breaking news
vgtm uda area
-
ఏపి ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు!
హైదరాబాద్: ఏపి ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. విజయవాడ-గుంటూరు-తెనాలి-మంగళగిరి (వీజీటీఎం) ఉడా పరిధిలో రిజిస్ట్రేషన్లు యథావిథిగా చేసుకోవచ్చని హైకోర్టు తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ కొత్త రాజధాని ప్రాంతం వీజీటీఎం ఉడా పరిధిలోకి రావడంతో ఆ పరిధిలోని భూముల రిజిస్ట్రేషన్లు, లేఅవుట్, గ్రూప్ హౌసింగ్స్ను నిషేధిస్తూ ఏపీ ప్రభుత్వం మెమో జారీ చేసింది. దీనిని సవాలు చేస్తూ ఓ వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్ను విచారించిన హైకోర్టు ఆ మెమోను సస్పెండ్ చేస్తూ తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త రాజధాని మాస్టర్ ప్లాన్ వచ్చే వరకు భూ రిజిస్ట్రేషన్లు ఆపాలన్న జీఓపై విచారణ కొనసాగుతుంది. ** -
రాజధాని అక్కడొద్దు.. బాబుకు కమిటీ షాక్!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని విషయంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి శివరామకృష్ణన్ కమిటీ గట్టి షాకే ఇచ్చింది. ఇన్నాళ్ల పాటు విజయవాడ-గుంటూరు, తెనాలి, మంగళగిరి పరిధి సముదాయమైన వీజీటీఎం ప్రాంతంలోనే రాజధాని నగరాన్ని ఏర్పాటు చేయాలని బాబు సర్కారు భావిస్తోంది. ఇందుకు తగ్గట్లే మంత్రులతో ప్రకటనలు చేయించింది కూడా. అయితే రాష్ట్ర రాజధాని ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ ఈ ప్రతిపాదనను తన నివేదికలో పూర్తిగా వ్యతిరేకించింది. రాజధాని నిర్మాణం కోసం మొత్తం 10 వేల ఎకరాలు అవసరమని సూచించింది. వీజీటీఎం పరిధిలో ప్రస్తుతమున్నది 1458 ఎకరాలే అని కమిటీ తన నివేదికలో పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతమున్న భూముల ధరల ప్రకారం భూసేకరణ కూడా చాలా ఆర్థిక భారంతో కూడుకున్న పని అని చెప్పింది. పైగా భూసేకరణకు మూడు, నాలుగేళ్ల సమయం పడుతుందని వివరించింది. ఆర్థిక, సమయభావ కారణాల వల్ల... వీజీటీఎం రాజధాని ఏర్పాటుకు అనువైంది కాదని కమిటీ తన అభిప్రాయాన్ని వెల్లడించింది.