breaking news
TRS district office
-
విభజన చట్టాన్ని అమలు చేయాలి
హన్మకొండ : రాష్ట్ర విభజన చట్టాన్ని అమలు చేసి.. అధికారుల కేటాయింపు త్వరగా పూర్తి చేయూలని కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. హన్మకొండ రాంనగర్లోని టీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్సింగ్ను టీఆర్ఎస్ ఎంపీలు కలిసి.. రాష్ట్ర సమస్యలు వివరించామన్నారు. రాష్ట్ర విభజన చట్టం అమలుకాక ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించామన్నారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు కేటాయింపు పూర్తి కాకపోవడంతో ఇక్కడ పాలన కుంటుపడిందని అన్నారు. విభజన అనంతరం రెండు రాష్ట్రాల మధ్య విద్వేషాలు రగులుతాయని, దీంతో నేరాలు పెరుగుతాయని భావించారన్నారు. దీనికి భిన్నంగా రెండు రాష్ట్రాల ప్రజలు కలిసి పోతున్నారని, ప్రశాంతంగా ఉంటున్నారన్నారు. హైదరాబాద్లో పరిస్థితులు శాంతియుతంగా ఉన్నాయని వివరించి.. గవర్నర్ పెత్తనం లేకుండా చేశామన్నారు. కేంద్ర వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్ కలిసి పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై వివరించామన్నారు. పత్తి ధర మద్దతు ధర క్వింటాల్కు రూ.5వేలు పెంచాలని వివరించామన్నారు. తెలంగాణలో పత్తి 17.50 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారని, 65 లక్షల బేళ్లు ఉత్పత్తి అవుతుందన్నారు. దేశంలో 1.72 ఎకరాల్లో పత్తి సాగుచేస్తుండగా.. 4 కోట్ల బేళ్లు ఉత్పత్తి అవుతుందని వివరించారు. ఈ పత్తిలో 25 శాతం తెలంగాణలో ఉత్పత్తి అవుతుందని వివరించారు. ఇందులో 3 కోట్ల బేళ్లను దేశ అవసరాలకు వినియోగించుకొంటుండగా, కోటి బేళ్లను విదేశాలకు ఎగుమతి చేసేవారమన్నారు. రాష్ట్రంలో పండుతున్న పత్తిని రైతుల నుంచి కొనుగోలు చేసేందుకు పత్తి ఆధారిత పరిశ్రమలైన జన్నింగ్, స్పిన్నింగ్ మిల్లులు ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిని కోరామన్నారు. సమావేశంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్రావు, ఎంపీ ఆజ్మీర సీతారాంనాయక్, పార్టీ జిల్లా ఇన్చార్జి పెద్ది సుదర్శన్రెడ్డి, టీజీఏ రాష్ట్ర అధ్యక్షుడు మర్రి యాదవరెడ్డి, నాయకులు గుడిమళ్ల రవికుమార్, బీరవెల్లి భరత్కుమార్రెడ్డి, నన్నపునేని నరేందర్, ఎల్లావుల లలితాయాదవ్, కె.వాసుదేవరెడ్డి, జోరిక రమేష్ పాల్గొన్నారు. -
ఘనంగా విమోచన దినోత్సవం
సమరయోధులకు సన్మానం వరంగల్ : జిల్లా వ్యాప్తంగా బుధవారం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం సాయుధ పోరులో అమరులైన వీరులకు నివాళులర్పించారు. సమర యోధులను సన్నానిం చారు. ప్రభుత్వమే అధికారికంగా విమోచన దినోత్స వం నిర్వహించాలని రాజకీయ పక్షాలన్నీ డిమాండ్ చేశాయి. ఈ విషయాన్ని బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తొలిసారి ఖిలావరంగల్లో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించిన చోట మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్రెడ్డి, ప్రేమేందర్రెడ్డి ఆధ్వర్యంలో త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేశారు. టీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్రావు, డీసీసీ కార్యాలయంలో అధ్యక్షుడు నాయిని రాజేందర్రెడ్డి, టీడీపీ జిల్లా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్రెడ్డి, హన్మకొండలోని పోలీస్హెడ్క్వార్టర్స్ ఎదుట ఏబీవీ పీ నాయకులు జాతీయ జెండాను ఎగురవేశారు. డీసీసీ కార్యాలయంలో ముందుగా జెండాను తిల కిందులుగా ఎగుర వేసిన డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్రెడ్డి, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య తర్వాత తప్పిదాన్ని గుర్తించి జెండాను కిందకు దించి సరిచేసి మళ్లీ ఎగురవేశారు. న్యాయవాదులు విధులను బహిష్కరించి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అసోసియేషన్ అధ్యక్షుడు గుడిమల్ల రవికుమార్ కోర్టులో జెడాను ఆవిష్కరించారు. తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలను నిర్వహించిన సీపీఎం నాయకులు విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేశారు. దొడ్డికొమురయ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ అమరుల స్మృతి చిహ్మనం వద్ద, మద్దూరు మండలం బైరాన్పల్లిలో అమరవీరుల సంస్మరణ సభ నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీ బూర నర్సయ్య, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తదితరులు హాజరయ్యారు. పరకాల అమరధామం వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. ఎమ్మెల్యే ధర్మారెడ్డి స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించారు. మహబూబాబాద్, నర్సంపేట, వర్ధన్నపేట, హసన్పర్తి, తొర్రూరు, పాలకుర్తి, భూపాల్పల్లి, ఏటూరునాగారం, స్టేషన్ఘన్పూర్, జఫర్గడ్లలో తెలంగాణ సాయుధ పోరాటయోధులను ఘనంగా సన్మానించారు. దేవరుప్పులలో తహసీల్దార్, ఆర్డీఓ కార్యాలయూలపై జాతీయు జెండాను బీజేపీ కార్యకర్తలు ఎగురవేశారు. డోర్నకల్లో సీపీఐ (ఎం-ఎల్) ఆధ్వర్యంలో విద్రోహ దినంగా పాటించారు.