breaking news
v.srinivas goud
-
తీర్పు.. ద్రోహులకు చెంపపెట్టు కావాలి
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల టీఆర్ఎస్ అభ్యర్థి దేవీప్రసాద్ గెలుపు తెలంగాణ ద్రోహులకు చెంపపెట్టుకావాలని మంత్రులు జూపల్లి కృష్ణారావు, సి.లక్ష్మారెడ్డి, పార్లమెంటరీ కార్యదర్శి వి.శ్రీనివాస్గౌడ్ పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లాకేంద్రంలో పార్లమెంటరీ కార్యదర్శి శ్రీనివాస్గౌడ్ ఇంట్లో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణకు అనుకూలమైన బీజేపీ, తెలంగాణద్రోహల పార్టీ టీడీపీతో ఎలా పొత్తు పెట్టుకుంటుందని ప్రశ్నిం చారు. తెలంగాణకు నీళ్లు, విద్యుత్ విషయంలో టీడీపీ అన్యాయం చేస్తుందన్నారు. అలాంటి పార్టీ మద్ద తు తెలుపుతున్న బీజేపీ అభ్యర్థికి ఓటు వేస్తే అది తెలంగాణ వ్యతిరేకులకు వేసినట్లు అవుతుందన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలనే ఉద్ధేశంతో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉద్యోగసంఘాల నేత దేవీప్రసాద్ను కేసీఆర్ ప్రకటించారని పేర్కొన్నారు. 43 శాతం ఫిట్మెంట్, ఉద్యోగులకు హెల్త్కార్డులు సాధించడంలో తమతోపాటు దే వీప్రసాద్ కృషి చాలా ఉందన్నారు. ఎన్నికల తరువాత పాలమూరు ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. తెలంగాణను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దేవీప్రసాద్కు మద్దతుగా ప్రచారంలో భాగంగా ఈనెల 5వ తేదీ జడ్చర్లలో సాయంత్రం 4, 6 గంటలకు మహబూబ్నగర్లో, 7న సాయంత్రం 4 గంటలకు కొత్తకోట, 6 గంటలకు వనపర్తిలో, 8న ఉదయం 10 గంట లకు కొల్లాపూర్లో, 12 గంటలకు నాగర్కర్నూల్లో, 2 గంటలకు అచ్చంపేట్లో 4 గంటలకు కల్వకుర్తి లో కార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్నట్లు మంత్రులు తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్సీ జగదీశ్వర్రెడ్డి, పెద్దిరెడ్డి, రాజేశ్వర్గౌడ్, విఠల్రావుఆర్యా, కోరమోనివెంకటయ్య, ఆనంద్, బెనహార్, సుధాకర్రెడ్డి పాల్గొన్నారు. -
క్రమబద్ధీకరణలో అక్రమాలుండవు: శ్రీనివాస్గౌడ్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనా విధానాలకు అనుగుణంగా.. అవకతవకలకు తావు లేకుండా పేదల ఇళ్లను ఉచితంగా క్రమబద్ధీకరించేందుకు కృషి చేయనున్నట్లు పార్లమెంటరీ కార్యదర్శి వి.శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. గురువారం రెవెన్యూ శాఖ బాధ్యతలు స్వీకరించిన ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ దశాబ్దాలుగా అధికారికంగా రిజిస్ట్రేషన్లు లేక 125 గజాలలోపు ఇళ్లలో నివసిస్తున్న వారు రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది ఉన్నారని, వారంతా సీఎం తాజాగా తీసుకున్న నిర్ణయంతో సంతోషంగా ఉన్నారన్నారు. ఈ విధానంతో ఇళ్లు అమ్ముకోవాలనుకున్నా, కూల్చివేసి కొత్తగా నిర్మాణాలు చేసుకోవాలన్నా ఇకపై ఇబ్బంది ఉండదని చెప్పారు. అన్యాక్రాంతమైన విలువైన భూములను కాపాడడం, దళితులకు భూ పంపిణీ సక్రమంగా జరిగేలా చూడడం వంటి అంశాలపై దృష్టి పెట్టనున్నట్లు చెప్పారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ సారథ్యంలో ఆయనతో కలసి రెవెన్యూ విభాగాన్ని పటిష్టం చేయనున్నట్లు వివరించారు. -
'అవమానాలు పడ్డ చోటే.. లక్ష కోట్ల బడ్జెట్'
బడ్జెట్పై అసెంబ్లీలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే వి.శ్రీనివాసగౌడ్ లక్ష కోట్లకు పైగా బడ్జెట్ను పెట్టుకోవడం, ఏ అసెంబ్లీలో అవమానపడ్డారో అక్కడే కేటాయించుకోవడం పట్ల ప్రజలు గర్వపడుతున్నారు. ఉద్యమ నేతగా 14 ఏళ్లు పాటుపడిన సంపూర్ణ అవగాహనతో సీఎంగా కేసీఆర్ 43 అంశాలపై కేబినెట్ నిర్ణయాలు చేశారు. మన వూరు-మన ప్రణాళిక, సమగ్ర కుటుంబ సర్వే వంటి ఉపయోగపడే చర్యలు తీసుకున్నారు. 90 శాతం కులవృత్తులు చెరువులపై ఆధారపడి జీవనాన్ని సాగిస్తున్నందున చెరువుల పునరుద్ధరణ, మరమ్మతులకు సీఎం చర్య తీసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, తదితర వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీని పెంచే చర్యలు తీసుకుంటున్నారు. ఉద్యోగులకు ప్రీమియం లేకుండా హెల్త్కార్డులు, పీఆర్సీ ఉద్యోగులంతా సంతోషపడేలా ఉంటుంది. అయితే తెలంగాణకు రావాల్సిన వాటాను సాధించుకునేందుకు ఆంధ్రప్రదేశ్పై, కేంద్ర ప్రభుత్వంపై పోట్లాడి సాధించుకునేందుకు పార్టీలకతీతంగా కలసి రావాలి. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అందరూ కృషి చేయాలి. రాష్ట్రానికి రావాల్సిన విద్యుత్ ఎందుకు రావడం లేదని పార్టీలకతీతంగా ప్రశ్నించాలి. రూ. వంద కోట్ల విలువైన విద్యుత్ను రాకుండా అటువైపు వారు అడ్డుకుంటున్నారు. తెలంగాణ ప్రజల్లో అపోహలు సృష్టించేలా కొందరు మాట్లాడుతున్నారు. కేవలం విద్యుత్కే కాకుండా నీళ్లు, బొగ్గు వంటి వాటిలో తెలంగాణకు కూడా తగిన వాటా రావాలి. -
పాలవుూరు పీఠమెవరికో..?
జిల్లా కేంద్రమైన మహబూబ్నగర్ అసెంబ్లీ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. తెలంగాణ కల సాకారం అరుున నేపథ్యంలో జరుగుతున్న ఈసారి ఎన్నికల్లో విజయుం ఎవరిని వరిస్తుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఉద్యవూన్ని నడిపించిన ఫలితంగానే తెలంగాణ వచ్చిందని టీఆర్ఎస్, తామిచ్చిన వూట ప్రకారమే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేశావుని కాంగ్రె స్, పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు తవు పార్టీ వుద్దతు ఇవ్వడం వల్లే తెలంగాణ వచ్చిందని బీజేపీ చెప్పుకుంటున్నారుు. వైఎస్ రాజశేఖరరెడ్డి అవులు చేసిన అనేక సంక్షేవు పథకాల కు ఓటర్ల వుద్దతు లభిస్తుందనే ధీవూతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రచారంలో వుుందుంది. వరకవుల దుర్వాసరాజు-పాలమూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున బెక్కరి శ్రీనివాసరెడ్డి బరిలో ఉన్నారు. ఇతర పార్టీలకు దీటుగా ప్రచారం చేస్తున్నారు. హోరాహోరీ ప్రయుత్నాల్లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఒబెదుల్లా కొత్వాల్ టికెట్ దక్కించుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా అదే స్థారుులో ప్రయుత్నాలు జరిగి చివరికి ఉద్యోగ సంఘాల నాయుకుడు వి.శ్రీనివాస్గౌడ్కు టికెట్ లభించింది. గత సాధారణ ఎన్నికల్లో, ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున పోటీచేసి ఓడిపోరుున సయ్యద్ ఇబ్రహీం టికెట్ రాకపోవడంతో కాంగ్రెస్లో చేరి భంగపడ్డారు. కాంగ్రెస్ లోనూ టికెట్ రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్నారు. టీఆర్ఎస్ తిరుబాటు అభ్యర్థిగా సీహెచ్ అమరేందర్నాథ్ పోటీలో ఉన్నా ప్రధాన పోటీ టీఆర్ఎస్, కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్యే ఉంటుంది. వుుగ్గురిని వరించిన వుంత్రి పదవులు ఈ స్థానంలో ఒకసారి ఉప ఎన్నికతో కలిపి మొత్తం పదిహేను సార్లు ఎన్నికలు జరిగారుు. టీడీపీ నుంచి పి.చంద్రశేఖర్ నాలుగుసార్లు గెలుపొందితే, కాంగ్రెస్ అభ్యర్థిగా ఇబ్రహీం అలీ అన్సారీ రెండుసార్లు, ఎమ్.ఆర్.రెడ్డి ఒకసారి ఇండిపెండెంట్గా, మరోసారి కాంగ్రెస్ తరఫున విజయుం సాధించారు (వురోసారి వనపర్తిలో కూడా ఆయున గెలిచారు.). 1957లో ప్రజా పార్టీ నుంచి ఇ.చిన్నప్ప విజయుం సాధించారు. ఇక్కడ గెలిచిన వారిలో ముగ్గురు మంత్రులుగా చేశారు. ఇబ్రహీం అలీ అన్సారీ, కాసు బ్రహ్మానందరెడ్డి, పీవీ నరసింహారావు, జలగం వెంగళరావు మంత్రివర్గాలలో పనిచేశారు. చంద్రశేఖర్, ఎన్టీ రావూరావు, నారా చంద్రబాబునాయుుడు వుంత్రివర్గాల్లో ఉన్నారు. 1995 తెలుగుదేశం సంక్షోభ సమయంలో ఎన్టీ రామారావు పక్షాన ఉండి ఆతర్వాత నారా చంద్రబాబు నాయుడు చెంతకు చేరిపోయూరు. 1989లో చంద్రశేఖర్ను ఓడించిన కాంగ్రెస్ అభ్యర్థి పులి వీరన్న 1993లో కోట్ల విజయభాస్కర్రెడ్డి మంత్రివర్గంలో సభ్యుడిగా ఉన్నారు. తిరుగుబాటు అభ్యర్థులకూ పట్టం ఆయా పార్టీల నుంచి టికెట్ ఆశించి భంగపడిన వారు స్వతంత్రులుగా పోటీచేస్తే ఇక్కడి ఓటర్లు పట్టం కట్టిన సందర్భాలు ఉన్నారుు. 1962, 1978లో ఎం.రామిరెడ్డి (రెండుసార్లు), 2004లో పులివీరన్న కాంగ్రెస్ తిరుబాటు అభ్యర్థులుగా విజయుం సాధించారు. 2009లో ఎన్.రాజేశ్వర్రెడ్డి ప్రజారాజ్యం రెబల్గా గెలిచారు. ఎమ్మెల్యేగా ఉండగా రాజేశ్వర్రెడ్డి వురణించడంతో జరిగిన ఉప ఎన్నికల్లో యెన్నం శ్రీనివాస్రెడ్డి బీజేపీ అభ్యర్థిగా విజయుం సాధించారు. 2009 సాధారణ ఎన్నికల్లో వుహబూబ్నగర్ లోక్సభ స్థానం నుంచి కేసీఆర్ గెలుపునకు జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడి హోదాలో యెన్నం పనిచేశారు. ఆ తర్వాత కొద్దిరోజులకే పార్టీకి గుడ్బై చెప్పి అనూహ్యంగా బీజేపీ నుంచి ఎమ్మెల్యే అయ్యూరు. ఇప్పుడు కూడా ఆయున వురోసారి అదే పార్టీ తరఫున తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. పునర్విభజన తర్వాత మహబూబ్నగర్, హన్వాడ మండలాలకే నియోజకవర్గం పరిమితం అరుుంది. గతంలో గ్రామీణ ఓటర్లు కీలకంగా ఉండేవి. ఇప్పుడు పట్టణ ఓటర్లేఅభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చే పరిస్థితి ఏర్పడింది. శ్రీ నే.. గెలిస్తే.. * కొత్తచెరువుకు పూర్వవైభవం. * జిల్లా కేంద్రం చుట్టు ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం * అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు * కోయిల్సాగర్ రిజర్వాయర్ ద్వారా సాగు, తాగు నీటి సరఫరా * కేంద్రం నిధులతో జిల్లా కేంద్రంలో పార్కుల నిర్మాణం * కూడళ్లలో ఆధునిక విద్యుత్ లైట్ల ఏర్పాటు * నిరుద్యోగులకు ఉపాది అవకాశాలు, మహిళలకు రుణాలు - వి. శ్రీనివాస్గౌడ్ (టీఆర్ఎస్) * రూ.270 కోట్లతో మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం * రూ. 60 కోట్లతో బైపాస్ రోడ్డు నిర్మాణం * పట్టణంలోని 41 వార్డుల్లో ఫిల్టర్ వాటర్ ప్లాంట్ల ఏర్పాటు * జిల్లా ఆస్పత్రిని కేంద్ర నిధులతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా వూర్పు * మెడికల్ కళాశాల ఏర్పాటు. - యెన్నం శ్రీనివాస్రెడ్డి (బీజేపీ) * పట్టణంలో భూగర్భ డ్రైనేజీ. * తాగునీటి సమస్య పరిష్కారం. * పాలమూరు యూనివర్శిటీ స్థాయిలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు * రూ.400 కోట్లతో పూర్తి స్థాయిలో వైద్యకళాశాల ఏర్పాటు * పతి గ్రామంలో మంచినీటి సమస్య శాశ్వత పరిష్కారం. * బైపాస్ రోడ్డు నిర్మాణానికి ప్రత్యేక కృషి * నిరుద్యోగులకు ఔట్ సోర్సింగ్స్, కంపెనీల ద్వారా ఉద్యోగావకాశాలు - ఒబెదుల్లా కొత్వాల్ (కాంగ్రెస్) * వైఎస్ పథకాల అవులు. * రైతులకు గిట్టుబాటు ధర కల్పన. * పరిశ్రమల ఏర్పాటు ద్వారా యుువతకు ఉపాధి కల్పన * ఇంటింటికీ రోజూ మంచినీరు * మహిళలకు రుణాలు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం * పట్టణంలో పార్కులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు. * పాలవుూరులోని అన్ని కాలనీలకు రామన్పాడు నీటి సరఫరా - బెక్కరి శ్రీనివాస్రెడ్డి (వైఎస్సార్ కాంగ్రెస్)