breaking news
Web Land method
-
‘వెబ్’ దడ!
చిలకలూరిపేట రూరల్: అన్నదాతల కష్టాలకు అంతుండటం లేదు. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వారి వెతలను మరింత ఎక్కువ చేస్తోంది. రైతులకు చెందిన సాగుభూముల వివరాలను నమోదు చేసేందుకు రూపొందించిన ‘వెబ్ల్యాండ్’ సైట్ నిర్వహణ దారుణంగా ఉండటంతో రైతన్నలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రుణ మాఫీ వర్తింపునకు భూమి యూజమాన్య పత్రాల నకళ్లు సమర్పించాలని బ్యాంకులు డిమాండ్ చేస్తుండటం, ఆన్లైన్లో ఆ పత్రాల జారీ నిలిచిపోవటం ఇందుకు కారణం. రెండేళ్లుగా సాగుతున్న ప్రహసనం వెబ్ల్యాండ్ సైట్లో సాగు భూములు, వాటి యజమానుల వివరాల నమోదు ప్రక్రియ రెండేళ్లుగా సాగుతోంది. అరుునా ఇప్పటికీ చాలా భూములు, యజమానుల వివరాలు నమోదు కాలేదు. రుణమాఫీ వర్తింపునకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం ఇటీవల విడుదల చేయటంతో అడంగల్, పట్టాదార్ పాస్ పుస్తకం, వన్-బి రిజిస్టర్ పత్రాల కోసం రైతులు మీ-సేవ కేంద్రాలు, రెవెన్యూ కార్యాలయూలు, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. రుణ మాఫీకి బ్యాంకర్ల మెలిక రుణ మాఫీ ఉత్తర్వులను ప్రభుత్వం విడుదల చేయటంతో బ్యాంకుల అధికారులు వివిధ రకాల పత్రాల నకళ్లను సమర్పించాలని రైతులను ఆదేశిస్తున్నారు. కొన్ని బ్యాంక్ శాఖలు కేవలం ఆధార్ కార్డు నకలు, ఫోన్ నంబర్లు తీసుకుంటుండగా మరికొన్ని బ్యాంక్ శాఖలు పట్టాదారు పాస్పుస్తకం, ఆధార్ కార్డు, అడంగల్, వన్-బి రిజిస్టర్ నకళ్లు ఇవ్వాలని స్పష్టం చేస్తున్నారుు. కొన్ని బ్యాంకులు రేషన్ కార్డు నకలు కూడా అడుగుతుండటం విస్మయం కలిగిస్తోంది. ఈ నెల 29వ తేదీలోగా వీటిని సమర్పించాలని కొన్ని బ్యాంకుల శాఖలు గడువు విధించటంతో రైతులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. పనిచేయని వెబ్సైట్ వారం రోజులుగా వెబ్ల్యాండ్ ఆన్లైన్ సైట్ ఓపెన్ కావటం లేదు. దీంతో మీ సేవ కేంద్రాల్లో ఆయూ పత్రాల నకళ్లు జారీ కావటం లేదు. మరోవైపు భూములు, రైతుల వివరాలను రెవెన్యూ సిబ్బంది నమోదు చేయలేకపోతున్నారు. రెండేళ్లరుునా తమ వివరాలు ఎందుకు నమోదు చేయలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంగళ, బుధవారాల్లో పలువురు రైతులు చిలకలూరిపేట తహశీల్దార్ కార్యాలయూనికి వచ్చి రెవెన్యూ సిబ్బందిని నిలదీశారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 3న బ్యాంకర్ల సమావేశం సమస్యపై జిల్లా లీడ్బ్యాంక్ మేనేజర్ బి.ఎల్.ఎన్.శాస్త్రిని వివరణ కోరగా జిల్లాలో పంట రుణాలు తీసుకున్న రైతుల వివరాలను సెప్టెంబర్ 10వ తేదీలోగా అందించాలని ప్రభుత్వం కోరిందని చెప్పారు. రైతులు తమ భూమి యూజమాన్య పత్రాల నకళ్లు, ఆధార్ వివరాలు సమర్పిస్తే రుణ మాఫీకి అర్హత ఉన్నవారెవరో తెలిసే అవకాశం ఉంటుందన్నారు. ఈ అంశంపై వచ్చే నెల 3న చిలకలూరిపేటలో బ్యాంకర్ల సమావేశం ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఆన్లైన్ సమస్యే కారణం.. కొన్ని గ్రామాల్లో కొందరు రైతులకు చెందిన సాగుభూముల వివరాలు వెబ్ల్యాండ్లో నమోదు కాలేదని, ఆన్లైన్ అనుసంధానం కాకపోవటంతో సమస్య తలెత్తిందని చిలకలూరిపేట తహశీల్దార్ జి.వి.ఎస్.ఫణీంద్రబాబు చెప్పారు. రైతులకు అవసరమైన పత్రాలను త్వరలో అందిస్తామన్నారు. రైతుల భూమి యూజమాన్య పత్రాలను చిలకలూరిపేటలోని బ్యాంకర్లు మాత్రమే కోరుతున్నారని చెప్పారు. దీనిపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. -
రైతులకు హై సెక్యూరిటీ పాస్ పుస్తకాలు
నర్సాపూర్, న్యూస్లైన్: హై సెక్యూరిటీ పట్టాదార్ పాస్ పుస్తకాలు త్వరలో రైతులకు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ప్రయోగాత్మకంగా పలు పాస్ పుస్తకాలు స్థానిక తహ శీల్దార్ కార్యాలయానికి వచ్చాయి. భూముల రిజిస్ట్రేషన్లు పూర్తవగానే నేరుగా తహశీల్దార్ కార్యాలయాలకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు వచ్చే విధంగా వెబ్ల్యాండ్ పద్ధతి అమలులోకి వచ్చింది. రిజిస్ట్రార్ డాక్యుమెంట్లు తహ శీల్దార్ కార్యాలయానికి రాగానే వీఆర్ ఓలు సంబంధిత గ్రామ రెవెన్యూ రికార్డులలో వాటిని నమోదు చేస్తారు. కాగా గతంలో పాత పాస్ పుస్తకాల్లో తాజాగా కొనుగోలు చేసిన భూముల వివరాలు రాసేవారు. హై సెక్యూరిటీ పట్టాదార్ పాస్ పుస్తకాల వచ్చిన నేపథ్యంలో రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు రాగానే రెవెన్యూ సిబ్బంది తమ రికార్డులలో నమోదు చేస్తే సరిపోతుంది. సబ్ రిజిస్ట్రార్,తహశీల్దార్ కార్యాలయాలను వెబ్ల్యాండ్లో భాగంగా అనుసంధానం చేసినందున భూముల విక్రయాల సమాచారం ఆయా కార్యాలయాల నుంచి నేరుగా ప్రభుత్వ సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్కు పూర్తి సమాచారం చేరుతుంది. అక్కడ పాస్ పుస్తకాలు ముద్రించి సంబంధిత మండల తహశీల్దార్ కార్యాలయాలకు పాస్ పుస్తకాలు పంపితే స్థానిక రెవెన్యూ అధికారులు వాటిని సంబంధిత లబ్ధిదారులకు అందచేస్తారు. తాజాగా భూముల కొనుగోలు చేసిన వ్యక్తుల పేర గతంలో పాస్ పుస్తకం జారీ చేసి ఉంటే అదే నంబరుతో కొత్తగా మరో పాస్ పుస్తకంలో పాత భూములతో పాటు తాజాగా కొనుగోలు చేసిన భూముల వివరాలు కలిపి కొత్తగా పాస్ పుస్తకం జారీ అవుతుంది. అంతకు ముందు భూములు లేని పక్షంలో కొత్తగా పాస్ పుస్తకం జారీ అవుతుంది. ఇదిలా ఉండగా పట్టాదార్ పాస్పుస్తకంలో రైతుల ఫొటో, స్కాన్ చేసిన వారి సంతకంతో పాటు కులం, గ్రామం, భూములు వివరాలు, వారు చెల్లించాల్సిన శిస్తు వివరాలు, పూర్తి అడ్రసు పొందు పరుస్తున్నారు. అంతేగాక సంబంధిత మండల తహశీల్దార్ సంతకం స్కాన్ చేసి వస్తుంది. కాగా ప్రభుత్వం తాజాగా రూపొందించిన హై సెక్యూరిటీ పాస్ పుస్తకాలు శుక్రవారం నర్సాపూర్ మండలంలోని మంతూర్కు చెందిన రైతులకు చెందిన ఆరు పాస్ పుస్తకాలు వచ్చాయి. వాటిని త్వరలో అందచేస్తామని అధికారులు చెప్పారు. నకిలీని అరికట్టేందుకు కొత్త పుస్తకాలు: తహశీల్దార్ పట్టాదార్ పాస్ పుస్తకాలలో నకిలీవి అరికట్టేందుకు హై సెక్యూరిటీ పాస్ పుస్తకాలు ఎంతో దోహదపడతాయని స్థానిక తహశీల్దార్ నరేందర్ చెప్పారు. వాటితో రైతులకు ఎంతో మేలు చేకూరుతుందని అన్నారు. అందులో రైతుల అన్ని భూముల వివరాలు, శిస్తు, ఇతర వివరాలు ఉంటాయని, చేతి రాత అసలే ఉండదని చెప్పారు. కాగా మొదటగా నర్సాపూర్కు ఆరు హై సెక్యూరిటీ పాస్ పుస్తకాలు వచ్చాయని వాటిన త్వరలో లబ్ధిదారులకు అందచేయనున్నట్లు ఆయన తెలిపారు. దశలవారీగా అందరికీ హై సెక్యూరిటీ పాస్ పుస్తకాలు త్వరలో వస్తాయని ఆయన తెలిపారు.