-
Crime News: ఈ సుత్తితోనే నా మొగుడ్ని చంపేయ్!
తప్పనిసరి పరిస్థితుల్లో ఆ మానవమృగంతో తాళి కట్టించుకుంది ఆమె. తప్పుడు దోవలో వెళ్తుంటే వద్దని బతిమాలుకుంది. వినలేదు సరికదా.. మరింత ఘోరంగా ప్రవర్తించబోయాడు. లాభం లేదనుకుని వదిలేయబోయింది. కానీ, తాను వదిలేసినా.. మొగుడి బుద్ధి మారదని అనుకుంది. చివరకు.. సుపారీ ఇచ్చి ఆ భర్తని ఈ లోకంలోనే లేకుండా చేసింది. ఢిల్లీలో కలకలం సృష్టించిన వికాస్ నగర్ హత్య కేసు ఓ కొలిక్కి వచ్చింది. మృతుడి రెండో భార్య చంద్ర కళ(28).. సుపారీ రౌడీతో ఈ హత్య చేయించినట్లు పోలీసులు వారం తర్వాత నిర్ధారించారు. అంతేకాదు పక్కా ప్లాన్తో మొగుడ్ని హత్య చేయించి.. దోపిడీహత్యగా చిత్రీకరించే యత్నం చేసినట్లు తెలిపారు. ఈ సుత్తితోనే చంపేయ్ మృతుడు వీర్ బహదూర్ వర్మ(50) వికాస్ నగర్లో ఓ బట్టల దుకాణం నడుపుతున్నాడు. కొన్నినెలల కిందట ఆ షాపులోనే పని చేసే చంద్రకళపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో బాధితురాలి కుటుంబంతో రాజీ చేసుకున్న వర్మ.. ఆమెను వివాహం చేసుకున్నాడు. అప్పటికే పెళ్లై పిల్లలు ఉన్న వర్మను గత్యంతరం లేని పరిస్థితుల్లో భర్తగా అంగీకరించింది ఆమె. చెల్లిపై కన్నేశాడు.. అయితే పెళ్లి అయ్యాక తనతో సవ్యంగా ఉంటాడని భావించిన ఆమెకు.. నిరాశే ఎదురైంది. పైగా వ్యభిచార గృహాల చుట్టూ తిరగడం, వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం.. వర్మ ప్రవర్తనతో విసిగిపోయింది. ఈ విషయంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు సైతం జరిగాయి. కొన్నివారాల కిందట.. కళ సోదరి ఆమె ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో ఆమెపైనా కన్నేశాడు వర్మ. ఇది పసిగట్టిన కళ.. భరించలేకపోయింది. కిరాయి హంతకుడి సాయంతో మొగుడ్ని చంపేందుకు ప్లాన్ వేసింది. సుపారీతో పాటు సుత్తి కూడా! రణ్హోలాకు చెందిన రౌడీ షీటర్ జుమ్మాన్ను కలిసి తన వ్యధను చెప్పింది చంద్రకళ. హత్య కోసం లక్షన్నర డబ్బుతో పాటు ఓ సుత్తిని కూడా అందించింది. ఆ సుత్తితోనే మొగుడ్ని చంపేయాలని కోరింది ఆమె. ఈ క్రమంలో.. మే 18వ తేదీన ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో చంద్రకళ సాయంతో.. సుత్తితో వర్మపై దాడి చేశాడు జుమ్మాన్. అనంతరం శవాన్ని రోడ్డు మీద పడేశాడు. రక్తపు మడుగులో పడి ఉన్న వర్మను.. డీడీయూ ఆస్పత్రికి తరలించినా లాభం లేకపోయింది. చంపి.. దొంగతనంగా. భర్త హత్యను దోపిడీగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది చంద్రకళ. ఇందుకోసం ఇంట్లోని డబ్బు, నగదును జుమ్మాన్కు ఇచ్చి పంపించి వేసింది. మొగుడి ప్రాణం పోయినా.. తాను జైలు పాలయినా.. తన చెల్లితోపాటు ఎంతోమంది జీవితాలు నిలబడ్డాయని కన్నీళ్లతో చెబుతోంది చంద్రకళ. -
రమాదేవి కథ సుఖాంతం....
హైదరాబాద్ : వారసుడు లేడనే నెపంతో అత్తామామ, భర్త వేధిస్తున్నారని ముగ్గురు కూతుళ్లతో న్యాయపోరాటం చేసిన రమాదేవి కథ ఎట్టకేలకు సుఖాంతమైంది. దిల్సుఖ్నగర్ వికాస్ నగర్లో అత్తింటి ముందు ఆమె ఆందోళన చేసిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ జాగృతి, ఐద్వా మహిళ సంఘాలు ఆమెకు మద్దతు తెలిపాయి. మహిళ సంఘాలు బాధితురాలిని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లగా... పోలీసులు రమాదేవి భర్త సంతోష్, మామ ప్రకాశ్ రావు, అత్త నిర్మాలదేవిలను రప్పించారు. మహిళ సీఐ మధులత ఇరువురి అంగీకారం మేరకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఎట్టకేలకు ఇద్దరూ కలిసి ఉండాలని నిర్ణయించుకుని పోలీసుల సమక్షంలో ఒప్పంద పత్రాలు రాసుకున్నారు. మగ సంతానం లేదనే నెపంతో వేధిస్తున్నట్లు రమాదేవి తమకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని సీఐ తెలిపటం విశేషం. -
పీఎస్లో రమాదేవి భర్త, అత్తామామ లొంగుబాటు
వారసుడు లేడనే నెపంతో ఇల్లాలు రమాదేవిని వేధించడమే కాకుండా పిల్లలతో సహా ఇంటి నుంచి గెంటివేసిన కేసులో ఆమె భర్త సంతోష్ కుమార్తోపాటు ఆమె అత్తామామలు గురువారం ఉదయం సరూర్నగర్ మహిళ పోలీసు స్టేషన్లో లొంగిపోయారు. దాంతో పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. పుత్రుడిని కనివ్వలేదని రమాదేవిని భర్తతోపాటు, అత్తమామలు తరుచుగా వేధించేవారు. దాంతో ఆమెను పుట్టింటికి పంపేశారు. కొన్నాళ్లుగా పుట్టింట్లో ఉన్న రమాదేవి బుధవారం దిల్సుఖ్నగర్ పరిధిలోని వికాస్నగర్లోని మెట్టినింటికి వచ్చింది. ఆమె రాకను ముందుగా గమనించిన ఆమె భర్త, అత్తమామలు ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. దీంతో తనకు న్యాయం చేయాలంటూ రమాదేవికి మెట్టినింటి ముందు బైఠాయించింది. రమాదేవి ఘటనకు సంబంధించిన కథనం సాక్షి టీవీలో ప్రసారం కావడంతో సరూర్నగర్ మహిళ పోలీసులు స్పందించారు. వెంటనే రమాదేవి వద్దకు వచ్చి మహిళా పోలీసులు విషయం తెలుసుకున్నారు. అనంతరం భర్త సంతోష్కుమార్, ఆమె అత్తామామలపై సరూర్ నగర్ మహిళ పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు. దాంతో రమాదేవి అత్తామామలు గురువారం సరూర్నగర్ మహిళా పోలీసు స్టేషన్లో లొంగిపోయారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement