breaking news
vinoda
-
డబ్బుల కోసం తల్లికి నిప్పంటించి..
సంగెం: కన్న కొడుకే తల్లిపాలిట కాలయముడయ్యాడు. డబ్బులకోసం తల్లిని చంపేందుకు సిద్ధమయ్యాడు. ‘వద్దు కొడుకా’.. అంటూ తల్లి బతిమాలినా వినకుండా ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. వరంగల్ జిల్లా సంగెం మండలం కుంటపల్లిలో శుక్రవారం అర్ధరాత్రి ఈ సంఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కుంటపల్లికి చెందిన ముత్తినేని వినోద (60), సాంబయ్య దంపతులకు ఒక కూతురు, లింగమూర్తి, సతీశ్ అనే కుమారులు ఉన్నారు. వీరిలో కొంతకాలం కిందట లింగమూర్తి అనారోగ్యంతో మరణించాడు. సాంబయ్యకు ఉన్న భూమిలో 4 ఎకరాలను ప్రభుత్వం కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకోసం తీసుకుంది. మరో ఎకరం భూమి ఇంకా సాంబయ్య పేర ఉంది. ప్రభుత్వం పరిహారంగా రూ.40 లక్షలు ఇచ్చింది. వీటిలో రూ.30 లక్షలను చిన్న కుమారుడు సతీశ్కు ఇచ్చారు. ఈ డబ్బులతో సతీశ్ వేరే చోట రెండు ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు. సాంబయ్య పేర రూ.3 లక్షలు, తల్లి వినోద పేర రూ.3.50 లక్షలను బ్యాంకులో డిపాజిట్ చేసుకున్నారు. మిగిలిన డబ్బులో నుంచి కూడా కొంత సతీశ్కు ఇచ్చారు. ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ రూ.2 వేలు, డిపాజిట్ ద్వారా వచ్చే వడ్డీతో కాలం వెళ్లదీస్తున్నారు. కాగా, తల్లిదండ్రుల వద్ద ఉన్న డబ్బులను కూతురుకు ఇస్తున్నారని సతీశ్ తరచూ గొడవ పడుతుండేవాడు. మిగిలిన డబ్బులను కూడా తనకు ఇచ్చేయాలని వేధించేవాడు. డబ్బులు ఇవ్వకుండా తల్లి అడ్డుపడుతోందని గతంలో తల్లి కాలు, చేయి విరగ్గొట్టాడు. దీంతో అతడిని ఇంటి నుంచి వెళ్లగొట్టారు. తల్లిపై కక్ష పెంచుకున్న సతీశ్ శుక్రవారం రాత్రి ఇంటి ముందు తల్లిదండ్రులు నిద్రిస్తుండగా అర్ధరాత్రి సమయంలో వచ్చి తల్లి వినోదపై దాడి చేశాడు. బాటిల్లో తెచ్చిన పెట్రోల్ ఆమెపై చల్లి నిప్పు అంటించి పారిపోయాడు. భార్య అరుపులు విని లేచిన సాంబయ్య చుట్టుపక్కల వారి సాయంతో మంటలు ఆర్పారు. అప్పటికే 80 శాతం గాయాలైన వినోదను 108లో వరంగల్ ఎంజీఎంకు తరలించారు. ప్రస్తుతం ఆమె చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. న్యాయమూర్తి సమక్షంలో పర్వతగిరి సీఐ రాజగోపాల్, సంగెం ఎస్సై నరేశ్లు వినోద వాంగ్మూలం రికార్డు చేశారు. భర్త సాంబయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేశ్ శనివారం తెలిపారు. -
న్యాయం చేయాలని మహిళ దీక్ష
తిరుమలగిరి, న్యూస్లైన్: న్యాయం చేయాలని కోరుతూ ఓ మహిళ శుక్రవారం తిరుమలగిరి పోలీస్స్టేషన్ ఎదుట దీక్షకు దిగింది. బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం వివరాల ప్రకారంజ. తిరుమలగిరి మండలం బండ్లపల్లి గ్రామానికి చెందిన మెతుకు అంజయ్య కూతురు వినోదను గుండాల మం డలం వస్తాకొండూర్ గ్రామానికి చెందిన సోమనారాయణకు 15ఏళ్ల క్రితం ఇచ్చి వివాహం జరిపించారు. వీరికి కుమార్తె, కుమారుడు పుట్టిన తరువాత హైదరాబాద్లో స్థిరపడ్డారు. అక్కడ ఆర్థికస్థితి సరిగా లేకపోవడంతో రెండేళ్లుగా తిరుమలగిరిలో నివసిస్తున్నారు. ఈ క్ర మంలో కొద్ది రోజులుగా వినోదను భర్త, అత్త, మామ, ఆడబిడ్డ, మరిది కలిసి అదనపు కట్నం కోసం వేధిస్తున్నారు. దీంతో ఆమె డిసెంబర్ 17న భర్త, కుటుంబ సభ్యులపై తిరుమలగిరి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పెద్ద మనుషుల సమక్షంలో పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి నా భర్త ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో కేసు నమోదు చేయాలని పోలీసులను కోరిం ది. అయితే పోలీసులు భర్త, అత్త, మామలపై కేసు పెట్టారని, ఆడబిడ్డ మరిదిపై కేసు ఉపసంహరించారని బాధితురాలు ఆరోపించింది. ఎన్నిసార్లు వారిని అరెస్టు చేయాలని కోరినా ఎస్ఐ పట్టించుకోవడం లేదని తెలిపింది.. భర్త సోమనారాయణను మాత్రమే ఈ నెల 2వ తేదీన రిమాండ్కు పంపడం, ఇతర కుటుంబ సభ్యులను అరెస్టు చేయక పోవడంతో ఆగ్రహం చేస్తూ వినోద పోలీస్స్టేషన్ ఎదుట దీక్ష చేపట్టింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ పోలీసులు.. తన అత్తామామ, ఆడబిడ్డ, మరిదితో కుమ్మకయ్యారని రోదిస్తూ తెలిపిం ది. కాగా, బాధిత మహిళకు న్యాయం చేసి వా రిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని తిరుమలగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ చెవిటి వెంకన్న యాదవ్ కోరారు. శనివారంలోపు అరెస్టు చేయకపోతే అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ హరిశ్చంద్రనాయక్, ఉప సర్పంచ్ కత్తుల శ్రీనివాస్, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కందుకూరి సోమయ్య, వై.ధీన్దయాళ్, మల్లేష్నేత, హఫీజ్, సోమయ్య, నరేష్, శ్రీను, ఉప్పలయ్య ఉన్నారు.