breaking news
UN human rights expert
-
శ్రీలంకలో మానవ హక్కులపై ‘సంక్షోభం’ పిడుగు.. ఐక్యరాజ్య సమితి ఆందోళన
కొలంబో: ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయి ఇబ్బందులు పడుతున్న శ్రీలంక ప్రజలకు తక్షణం మద్దతు ఇవ్వాలని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల నిపుణుల బృందం కోరింది. అంతర్జాతీయ సమాజం ముందుకు వచ్చి సాయం అందించాలని సూచించింది. శ్రీలంకలోని పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు మానవ హక్కుల నిపుణులు.' శ్రీలంక ఆర్థిక సంక్షోభంపై అంతర్జాతీయ సమాజం వెంటనే స్పందించాలి. అది కేవలం మానవతా సంస్థల నుంచే కాదు.. అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, ప్రైవేటు లెండర్స్, ఇతర దేశాలు ముందుకు రావాలి.' అని పేర్కొన్నారు. శ్రీలంకలో రికార్డు స్థాయిలో పెరిగిపోయిన ద్రవ్యోల్బణం, నిత్యావసరాల ధరల పెరుగుదల, విద్యుత్తు, ఇంధన సంక్షోభం, ఆర్థిక వ్యవస్థ పతనంపై తొమ్మిది మంది నిపుణుల బృందం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సంక్షోభం మానవ హక్కులపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొంది. సరైన ఆహారం, వైద్యం అందకపోవటం వల్ల తీవ్ర అనారోగ్యాలు ఎదురవుతాయని, గర్భిణీలు, పాలిచ్చే తల్లులకు సహాయం అవసరమని తెలిపింది. అధ్యక్షుడు రాజీనామా చేయాలంటూ దేశవ్యాప్తంగా జరిగిన ఆందోళనల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోవటంపై ఆందోళన వ్యక్తం చేశారు ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల చీఫ్ మిచెల్ బచెలెట్. హింసాత్మక ఘటనలు జరగటాన్ని ఖండించారు. ఆర్థిక సంక్షోభాన్ని తగ్గించేందుకు తీసుకునే నిర్ణయాల్లో మానవ హక్కులను ప్రధానంగా చూడాలన్నారు. ప్రభుత్వం తొందరపాటుతో తీసుకున్న నిర్ణయాల వల్లే సంక్షోభం తలెత్తిందని తెలిపారు. ఇదీ చదవండి: Sri Lanka Crisis: రోజుకు రూ.15 వేలు సంపాదిస్తున్నా.. ఏం చేసినా ఇంత డబ్బు రాదు.. అందుకే! -
ఉత్తర కొరియాలో తొలిసారిగా..
జెనీవా: ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని మానవ హక్కుల బృందాన్ని తమ దేశ పర్యటనకు ఉత్తర కొరియా అంగీకారం తెలిపింది. కేటలినా డివన్డాస్ అగిలర్ నేతృత్వంలోని హక్కుల బృందం ఆ దేశంలో వివిధ కారణాలతో వైకల్యం పొందిన పౌరుల స్థితిగతులపై అధ్యయనం చేయనుంది. ఇప్పటి వరకు కొరియా అంతర్జాతీయ స్థాయిలో ఓ పౌర హక్కుల సంఘాన్ని తమ దేశ పర్యటనకు అనుమతించలేదు. ‘ప్రస్తుతం అధికారంలో ఉన్న డీపీఆర్కే (డెమోక్రాటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా) అక్కడి పరిస్థితులను అంచనా వేయడానికి మాకో ఓ అవకాశం కల్పించింది. అందుకు నా ఆరు రోజుల పర్యటనను పూర్తిగా వినియోగిస్తా’ అని కేటలినా అన్నారు. వచ్చే వారంలో ఈ పర్యటన ఉంటుందని చివరి రోజున నివేదికను ఆ దేశ రాజధాని ప్యాంగ్యాంగ్లో మీడియా ముందు ప్రవేశ పెట్టనున్నట్లు ఆమె తెలిపారు. యూఎన్ ప్రకారం కొరియా లక్షాఇరవైవేల మంది ఖైదీలను సైనిక శిబిరాల్లో క్రూరంగా హింసించిందని అంచనా.