breaking news
Vijay Srinivas
-
సమ్మర్లో ఫ్యామిలీ ఎంటర్టైనర్
కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమాలకు బాక్సాఫీస్ దగ్గర మంచి గిరాకీ ఉంటుంది. పైగా సమ్మర్లో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూలు కడతారు. దాన్ని దృష్టిలో పెట్టుకునే దర్శకుడు విజయ్ శ్రీనివాస్ ‘జీలకర్ర-బెల్లం’ చిత్రాన్ని తెరకెక్కించి నట్లున్నారు. అభిజిత్, రేష్మ,జంటగా ఎ.శోభారాణి, ఆళ్ల నౌరోజీ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే... కథ ఏంటంటే... రాహుల్ (అభిజిత్), మైథిలి (రేష్మ) ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. జీవితంలో బాగా స్థిరపడేంత వరకూ పిల్లలు వద్దనుకుంటారు. కొంత కాలం వీరి జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ఒకసారి ఇద్దరూ చిలుకూరి బాలాజీ టెంపుల్కు వెళదామను కుంటారు. చివరి నిమిషంలో రాహుల్కు ముఖ్యమైన మీటింగ్ ఉండటంతో అతను ఆఫీసుకు వెళిపోతాడు. దాంతో టెంపుల్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పటినుంచి మైథిలి మనసులో భర్త మీద వ్యతిరేకమైన ఆలోచనలు స్టార్ట్ అవుతాయి. భర్త తనని నిర్లక్ష్యం చేస్తున్నాడన్న భావన మైథిలి మనసులో నాటుకుపోతుంది. కట్ చేస్తే... వీళ్లిద్దరి జీవితంలోకి అమృత అనే పాప ఎంటరవుతుంది. వ్యాపారంలో బిజీగా ఉండే అమృత తల్లిదండ్రులు ఆమెని నిర్లక్ష్యం చేస్తారు. దాంతో రాహుల్, మైథిలీలకు క్రమంగా అమృత దగ్గరవుతుంది. సడన్గా అమృత క్యాన్సర్తో చనిపోతుంది. పిల్లలు వద్దనుకున్న మైథిలికి మరో షాక్. ఆమెకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది. మళ్లీ రాహుల్-మైథిలీల మధ్య అగాథం ఏర్పడుతుంది. ఈ దూరం తొలగిపోయి ఇద్దరూ ఎలా దగ్గరయ్యారు? అన్నది మిగతా కథ. ‘‘మీ పెళ్లిపుస్తకం మీరే రాస్కోవాలి, చదువుకోవాలి, మీరే దిద్దుకోవాలి’’ అని హీరోయిన్ తండ్రి పాత్రలో సూర్య పలికే సంభాషణలు ఆకట్టుకుంటా యి. తాగుబోతు రమేష్, ఉత్తేజ్ మధ్య వచ్చే హాస్య సన్నివేశాలు నవ్విస్తాయి. చిన్నచిన్న గొడవలతో దాంపత్యాన్ని విచ్ఛిన్నం చేసుకోకూడదనే కథాంశంతో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్టైనర్. -
ప్రేమ, పెళ్లి, విడాకులు!
నేటి తరం యువతీయువకులు ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. నిండు నూరేళ్లు కలిసుండాల్సిన వాళ్లు తీరా చిన్న చిన్న కారణాలతో విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. తద్వారా బంగారు భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారు. ఈ పరిస్థితి ఎందుకొస్తోంది? దీనికి పరిష్కారం ఏమిటి? అనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘జీలకర్ర -బెల్లం’. అభిజీత్, రేష్మ జంటగా శ్రీచరణ్ కార్తికేయ మూవీస్ పతాకంపై విజయ్ శ్రీనివాస్ దర్శకత్వంలో శోభారాణి, నౌరోజీ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ- ‘‘కామెడీ, క్రైమ్, రొమాన్స్ అన్ని ఎలిమెంట్స్తో తెరకెక్కిన చిత్రమిది. ఈ చిత్రం ద్వారా యువతకు మంచి సందేశం ఇస్తున్నాం. ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తోంది. తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే చిత్రమవుతుంది. ఈ నెల 29న మా సినిమాను ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో కూడా విడుదల చేస్తున్నాం’’ అని తెలిపారు. ‘‘ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట మధ్య అహం వల్ల ఎలాంటి సమస్యలొచ్చాయి. చివరకు ప్రేమ గెలిచిందా? అహం గెలిచిందా? అన్నదే ఈ చిత్ర కథాంశం. సంగీతాన్ని ఆదరించినట్టు సినిమాను కూడా ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకముంది’’ అని హీరో అభిజీత్ పేర్కొన్నారు. హీరోయిన్ రేష్మ, మాటల రచయిత కొమ్మనాపల్లి గణపతిరావు తదితరులు మాట్లాడారు. ఈ చిత్రానికి సంగీతం: ‘వందేమాతరం’ శ్రీనివాస్, కెమేరా: చిట్టిబాబు. -
‘జీలకర్ర బెల్లం’ మూవీ ప్రెస్ మీట్