breaking news
Venkatramana reddy
-
కామారెడ్డిలో ఉత్కంఠ రేపుతున్న ఎన్నికల పోరు
-
ఇద్దరు స్నేహితుల కథ...
‘కె.ఎస్ 100’ సినిమా ఈనెల 12న విడుదల కానుంది. చంద్రశేఖరా మూవీస్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రానికి షేర్ దర్శకుడు. కె.వెంకట్ రామిరెడ్డి నిర్మాత. శనివారం విలేఖరుల సమావేశంలో నిర్మాత మాట్లాడుతూ–‘మాది ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్. 1995 నుండి సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను. ఇంగ్లిష్ సినిమాలను తెలుగులోకి డబ్బింగ్ చేసేవాడిని. ఇప్పటివరకు దాదాపు 25 సినిమాలు చేశాను. ‘టైమ్పాస్’ ‘మోడ్రన్ గర్ల్’ చిత్రాల ద్వారా నిర్మాతగా మారాను. ‘కె.ఎస్ 100’ నిర్మాతగా నా మూడవ చిత్రం. ఈ చిత్రంలోని కె అంటే కుమార్, ఎస్ అంటే స్వామి. ఈ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. కొన్ని సంఘటనల వల్ల వారు శత్రువులుగా మారుతారు. ఆ స్నేహితులు మళ్లీ కలిశారా? లేదా? అనేది కథ. షేర్ అద్భుతంగా తెరకెక్కించారు. ట్రైలర్స్ బాగుండడంతో తమిళ డబ్బింగ్ రైట్స్ మంచి రేటుకు అమ్ముడయ్యాయి. ఈ సినిమా బిజినెస్ పరంగా సేఫ్లో ఉన్నాను’ అన్నారు. -
సైన్స్పై అవగాహన పెంచేందుకు జేవీవీ కృషి
నల్లగొండ అర్బన్, న్యూస్లైన్ : విద్యార్థుల్లో సైన్స్పై మరింత అవగాహన పెంచేందుకు జనవిజ్ఞాన వేదిక కృషి చేస్తుందని ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నన్నూరి వెంకటరమణారెడ్డి అన్నారు. జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో బుధవారం నల్లగొండ పట్టణంలో డైట్లో పట్టణ స్థాయి చెకుముకి టాలెంట్టెస్ట్ జరిగింది. దాదాపు 47 పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఈ టెస్ట్లో పాల్గొన్నారు. ఇందులో ఇంగ్లీషు మీడియంలో సెయింట్ ఆల్ఫోన్సస్ హైస్కూల్, తెలుగు మీడియంలో నిర్మల విద్యామందిర్ పాఠశాలల విద్యార్థులు మొదటిస్థానం సాధించి జిల్లాస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన వారికి బహుమతులు అందజేశారు. అనంతరం విద్యార్ధులనుద్ధేశించి వెంకటరమణారెడ్డి మాట్లాడారు. సైన్స్ను నిత్యజీవితానికి అన్వయించడంలో లోపం జరుగుతుందని, దీనివల్లనే సమాజంలో మూఢనమ్మకాలు విపరీతంగా పెరుగుతున్నాయన్నారు. సైన్స్ ఫలాలు సామాన్యులకు అర్థం అయినపుడే సమాజం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక జిల్లా కార్యదర్శి ఎస్కే. మస్తాన్, సమత జిల్లా కన్వీనర్ అమరావతి, పట్టణ అధ్యక్షుడు వర్ధెల్లి లింగయ్య పాల్గొన్నారు.