-
కేజీబీవీ విద్యార్థులకు అస్వస్థత
సాక్షి, కేశంపేట : పాడైన కూరగాయలతో చేసిన వంటల కారణంగా ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారు. పాటిగడ్డలోని కస్తూర్బా పాఠశాలలో శుక్రవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. మండల పరిధిలోని పాటిగడ్డ కస్తూర్బా పాఠశాలలో 262 మంది చదువుకుంటున్నారు. వీరికి నిత్యం మెనూ ప్రకారం భోజనం అందించాల్సి ఉండగా.. నిర్వాహకులు మాత్రం తమ ఇష్టానుసారం వండిపెడుతన్నారు. రోజుల తరబడి నిల్వ ఉంచిన కూరగాయలతో వంటలు చేస్తున్నారు. ఈ భోజనం తిన్న బాలికలు అస్వస్థతకు గురవుతున్నారు. దీనికి తోడు స్కూల్లో అపరిశుభ్ర వాతావరణం నెలకొంది. వాష్బేషిన్ల వద్ద నాచు పేరుకుపోయింది. మూత్రశాలలు కంపు కొడుతున్నాయి. పాఠశాల లోపల పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయి. ఈ విషయమై కేజీబీవీ ప్రత్యేక అధికారి గౌసియాను అడగగా.. ఉదయం విద్యార్థినులు అస్వస్థతకు గురికావడంతో ఆయాలు వారిని ఆస్పత్రికి తీసుకెళ్లారని చెప్పారు. దీంతో మూత్రశాలలను శుభ్రం చేయలేదన్నారు. నాయకుల సందర్శన.. విద్యార్థులు ఆస్పత్రిలో చేరారన్న విషయం తెలుసుకున్న పలు కుల సంఘాల నాయకులు కేజీబీవీని సందర్శించారు. వంటలు, కిచెన్, బాత్రూంలను పరిశీలించారు. పలువురు విద్యార్థినులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మెనూ పాటించడం లేదని, బాత్రూంలను శుభ్రం చేయడం లేదని విద్యార్థులు వీరికి వివరించారు. ఇదిలా ఉండగా బాలికలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు ప్రభుత్వం అందించిన వాటర్ ఫిల్టర్ నిరుపయోగంగా ఉంది. నిత్యం కేశంపేట, సంతాపూర్ నుంచి ఫిల్టర్ వాటర్ తెస్తున్నారు. -
ప్రభుత్వం ఆదుకోవాలి..
ఆదిలాబాద్, న్యూస్లైన్ : జిల్లాలో పక్షం రోజులుగా కురిసిన భారీ వర్షాలకు ప్రధాన పంటలైన పత్తి, సోయా, కంది తదితర పంటలతోపాటు కూరగాయల పంట లు దెబ్బతిన్నాయి. వర్షానికి కూరగాయల పం టలు నీటమునిగి మొక్కలు కుళ్లిపోయాయి. ప్రధానంగా టమాట, బీర, బెండ, వంకాయ, అల్చంత, గోబీ, మిరప, చిక్కుడు, దొండ, కా కర, కోత్తిమీర, ఆకుకూర పంటలపై అధిక ప్ర భావం పడింది. దీంతో మార్కెట్లో కూరగాయ ల కొరత ఏర్పడి ధరలు చుక్కలను అంటడంతో వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. వేల ఎకరాల్లో కూరగాయల పంట నష్టం ఈనెల 15వ తేదీ నుంచి పది రోజులపాటు ఏకధాటిగా కురిసిన వర్షాలకు కూరగాయల పంట లు దెబ్బతిన్నాయి. వేల ఎకరాల్లో రైతులు పంట ను నారుమళ్లలోనే కోల్పోయారు. టమాట నర్సరీల్లోనే తుడిచి పెట్టుకుపోయింది. తీగజాతి కూరగాయలపై కూడా తీవ్ర ప్రభావం చూపిం ది. జిల్లా వ్యాప్తంగా కాగజ్నగర్, సిర్పూర్(టి), కౌటాల, భీమిని, గుడిహత్నూర్, ఇంద్రవెల్లి, ఉట్నూర్, ఇచ్చోడ, జైనథ్ మండలాల్లో కూరగాయలు అధికంగా సాగవుతాయి. దాదాపు 2,122 ఎకరాల్లో కూరగాయల పంటలు రైతులు నష్టపోయినట్టు ఉద్యానవన శాఖ, రెవెన్యూ శాఖాధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. వీటి నష్టం రూ.50 లక్షలు పైగా ఉంటుందని భావిస్తున్నారు. ఇంద్రవెల్లి, గుడిహత్నూర్, ఉట్నూర్, ఇచ్చోడ, జైనథ్ ప్రాంతాల్లో టమాట నర్సరీ నారుమలుల్లోనే 1,250 ఎకరాల్లో కోల్పోయినట్లు అంచనా వేస్తున్నారు. కాగజ్నగర్, కౌటాల, సిర్పూర్(టి) ప్రాంతాల్లో 200 ఎకరాల పైబడి కాకర, పర్వల్ పంటలు రైతుల చేతికి అందకుండా పోయాయి. భీమినిలో 150 ఎకరాల్లో పసుపు కొమ్ములు వరద పాలు కావడంతో రైతులు పూర్తిగా నష్టపోయారు. జిల్లాలో ఈ ఖరీఫ్లో 6 వేల హెక్టార్లలో కూరగాయల పంటలు సాగవనున్నట్లు అంచనా వేశారు. టమాట 3వేల హెక్టార్లలో అత్యధికంగా సాగవుతుంది. పూగోబి, ఆకుగోబి, కాకర, బీర, సోర, పచ్చిమిరప, బెండకాయ తదితర పంటలు మిగతా హెక్టార్లలో సాగవుతాయి. కూరగాయల కొరత మార్కెట్లో డిమాండ్కు అనుగుణంగా కూరగాయలు రాకపోవడంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా బీర, వంకాయల కొరత ఉంది. ఆదిలాబాద్ రైతుబజార్లోనే కూరగాయల ధరలు చుక్కలనంటాయి. మిగతా మార్కెట్లలో కూరగాయల ధర లు అంతకంటే ఎక్కువగా ఉండడంతో వినియోగదారులు కొనేందుకు జంకుతున్నారు. ఆదిలాబాద్ రైతుబజార్లో జైనథ్, అంకోలి, గుడిహత్నూర్, ఇంద్రవెల్లి, సీతాగొంది, తలమడుగు, పొన్నారి తదితర గ్రామాల నుంచి వివిధ రకాల కూరగాయలను తీసుకొచ్చి రైతులు విక్రయిస్తా రు. అలాంటిది వర్షాల ప్రాభావంతో వంకాయ, బీర, బెండ, చిక్కుడు పంటలు నష్టపోవడంతో మార్కెట్కు కొంత మాత్రమే చేరుకుంటున్నా యి. మంచిర్యాల, నిర్మల్, కాగజ్నగర్, బెల్లంపల్లి, ఉట్నూర్, భైంసా, బోథ్, చెన్నూర్, సిర్పూ ర్ తదితర ప్రాంతాల్లో కూరగాయల ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. ఇదిలా ఉంటే నాగ్పూర్, తదితర ప్రాంతాల నుంచి టమాట ఇక్కడికి తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. మళ్లీ విత్తనాలు కొనే శక్తిలేదు.. నాకున్న భూమిలో టమాటా సాగు చేశాను. పెట్టుబడి కోసం ప్రైవేటు గా అప్పు చేసి రూ.10వేలు తెచ్చా ను. టమాటా నారు పోశాను. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురియడంతో నారు కుళ్లిపోయింది. మళ్లీ విత్తనా లు కొనడానికి డబ్బులు లేవు. ఇక కూరగాయల సాగు ఏమి చేయాలి. అధికారులు దయచేసి ఆదుకోవాలి. - దగ్లే జనార్దన్, వడగామ్, ఇంద్రవెల్లి. రూ. లక్ష మట్టిపాలు నేను 15 ఎకరాల భూమి కౌలుకు తీసుకొని టమాట సాగు చేస్తున్నా. ఈ పంట డబ్బులతో గత ఖరీఫ్లో చేసిన అప్పు లు తీర్చాలనుకున్నా. 15 ఎకరాల్లో ట మాట నాటు వేశా. నాటు పడిన రెండో రోజు నుంచి మూడు రోజులపాటు కుం డపోత వర్షం కురిసింది. ఇంకే ముంది 15 ఎకరాల్లో టమాటకు పెట్టిన పెట్టుబడి సుమారు రూ.లక్ష మట్టిపాలైనాయి. - నూర్ఖాన్, లింగాపూర్, గుడిహత్నూర్ గవర్నమెంటు మాకోసం ఏమీ చేయడం లేదు ఏడెకరాల్లో టమాట నాటిన. విత్తనాలు, నాట్లు, నర్సరీకి ఎరువులు, కూలీలు రూ.35 వేలు ఖర్చుపెట్టిన. అంతా అనుకున్నట్లుగా జరుగుతుందని ఆశపడ్డా. కానీ మూడు రోజులు వర్షం కురవడంతో కొంత పంట కొట్టుకొని పోగా.. మరికొంత నీళ్లలో కుళ్లిపోయింది. చివరకు ఏమీ మిగల లేదు. గవర్నమెంటు మాకోసం ఏమీ చేయడం లేదు. కనీస నష్టపరిహారమైనా అందుతే కూలీలకు డబ్బులైన ఇవ్వొచ్చు. - లద్దే విశ్వంబర్, గుడిహత్నూర్ నా పేరు కాగ్నే నారాయణ. మాది ఇంద్రవెల్లి మండలం. నాకు ఆరెకరాల పంట భూమి ఉంది. ఇందులో టమోట సాగు చేశాను. ఖరీఫ్ ప్రారం భంలో వరుణుడు అనుకూలించడంతో కూరగాయలు సాగు చేశాను. విత్తనాల కోసమే రూ.15 వేలు ఖర్చు చేశాను. పదిహేను రోజులు వర్షాలు ఏకధాటిగా కురియడంతో టమాట మొక్కలకు కర్ప రోగం వచ్చింది. రెండు మూడు రోజులు మొక్కలు నీటిలోనే ఉండటంతో కుళ్లిపోయాయి. మళ్లీ విత్తనాలు కొనే స్థోమత లేదు. అధికారులే ఆదుకోవాలి.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోలింగ్ కేంద్రాల తనిఖీ
పట్టుదలతో చదవండి
స్వర్ణకారుల సమస్యలు పరిష్కరిస్తాం
ఆదాయపు పన్ను మాఫీ చేయిస్తాం
ఓపెన్ కాస్టుల్లో పనివేళలు మార్చండి
కమిషనింగ్ పూర్తిచేయండి
ఓదెల మల్లన్న సాక్షిగా చెబుతున్నా..
సర్కారు ఆస్పత్రిలో గడువు ముగిసిన మందులు!
ఎన్నికల ప్రచార వ్యయం నమోదుపై సమావేశం
వేడెక్కిన ప్రచారం
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement