breaking news
Vijayawada Durga
-
'అవినీతిపై హజారే కంటే ఎక్కువ పోరాటం చేశా'
విజయవాడ: ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణపై మాజీ మంత్రి పి. శంకర్రావు ఘాటైన వ్యాఖ్యలు చేశారు. నత్తి సీఎం కిరణ్, సత్తి బొత్సకు వచ్చే నెల 7 తర్వాత ఉద్వాస తప్పదని ఆయన జోస్యం చెప్పారు. విజయవాడలో దుర్గా మల్లేశ్వరి అమ్మవారిని మంగళవారం ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... సీఎం కిరణ్ పార్టీ పెడితే పార్టీ పాతాళానికి, అందులో చేరినవారు కైలాసానికి వెళ్తారని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికలు రెండు రాష్ట్రాల్లో జరుగుతాయని అన్నారు. అవినీతిపై అన్నా హజారే కంటే తానే ఎక్కువ పోరాటం చేశానని ఆయన సొంత డబ్బా కొట్టుకున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న మూడేళ్ల కాలంలో పార్టీని భూస్థాపితం చేయడం తప్ప కిరణ్ కుమార్ రెడ్డి సాధించిందేమీలేదని అంతకుముందు శంకర్రావు అన్నారు. కిరణ్ కంటే తానే బెటర్ అని కూడా వ్యాఖ్యానించారు. -
నేత్రపర్వం..కలశజ్యోతి మహోత్సవం
విజయవాడ, న్యూస్లైన్ : బెజవాడ దుర్గమ్మ కలశజ్యోతి మహోత్సవం నేత్రపర్వంగా సాగింది. శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో సోమవారం రాత్రి సత్యనారాయణపురంలోని శివరామకృష్ణక్షేత్రం నుంచి కలశజ్యోతి ప్రదర్శన ప్రారంభమైంది. ప్రత్యేకంగా అలంకరించిన పుష్పకవాహనంపై శ్రీ గంగాపార్వతీసమేత మల్లేశ్వరస్వామి కొలువుదీరారు. ఉత్సవమూర్తులకు ఇన్చార్జి ఈవో త్రినాథ్రావు పూజాదికాలు నిర్వహించి ప్రదర్శన ప్రారంభించారు. భవానీలు కలశాలను చేతబూని జై భవానీ, జై ైజై భవానీ నామస్మరణ చేస్తూ ముందుకుసాగారు. మేళతాళాలు, మంగళవాయిద్యాలు, కోలాట నృత్యాల నడుమ ప్రదర్శన కనులపండువగా సాగింది. బాల భవానీలు జ్యోతులను పట్టుకుని వడివడిగా అడుగులు వేశారు. ఉత్సవమూర్తులు కొలువుదీరిన వాహనంతోపాటు దేవస్థాన ప్రచార రథంతో ఊరేగింపు గాంధీనగర్, అలంకార్ టాకీస్, చల్లపల్లి బంగళా మీదుగా ప్లైఓవర్ ఎక్కి కెనాల్ రోడ్డు, టోల్గేటు మీదుగా ఓం టర్నింగ్ వరకు సాగింది. అక్కడ జ్యోతులను ఉంచి భవానీలు అమ్మవారిని దర్శించుకుని దీవెనలు అందుకున్నారు. కలశజ్యోతి ఉత్సవంలో స్థానాచార్య విష్ణుభట్ల శివప్రసాదశర్మ, మల్లేశ్వరాలయ ప్రధాన అర్చకులు యనమండ్ర మల్లయ్యశాస్త్రి, వైదిక కమిటీ సభ్యులు మురళి, షన్ముఖ, అర్చకులు కోట ప్రసాద్, శంకరమంచి ప్రసాద్, యజ్ఞనారాయణ, ఆలయ ఈఈ కోటేశ్వరరావు, స్తపతి రామబ్రహ్మం, అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.