-
కులాల లెక్క తేలింది..
సాక్షి, విశాఖపట్నం: స్థానిక ఎన్నికల నిర్వహణ కసరత్తు తుది అంకానికి చేరుకుంది. ఇప్పటికే ఓటర్ల జాబితా, పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్ ప్రక్రియ పూర్తికాగా..తాజాగా కులాల వారీగా ఓటర్ల గణన కూడా కొలిక్కి వచ్చింది. కులాలవారీగా ఓటర్ల గణన పూర్తి కాగా బుధవారం అధికారికంగా ప్రకటిం చారు. ఇక రిజర్వేషన్ల ఖరారుపై విధివిధానాలు ప్రకటించడమే తరువాయి. ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదలవు తుంది. గత నెల 20వ తేదీన ప్రకటించిన తుది ఓటర్ల జాబితా ప్రకారం గ్రామీణ జిల్లా పరిధిలోని పంచాయతీ ఓటర్లు 18,02,730 మంది ఉన్నట్టుగా లెక్క తేల్చారు. తుది జాబితా ప్రకారం 18,02,730 మంది ఓటర్లలో 9,17,654 మంది మహిళలు, 8,85,005 మంది పురుష ఓటర్లున్నారు. 2013లో జరిగిన ఎన్నికలతో పోలిస్తే లక్షన్నర మంది ఓటర్లు పెరిగినట్టుగా తెలుస్తోంది. నాటి ఎన్నికల్లో 15,48,800మంది ఓటర్లున్నారు. వారిలో మహిళలు 7,86,745 మంది కాగా, పురుషులు 7,62,055 మంది ఉన్నారు. గతంలో ఓటర్లతో పోల్చుకుంటే ఈసారి 2,53,930 మంది ఓటర్లు పెరిగారు. గతంతో పోల్చుకుంటే పురుష ఓటర్లు 1,22,950 మంది పెరగగా, మహిళా ఓటర్లు 1,30,909 మంది పెరిగారు. 8.28లక్షలకు చేరిన బీసీ ఓటర్లు వార్డుల వారీగా ఓటర్ల జాబితా ప్రకటించిన అధికారులు కులాల వారీగా ఓటర్ల విభజనపై దాదాపు నెల రోజుల పాటు కసరత్తు చేశారు. ఈ జాబితా ప్రకారం జిల్లాలో ఎస్టీలు 4,48,374 మంది ఉన్నట్టుగా లెక్క తేలింది. వీరిలో పురుషులు 2,18,251 మంది, మహిళలు 2,30,104మంది మహిళలు, ఇతరులు 19 మంది ఉన్నారు. ఇక ఎస్సీలు 1,25,507 మంది ఉన్నట్టుగాలెక్క తేలగా, వారిలో పురుషులు 60,764, మహిళలు 64,741 మంది, ఇతరులు ఇద్దరుఉన్నారు.ఇక బీసీలు 8,28,128 మంది ఉండగా, వారిలో పురుషులు 4,09,800 మంది, మహిళలు 4,18,295 మంది, ఇతరులు 33 మంది ఉన్నారు.ఇక ఇతర సామాజిక వర్గాలన్నీ కలిపి మరో 4,00,721 మంది ఉండగా, వారిలో పురుషులు 1,96,190 మంది, మహిళలు 2,04,514 మంది,ఇతరులు17మంది ఉన్నారు. భారీగా పెరిగిన ఎస్సీ, ఎస్టీ ఓటర్లు.. 2013 ఎన్నికల నాటికి ఎస్టీ ఓటర్లు 3,70,531మంది ఉన్నారు. వీరిలో పురుషులు 1,82, 277 మంది కాగా, 1,88, 254 మంది మహిళా ఓటర్లున్నారు. ఇక ఎస్సీ ఓటర్లు 1,.09,523 మంది ఉండగా, వారిలో పురుషులు 53,591 మంది, మహిళా ఓటర్లు 55932 మంది ఉన్నారు. ఇక బీసీ ఓటర్లు 6,83,693 మంది ఉండగా,వారిలో 3,37,945మంది పురుషులు కాగా, 3,45, 748 మంది మహిళా ఓటర్లు ఉండేవారు. ఇతర సామాజిక వర్గాలవారు 3,85,053 మంది కాగా, పురుషులు 188242 మంది కాగా, మహిళా ఓటర్లు 196811 మంది ఉన్నారు. 2013 ఓటర్లతో పోలిస్తే ఈసారి 77,843 మంది ఎస్టీలు, 15,984 మంది ఎస్సీ ఓటర్లు పెరగ్గా బీసీ ఓటర్లు 1,34,435 మంది పెరిగారు. త్వరలో రిజర్వేషన్లపై విధివిధానాలు.. ఇక మిగిలింది రిజర్వేషన్ల ఖరారుపై విధివిధానాలు రావాడమే తరువాయి. ఆ వెంటనే షెడ్యూ ల్ విడుదలవడం, ఎన్నికల నిర్వహణ చకచకా సాగిపోతాయి. వారం పదిరోజుల్లోనే రిజర్వేషన్ల ఖరారుపై ప్రభుత్వం విధివిధానాలు జారీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనాభా దామాషా ప్రకారం చూస్తే జిల్లాలో ఆయా సామాజిక వర్గాల వారికి 58 శాతం మేర సీట్లు కేటాయించాల్సి ఉంది. ఏజెన్సీలోని 234 పంచా యతీలను పూర్తిగా ఎస్టీలకు కేటాయించినా, మైదాన ప్రాంతాల్లో మిగిలిన 681 పంచాయతీల్లో ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 8 శాతం, బీసీలకు 34 శాతం చొప్పున ఓటర్ల జాబితా మేరకు సీట్లు కేటాయించాలి. మళ్లీ ఆయా సామాజిక వర్గాల్లో సగం సీట్లు మహిళలకు ఇవ్వాల్సి ఉంది. ఆ విధంగా చూస్తే రిజర్వేషన్లు 58 శాతానికి మించిపోతున్నాయి. బీసీ రిజర్వేషన్లు కుదించకుండా రిజర్వేషన్ల ఖరారు సాధ్యమయ్యే పనికాదంటున్నారు. ప్రమాణ స్వీకారం రోజునే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాధ్యమైంత త్వరలోనే స్థానిక ఎన్నికలకు వెళ్లబోతున్నాం.. సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో రిజర్వేషన్ల ఖరారుపై వచ్చే వారం మార్గదర్శకాలు జారీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
సర్వేల భారతం!
ఒంగోలు టౌన్: సర్వేల దెబ్బకు సిబ్బందే కాదు.. ప్రజలు కూడా బిత్తరపోతున్నారు. స్మార్ట్ పల్స్ సర్వే, ఓటర్ల సర్వేకు తోడు ఇప్పుడు ఉద్యోగ, నిరుద్యోగులకు సంబంధించిన సర్వే కూత మోగనుంది. ఎంపిక చేసిన 32 మండలాల్లో ఆదివారం నుంచి సర్వే ప్రక్రియ సాగనుంది. తహసీల్దార్ కార్యాలయాల్లోని సహాయ గణాంకాధికారుల ఆధ్వర్యంలో ముఖ్య ప్రణాళిక విభాగం అధికారులు పర్యవేక్షిస్తారు. గణన ఇలా.. ప్రతి గ్రామంలో 300 గృహాల్లో సర్వే చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఒక్కో కుటుంబంలో ఎంతమంది సభ్యులున్నారు, వారిలో 15 సంవత్సరాలకు పైబడినవారు ఎంతమంది, అందులో ఉద్యోగులు, నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారనే వివరాలు సేకరించనున్నారు. కార్మికుల్లో అయితే స్కిల్డ్ ఎంతమంది, అన్ స్కిల్డ్ ఎంతమంది అనే వివరాలను కూడా సేకరించనున్నారు. జనవరి నాటికి సర్వే ప్రక్రియను పూర్తిచేసి సంబంధిత వివరాలను ఛండీగడ్లోని లేబర్ బ్యూరోకు నివేదిస్తారు. దీనిని ఆధారం చేసుకొని జిల్లాల వారీగా ఎంతమంది నిరుద్యోగులున్నారు, వారిలో నైపుణ్యం కలిగినవారు ఎంత మంది ఉన్నారు, ఏరకమైన ఉపాధి కల్పించాలన్న దానిపై చర్చించి నిరుద్యోగ సమస్యను నిర్మూలించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మండలాలివే.. ఒంగోలు, పుల్లలచెరువు, పీసీపల్లి, దొనకొండ, సింగరాయకొండ, మార్టూరు, అద్దంకి, పొదిలి, జే పంగులూరు, మార్కాపురం, నాగులుప్పలపాడు, మర్రిపూడి, కొమరోలు, చినగంజాం, చీరాల, వేటపాలెం, కందుకూరు, కంభం, లింగసముద్రం, ఇంకొల్లు, పెద్దారవీడు, తర్లుపాడు, దర్శి, చీమకుర్తి, జరుగుమల్లి, సంతనూతలపాడు, గిద్దలూరు, యర్రగొండపాలెం, వలేటివారిపాలెం, బల్లికురవ, ఉలవపాడు, కనిగిరి మండలాలను సర్వే కోసం ఎంపిక చేశారు. పకడ్బందీగా నిర్వహించాలి: డిప్యూటీ డైరెక్టర్ జిల్లాలో ఉద్యోగ, నిరుద్యోగులకు సంబంధించిన సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని ప్రణాళిక విభాగం డిప్యూటీ డైరెక్టర్ జి. భరత్కుమార్ ఆదేశించారు. సర్వేకు సంబంధించి ఎంపిక చేసిన మండలాల సహాయ గణాంకాధికారులతో శనివారం స్థానిక సీపీఓ కాన్ఫరెన్స్ హాలులో సమావేశం నిర్వహించారు. ఈ సర్వే ద్వారా జిల్లాలో ఎంతమంది ఉద్యోగులున్నారు? ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారో తెలుస్తుంది. అలాగే ఉపాధి కల్పించే విషయమై ప్రత్యేక చర్యలు తీసుకోవచ్చని చెప్పారు. డిప్యూటీ ఎస్ఓ సీహెచ్ ఆదిశేషు, ప్రణాళిక విభాగం ఏడీ ఉమాదేవి, ఎస్ఓ రఘు పాల్గొన్నారు.
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
తప్పక చదవండి
- జేసీ కుటుంబంపై కేసు నమోదు
- ధాన్యం తడవకుండా.. కాపాడే మంచె!
- గాజాలో ఆగని దాడులు.. భారతీయుడి మృతి
- శ్రీనగర్: రెండు దశాబ్ధాల ఓటింగ్ రికార్డు బద్దలు!
- జనసేన కార్యకర్తల దౌర్జన్యం
- ఆగని టీడీపీ అరాచకాలు
- Lok Sabha Election 2024: నేడు వారణాసిలో మోదీ నామినేషన్
- పోలింగ్ సిబ్బంది ‘పచ్చ’పాతం
- TS: 64.93% పోలింగ్! ప్రశాంతంగా ముగిసిన లోక్సభ ఎన్నికలు
- ఆర్సీబీకి ప్లే ఆఫ్స్ ఛాన్స్ . అలా జరిగితేనే?
Advertisement