వెబ్సైట్లు ఉన్నట్టుండి క్రాష్ అయ్యాయి. అయితే వీటిలో చాలావరకు కొద్ది సేపటికే మళ్లీ మామూలుగా పనిచేయడం ప్రారంభించాయి. ఇలా ఎందుకు క్రాష్ అయ్యాయన్న విషయం తెలియలేదు గానీ, క్లౌడ్ సర్వీసులో లోపం వల్లే అయ్యిందేమోనని అంటున్నారు. సోషల్ మీడియాలో మాత్రం ఇదేదో కుట్ర జరిగిందన్న వదంతులు బాగా వ్యాపించాయి. మొబైల్, ట్యాబ్, డెస్క్టాప్, ల్యాప్టాప్.. ఇలా అన్ని డివైజ్లలోనూ సమస్య వచ్చినట్లు నెట్ఫ్లిక్స్ తన కస్టమర్ సర్వీస్ ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపింది. సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. అల్ట్రాడీఎన్ఎస్ క్లౌడ్ సర్వీసులో సాంకేతిక సమస్య కారణంగానే తమకు ఇబ్బంది ఎదురైందని నెట్ఫ్లిక్స్ ప్రతినిధి జోరిస్ ఎవర్స్ తెలిపారు. దాదాపు రెండు డజన్ల వెబ్సైట్లు ఇలా క్రాష్ అయినట్లు ఇంటర్నెట్ ట్రబుల్ ట్రాకర్ కరెంట్లీడౌన్.కామ్ తెలిపింది. ఆ వెబ్సైట్ల జాబితాను కూడా అది వెల్లడించింది. ద ఎకనమిస్ట్, అమెరిట్రేడ్ లాంటి సైట్లు కూడా ఇందులో ఉన్నాయి.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్మన్ గిల్కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement