breaking news
Vinod Yadav
-
ఈ రూట్లలో నో వెయిటింగ్ లిస్టు
న్యూఢిల్లీ: రాబోయే ఐదేళ్లలో ఢిల్లీ–ముంబై, ఢిల్లీ–కోల్కతా మార్గాల్లో ప్రయాణించే రైళ్లలో వెయిటింగ్ లిస్టు ఉండదని రైల్వే బోర్డు చైర్మన్ వినోద్ యాదవ్ చెప్పారు. ఈ మార్గాల్లో ప్రత్యేక సరుకు రావాణా కారిడార్లు (డీఎఫ్సీ) 2021 కల్లా పూర్తి కానున్న నేపథ్యంలో రైళ్ల రద్దీ తగ్గుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. రూ.2.6 లక్షల కోట్లతో నిర్మించనున్న డీఎఫ్సీల నిర్మాణం పూర్తయితే సరుకు రవాణా రైళ్లు ఈ మార్గాల్లో వెళ్తాయి. దీంతో రైళ్ల వేగం పెంచడంతోపాటు ప్రయాణికుల రద్దీకి తగ్గట్లు రైళ్లను నడపవచ్చాన్నారు. ఫలితంగా ప్రయాణికులకు వెయిటింగ్ లిస్టు ఉండదని పేర్కొన్నారు. రైళ్లలో నేరాలను తగ్గించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు వినోద్ తెలిపారు. వచ్చే ఏడాది నుంచి దీనిని అమలు చేయాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. 2022 మార్చి నాటికల్లా అన్ని రైల్వే స్టేషన్లు, బోగీల్లో సీసీటీవీలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) ఆందోళనల్లో రైల్వేకు వాటిల్లిన రూ.80 కోట్ల ఆస్తి నష్టాన్ని బాధ్యులైన వారి నుంచే వసూలు చేస్తామని వినోద్ యాదవ్ సోమవారం ప్రకటించారు. ఇందులో తూర్పు రైల్వేకు రూ.70 కోట్లు, ఈశాన్య రైల్వేకు రూ.10 కోట్ల నష్టం జరిగింది. -
ఆర్జేడీ నేత దారుణ హత్య
పట్నా : ఆర్జేడీ నేత వినోద్ యాదవ్ దారుణ హత్యకు గురయ్యారు. శనివారం ఉదయం ఆయన్ను గుర్తు తెలియని దుండగులు కాల్చిచంపారు. బిహార్ రాజధాని పట్నాకు 240 కిలోమీటర్ల దూరంలో ఉన్న భాగల్ పూర్ జిల్లా నౌగచియాలో ఈ ఘటన చోటుచేసుకుంది. 50 ఏళ్ల యాదవ్ నౌగచియా నగర్ పంచాయతీ సభ్యుడు. నౌగచియాలోని రాసల్పూర్ ప్రాంతంలో మార్నింగ్ వాకింగ్కు వెళ్లిన యాదవ్పై, మోటర్ సైకిల్పై వచ్చిన ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారని ఆర్జేడీ జిల్లా అధ్యక్షుడు తిరుపతి నాథ్ తెలిపారు. ఘటనాస్థలంలోనే ఆయన మృతిచెందినట్టు వెల్లడించారు. ఘటనాస్థలం నుంచి ఓ తుపాకీని, నాలుగు ఖాళీ తూటాలను స్వాధీనం చేసుకున్నట్టు నౌగచియా సూపరిడెంట్ ఆఫ్ పోలీసు(ఎస్పీ) పంకజ్ సిన్హా చెప్పారు. యాదవ్ హత్య వెనుక వ్యక్తిగత శత్రుత్వమే కారణమై ఉండవచ్చని ఎస్పీ అనుమానిస్తున్నారు. యాదవ్కు చాలా క్రిమినల్ కేసుల్లో హస్తమున్నట్టు తెలుస్తోంది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నౌగచియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు ఎస్పీ పేర్కొన్నారు. యాదవ్ మేనల్లుడు అజిత్కు ఈ హత్యలో భాగమున్నట్టు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.