breaking news
Travel Tips
-
వన్స్ అపాన్ ఏ టైమ్... వండర్ఫుల్ పోస్టర్స్
ఇప్పుడంటే...ఆధునికం అని ఏమిటి, అత్యాధునికమైన కెమెరాలు ఉన్నాయి. ఫొటోషాప్లు ఉన్నాయి. ఎన్నో ఎన్నెన్నో ఎడిటింగ్ టూల్స్ ఉన్నాయి. కానీ...వన్స్ అపాన్ ఏ టైమ్ పెద్దగా ఏమీ లేవు.అయినా...ఎన్నో పరిమితులు ఉన్నా, ట్రావెలింగ్కు సంబంధించిన పోస్టర్లను అద్భుతంగా డిజైన్ చేసేవారు ఆర్టిస్ట్లు. ‘అవి ఆ కాలానికి మాత్రమే’ అనుకోవడానికి లేదు. కాలాతీతమైనవి. అందుకే అలనాటి ట్రావెలింగ్కు సంబంధించిన అద్భుత పోస్టర్ల ఎగ్జిబిషన్ గురుగ్రామ్లోని ‘హెరిటేజ్ ట్రాన్స్పోర్ట్ మ్యూజియం’లో జరుగుతోంది...1920లలో...మన దేశంలోని రైల్వే బోర్డు తమ ఆదాయాన్ని ఎలా పెంచుకోవాలి అనేదాని గురించి ఆలోచించింది. ఆదాయం పెరగాలంటే ప్రయాణికుల సంఖ్య పెరగాలి. ప్రయాణికుల సంఖ్య పెరగాలంటే ఆకర్షణీయమైన ప్రకటనలు రూపొందించాలి అని నిర్ణయించుకుంది.అలా మొదలైంది...దేశంలోని ప్రధాన పర్యాటక ప్రదేశాల గురించి ప్రచారం చేయడానికి దేశీయ, అంతర్జాతీయ చిత్రకారులతో పోస్టర్లు, ఇతరత్రా విజువల్స్ రూపొందించారు. ఇవి రైల్వే స్టేషన్ గోడలపై, ఓడరేవులు, వ్యాపారకేంద్రాలు, మార్కెట్లు, పోస్టాఫీసుల దగ్గర కనిపించేవి. విదేశీ పర్యాటకులను దృష్టిలో పెట్టుకొని ఆసక్తి కలిగించేలా డిజైన్ చేసిన పోస్టర్లు కూడా ఇందులో ఉన్నాయి. ఈ పోస్టర్లలో అత్యంత పాత పోస్టర్... 1914కు చెందిన కనర్డ్ లైన్ అడ్వర్టైజ్మెంట్. అద్భుతమైన లేఔట్తో ఈ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ పోస్టర్లపై ‘విజిట్ ఇండియా’ ‘సీ ఇండియా’ అంటూ పెద్ద పెద్ద అక్షరాలు కనిపిస్తాయి. ఆరోజుల్లో రైల్వే యాడ్స్ను రూపొందించడం అనేది ఖరీదైన వ్యవహారంలా ఉండేది. ఆ ఖరీదుకు తగ్గట్టే పోస్టర్లు ఆకర్షణీయంగా కనిపించేవి.ఎయిర్ ఇండియా... మహారాజా మస్కట్ఇక విమానాల విషయానికి వస్తే... ‘ఎయిర్ ఇండియా’ పోస్టర్లు ‘మహారాజ మస్కట్’ తో ఆకట్టుకునేవి. ‘ఎయిర్ ఇండియా–రోమ్ ΄ోస్టర్’ ‘ఎయిర్ ఇండియా–యూరప్ పోస్టర్’....ఇలా రకరకాల పోస్టర్లు డిజైన్ చేసేవారు. అలనాటి న్యూ బోయింగ్ 747ను ప్రమోట్ చేయడానికి కూడా ఎయిర్ ఇండియా పోస్టర్లు రూపొందించింది.కళాత్మక విలువలునవీన సాంకేతికతతో ఫొటోగ్రఫీ కొత్త పుంతలు తొక్కడానికి ముందే పదిమందిని ఆట్టుకునేలా ఈ పోస్టర్లను రూపొందించడం విశేషం. గ్రాఫిక్ ఆర్టిస్ట్ల లితోగ్రాఫిక్ ప్రింట్స్ ఎక్కువగా ఉండేవి. గౌరీ శంకర్, పి.సమ్దార్, కుషల్ ముఖర్జీ, శోభాసింగ్, బి.సన్యాల్లాంటి చిత్రకారులు ఎక్కువగా పోస్టర్లు డిజైన్ చేసేవారు.‘మొక్కుబడిగా డిజైన్ చేసినట్లు కాకుండా కళాత్మక విలువలు ఉట్టిపడేలా ఆనాటి ట్రావెల్ పోస్టర్లు కనిపిస్తాయి’ అంటారు విశ్లేషకులు.ఆ కాలానికి స్వాగతంఅలనాటి అద్భుత విజువల్స్ ఈతరానికి పరిచయం చేయడానికి గురుగ్రామ్లోని హెరిటేజ్ ట్రాన్స్΄ోర్ట్ మ్యూజియం నడుం కట్టింది. 1930 నుంచి 1970 మధ్యలో రూ΄÷ందించిన ట్రావెల్ పబ్లిసిటీ ΄ోస్టర్లను హెరిటేజ్ ట్రాన్స్΄ోర్ట్ మ్యూజియంలో ప్రదర్శిస్తున్నారు. ‘΄ోస్టర్స్ దట్ మూవ్డ్ ఇండియా: టూరిజం, ట్రావెల్ అండ్ ట్రాన్స్΄ోర్ట్’ పేరుతో నిర్వహించే ఈ ఎగ్జిబిషన్ ఫిబ్రవరి 2026 వరకు కొనసాగుతుంది. -
పర్యాటకం: ఫ్లెమింగో! పింక్ సీజన్..ఫుల్ స్వింగ్..!
పర్యాటక ప్రదేశాలకు వెళ్లినప్పుడు అక్కడ నేలంతా పరుచుకున్న పచ్చదనం చూసి ముగ్దులవుతుంటాం. కానీ, ఈ సీజన్లో ప్రత్యేకంగా నేలంతా గులాబీ రంగుపరుచుకున్నట్టుగా.. అలల్లా ఎగిసిపడుతున్న ఆ అందం చూడాలంటే మన దేశంలోనే కొన్ని ముఖ్యమైన ప్రదేశాలున్నాయి. వీకెండ్లో ఈ పింక్ సీజన్.. మీలో ఫుల్ స్వింగ్ను ఇట్టే తెచ్చేస్తుంది. అతిథులుగా విచ్చేసి, సందడి చేస్తున్న పింక్ ఫ్లెమింగోలు బారులు బారులుగా తేరు కట్టి, తీరుగా మనల్ని అలరిస్తున్నాయి. ఆ అందాల ఆనందాన్ని తిలకించడానికి ముందుగా ముంబై మీదుగా ప్రయాణిద్దాం... భారతదేశంలో అధికారికంగా ఫ్లెమింగో సీజన్ వచ్చేసింది. పిలవకుండా వచ్చే ఈ శీతాకాలపు అతిథులు ముంబైతోపాటు నవీ ముంబైలలోని కొన్ని బెస్ట్ సైట్ సీయింగ్ ఫ్లెమింగో ప్రదేశాలు ఉన్నాయి. పొడవాటి కాళ్ళు, వంగిన మెడలు, విలక్షణమైన కిందికి వంగిన ముక్కులతో సొగసైన ఈ నీటి పక్షులు.. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న చిత్తడి నేలలను గులాబీ రంగుతో చిత్రించడం ప్రారంభించాయి. ప్రతి యేటా అక్టోబర్ చివరి నుండి మే మొదటి వారం వరకు ఫ్లెమింగోలు భారతదేశానికి వలస వస్తుంటాయి. ఫిబ్రవరి నుండి మార్చి వరకు వీటి సంఖ్య గరిష్టస్థాయిలో ఉంటుంది. ఈ సంవత్సరం వర్షాకాలం సీజన్ కొంచెం పెరగడంతో ఈ పక్షుల రాకలో కొంచెం ఆలస్యం జరిగిందని పక్షి పరిశీలకులు గమనించారు. ఇప్పుడు, ఈ అద్భుతమైన పక్షుల మొదటి గుంపు ముంబై, నవీ ముంబై అంతటా ఐకానిక్ ప్రదేశాలలో వచ్చి చేరాయి. దీంతో వీక్షకుల ఉత్సాహం మిన్నంటుతోంది. థానే క్రీక్ ఫ్లెమింగో అభయారణ్యంపక్షి ప్రేమికులకు ఈ ప్రాంతం స్వర్గధామమే. ఈ అభయారణ్యం ఐరోలి, వాషి మధ్య విస్తరించింది. ఉల్హౌస్ నది సల్సెట్ ద్వీపం ఈశాన్య మూలలో రెండు ఉపనదులుగా విడి΄ోతుంది. మరొకటి వాసాయి క్రీక్. ఈ రెండూ అరేబియా సముద్రంలోకి ప్రవహిస్తాయి. క్రీక్ సాల్సెట్ ద్వీపం తూర్పు సరిహద్దును ఏర్పరచడం, కొంకణ్ ప్రధాన భూభాగం నుండి ద్వీపాన్ని వేరు చేస్తుంది. దీనినే థానే క్రీక్ అంటారు. ఈ ్ర΄ాంతం వివిధ ఏవియన్ జాతులకు నిలయంగా ఉండటంతో బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ ద్వారా ముఖ్యమైన పక్షి ప్రాంతంగా గుర్తించబడింది. ముఖ్యంగా ఇది ఫ్లెమింగోలు, అనేక ఇతర వలస, నీటి పక్షుల జనాభాకు నిలయంగా ఉంది. ఫ్లెమింగోలను దగ్గరి నుంచి వీక్షించడానికి కోస్టల్ – మెరైన్ బయోడైవర్సిటీ సెంటర్ నుండి ప్రసిద్ధ బోట్ సఫారీ ఉంది.సేవిరి మడ్ ఫ్లాట్స్ ముంబై నడిబొడ్డున ఉన్న ఈ ΄ోషకాలతో కూడిన బురద ఫ్లాట్లు వేలాది ఫ్లెమింగోలను ఆకర్షిస్తాయి. బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ ఇక్కడ గైడెడ్ వాక్లు మరియు ఫ్లెమింగో–వాచింగ్ ఈవెంట్లను నిర్వహిస్తుంది.భండప్ పంపింగ్ స్టేషన్తూర్పు ఎక్స్ప్రెస్ హైవేకి దూరంగా ఉన్న ఈ క్రీక్సైడ్ స్పాట్ పక్షులను చూసేవారికి, ముఖ్యంగా సూర్యోదయ– సూర్యాస్తమయ సమయంలో చాలా ఇష్టమైనది. ఈ ప్రాంతం మడ అడవులతో ఆకర్షణీయంగా ఉంటుంది. వివిధ రకాల నీటి బాతులు, వలస పక్షులను ఆకర్షిస్తుంది.డీపీఎస్ ఫ్లెమింగో సరస్సుఇప్పుడు నవీ ముంబైలోని నెరుల్ ప్రాంతంలో ఒక పరిరక్షణ అభయారణ్యం, ఈ సరస్సు సూర్యోదయం– సూర్యాస్తమయ సమయాలలో అద్భుతమైన దృశ్యాలను అందిస్తుంది. ఇది ఫొటోగ్రాఫర్ల కంటికి కళల దృశ్యమై కనువిందు చేస్తుంది. ఇది నగరంలో ప్రశాంతమైన ప్రదేశం, ప్రకృతి నడకలు, పక్షుల ఫోటోగ్రఫీకి అనువైనది.కరావే ఫ్లెమింగో పాయింట్నవీ ముంబైలోని సీవుడ్స్లో టీఎస్ చాణక్య సమీపంలో, సుందరమైన వెట్ల్యాండ్స్లో నడుస్తూ ఫ్లెమింగోలను చూడొచ్చు. ప్రశాంతమైన పరిసరాలు, కుటుంబంతో కలిసి చేసే విహారయాత్రలు, పర్యావరణ పర్యాటకానికి గొప్ప ప్రదేశంగా మారాయి. ఫ్లెమింగో గుంపులను దగ్గర నుంచి చూసేందుకు సీజనల్ బోట్ రైడ్లు అందుబాటులో ఉంటాయి.భిగ్వాన్లోని ఉజాని ఆనకట్ట బ్యాక్ వాటర్స్తరచుగా మహారాష్ట్ర భరత్పూర్ అని పిలువబడే భిగ్వాన్ పక్షి ప్రేమికులకు అంతగా తెలియని రత్నం. పూణే సమీపంలోని యశ్వంత్ సాగర్ జలాశయం ఫోటోగ్రాఫర్లకు మరొక హాట్స్పాట్.కర్నాల పక్షుల అభయారణ్యం ముంబైకి సమీపంలో ఉన్న ఈ అభయారణ్యం ట్రెక్కింగ్ ట్రైల్స్, ఇతర వలస జాతులతో పాటు ఫ్లెమింగోలను వీక్షించడానికి వీలు కల్పిస్తుంది. ఇది చారిత్రాత్మక కర్నాల కోటకు నిలయం. అంతేకాదు, పక్షులను చూడటానికి గొప్ప ప్రదేశం.నందూర్ మధమేశ్వర్ పక్షుల అభయారణ్యం : నాసిక్లోని ఒక ముఖ్యమైన చిత్తడి నేల ఇది. ప్రకృతి ప్రేమికులకు, ఫొటోగ్రాఫర్లకు అనువైనది. ఈ అభయారణ్యం రామ్సర్ ప్రదేశంగా గుర్తించబడింది, శీతాకాలంలో వేలాది వలస పక్షులను ఈ ప్రాంతం ఆకర్షిస్తుంది. ప్రకృతితో తిరిగి కనెక్ట్ అవ్వాలనుకునే వారికి కోయ్నా వన్యప్రాణుల అభయారణ్యం, సంజయ్ గాంధీ నేషనల్ పార్క్తోపాటు మహారాష్ట్ర నేచర్ పార్క్లను కూడా సందర్శించవచ్చు. ఫ్లెమింగోలను చూడటం అనేది కేవలం దృశ్యాలను వీక్షించే కార్యక్రమం కాదు. వేగవంతమైన ప్రపంచంలో నిశ్శబ్దంగా ఉండే అందమైన, ఆహ్లాదకరమైన దృశ్యాలను మనసులో ముద్రించుకోవచ్చు. నిశ్శబ్దంలో నీటి అలలు, తెల్లవారుజామున ఆకాశంలో మెత్తటి రెక్కల శబ్దంలో నవీ ముంబై విలువైన అరుదైన సహజ విహారయాత్రను అందిస్తుంది.సూర్యోదయం–సూర్యాస్తమయాలు అత్యుత్తమం...ఉదయం 7 నుండి 9 గంటల మధ్య లేదా మధ్యాహ్నం 4 నుండి 6 గంటల మధ్య, పక్షులు చురుకుగా ఆహారం తీసుకుంటున్నప్పుడు ఈ ప్రదేశాలు చాలా అందంగా ఉంటాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడ విహరించవచ్చు. ప్రవేశ రుసుము ఒక్కొక్కరికి రూ.50, గైడెడ్ బోట్ సఫారీ ఒక్కొక్కరికి రూ.500..పడవ ప్రయాణానికి..ఈ ప్రదేశాలలో స్థానిక మత్స్యకారులు నేచర్ లవర్స్కి సూర్యోదయ పడవ ప్రయాణాలను అందిస్తారు. పక్షులకు దాణా వేయడం, వాటిని అందుకోవడానికి పెద్ద సంఖ్యలో ఫ్లెమింగోలు ఎగరడం.. ఆహ్లాదంగా అనిపించే ఉదయాలే దీనికి ఉత్తమ సమయం. అభయారణ్యం వెలుపల పడవ ప్రయాణాలు సాధారణంగా ఉదయం 6.30 గంటలకు ప్రారంభమవుతాయి. ఈ పడవ ప్రయాణానికి సీజన్, వ్యక్తుల సమయాన్ని బట్టి వ్యక్తికి రూ.900 – రూ.1,500 మధ్య ఖర్చవుతాయి.ఇలా చేరుకోవచ్చు...హైదరాబాద్ ప్రయాణికులు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ముంబైకి రెండు గంటల విమాన ప్రయాణం ద్వారా చేరుకోవచ్చు. తరువాత రైలు లేదా టాక్సీ ప్రయాణం ద్వారా నవీ ముంబైకి వెళ్లచ్చు. వాషి, నెరుల్, సీవుడ్స్లో వసతి సదుపాయం లభిస్తుంది.మన దేశానికి అరుదెంచే వలస పక్షుల సమయాలు...పింక్ ఫ్లెమింగోలు శీతాకాలంలో దాదాపు నవంబర్ నుండి మే వరకు భారతదేశానికి వస్తాయి. జనవరి నుండి మార్చి వరకు విస్తృతంగా సందడి చేస్తాయి. ఫ్లెమింగో సీజన్ మాత్రం నవంబర్ నుండి మే వరకు కొనసాగుతుంది. కాక΄ోతే వాటి సంఖ్య తగ్గుతూ ఉంటుంది. ఈ సీజన్లో నివాసి లెస్సర్ ఫ్లెమింగోలు, వలస వచ్చిన గ్రేటర్ ఫ్లెమింగోలు రెండూ కనిపిస్తాయి. ట్రావెల్ ట్రెండ్స్జెన్ ఏఐ వోవర్ అడ్మిన్ రాబోయే కాలంలో ప్రయాణాలకు సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) వాడకం పెరగబోతోంది. ప్రయాణికులు ఇప్పటికే ట్రావెల్ ప్లాన్, బుకింగ్ల కోసం జనరేటివ్ ఏఐని ఉపయోగిస్తున్నారు. ప్రయాణాలకు సంబంధించి సలహాలు, సూచనలు ఇవ్వడానికి చాట్జీపీటీ కూడా రంగంలోకి దిగడంతో ప్రయాణాలను ప్లాన్ చేసుకోవడం గతంలో కంటే చాలా సులువు అయింది. ప్రయాణాలకు సంబంధించి ఏఐ సాంకేతికతను వాడుకోవడానికి సంబంధించి మంచితోసాటు చెడు కూడా ఉంది అని చెబుతున్నారు నిపుణులు. ఆల్గోరిథమిక్ సిఫారసులు వోవర్ టూరిజానికి కారణం అవుతాయని, ఉద్దేశపూర్వకంగా కొన్ని ప్రాంతాలను మాత్రమే ప్రయాణానికి సూచిస్తాయని, ట్రావెల్ స్కామ్స్ జరగడానికి కూడా అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ‘ప్రయాణాల కోసం ఏఐ సాధనాలను వాడుకోవడానికి సంబంధించి ఎన్నో పరిమితులు ఉన్నాయి’ అంటుంది కల్చరల్ ట్రెండ్స్ స్పెషలిస్ట్ జాస్మీన్ బినా.ఇతర రాష్ట్రాలలోనూ...మహారాష్ట్రలోని చిత్తడి నేలలు, సరస్సులతోపాటు గుజరాత్లోని రాన్ ఆఫ్ కచ్, ఒడిశాలోని చిలికా సరస్సు వంటి తీర్ర΄ాంతాలలో ఫ్లెమింగోలు అద్భుతమైన అందాలలో కనువిందు చేస్తాయి. మహారాష్ట్రలో భిగ్వాన్ ‘దక్షిణ భారత్పూర్‘ అని పిలుస్తారు, ఉజాని ఆనకట్ట బ్యాక్ వాటర్ ఫ్లెమింగో గుంపుకు ప్రసిద్ధి చెందింది.గుజరాత్లో...అతిపెద్ద లెస్సర్ ఫ్లెమింగో బ్రీడింగ్ గ్రౌండ్ (ఫ్లెమింగో సిటీ) కు నిలయం. నల్ సరోవర్, థాల్ లేక్ పక్షుల కేంద్రం, ఖిజాదియా పక్షుల అభయారణ్యంలో శీతాకాలంలో ఫ్లెమింగోలు పుష్కలంగా కనువిందు చేస్తాయి. చేరుకోవడానికి ప్రయాణ మార్గం...విమానంలో... హైదరాబాద్ రాజీవ్గాంధీ ఎయిర్ ΄ోర్ట్ నుంచి అహ్మదాబాద్ లేదా జామ్ నగర్కు చేరుకోవచ్చు. అహ్మదాబాద్ నుంచి నల్ సరోవర్, థాల్ ్ర΄ాంతాలకు కారు లేదా లోకల్ ట్రైన్లో చేరుకోవచ్చు. కచ్కు విమానంలో లేదా రోడ్డు, రైలు మార్గం ద్వారా చేరుకొని తర్వాత రాన్కు ప్రయాణించవచ్చు. రాజస్థాన్సాంబార్ సరస్సు ఫ్లేమింగోలకు శీతాకాలపు విడిది ప్రదేశం. హైదరాబాద్ నుండి 1100 కిలోమీటర్ల దూరంలో ఉంది సాంబార్ లేక్. విమానం /రైలు మార్గాల్లో వయా జైపూర్కు చేరుకొని వెళ్లాలి. రైలు మార్గంలో నాగ్పూర్, ఫులేరా కు చేరుకోవచ్చు. ఒడిశాభారతదేశంలోని అతిపెద్ద తీర్రప్రాంత సరస్సు అయిన చిలికా సరస్సు వేలాది మందిని ఆకర్షిస్తుంది. హైదరాబాద్ నుంచి చిలికా సరస్సు రోడ్డు మార్గంలో దాదాపు వెయ్యి కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఫ్లైట్/ ట్రెయిన్/ బస్ మార్గాల ద్వారా విశాఖపట్నం, భువనేశ్వర్ మీదుగా చేరుకోవచ్చు. భువనేశ్వర్కి విమానంలో వెళ్లి అక్కణ్ణుంచి టాక్సీ లేదా ట్రెయిన్ ద్వారా సరస్సుకు చేరుకోవచ్చు. – నిర్మలారెడ్డి, సాక్షి, ఫీచర్స్ ప్రతినిధి (చదవండి: ఎముకలు కొరికే చలిలో..టీ,కాఫీ తాగుతున్నారా?) -
రైలు ప్రయాణం హాయిగా సాగిపోవాలంటే..!
రైలు ప్రయాణం అంటే ఎలా ఉంటుందో చెప్పనవసరం లేదు. స్లీపర్ క్లాస్లో వెళ్లితే ప్రశాంతత మాట దేవుడెరుగు..ఒకటే గజిబిజి గందరగోళంలా ఉంటుంది వాతావరణం. ఏదో ఫోన్లో తలదూర్చి లేదా పేపర్తోనే కాలక్షేపం చేస్తూ ఎప్పుడు దిగిపోతాం రా బాబు అనుకుంటుంటాం. అలాంటి విసుగు, ఇబ్బంది కలగకుండా హాయిగా ట్రైన్ జర్నీ సాగిపోవాలంటే బాలీవుడ్ నటి మలైకా అరోరా చెప్పే జర్నీ చిట్కాలను ప్రయత్నించి చూడండి. ఆమె తన రైలు ప్రయాణాన్ని వీడియో తీసి మరీ నెట్టింట్ షేర్ చేశారు. ఆ వీడియోలో మలైకా మీరు బుక్ చేసుకున్న క్లాస్ని బట్టి జర్నీ ఎంజాయ్ చేయడం అనేది ఆధారపడి ఉంటుందన్నారు. "తక్కవ బడ్జెట్లో వెళ్లాలనుకుంటే స్లీపర్, సెకండ్ క్లాస్లు అనువైనవి. అలాకాకుండా తన వ్యక్తిగత గోప్యత కోరుకునే ప్రయాణికులకు ఫస్ట్-క్లాస్ ఏసీ కంపార్ట్మెంట్లు అనుకూలం. రైల్లో ఎక్కువసేపు ప్రయాణించేవాళ్లు తప్పనిసరిగి పిల్లో, దుప్పటిని తప్పనిసరిగా తీసుకెళ్లడం ఉత్తమం. ఇది ఇంటిలో ఉన్న అనుభూతిని ఇస్తుంది. దీంతోపాటు సౌకర్యవంతమైన దుస్తులు ధరించడం మంచిది. తేలికగా జీర్ణమయ్యే తినుబండరాలను కూడా తీసుకువెళ్లండి. అలాగే రాత్రి సమయాల్లో నిద్రపట్టనప్పుడు కాలక్షేపమయ్యేలా మంచి పుస్తకాలను, లేదా మ్యూజిక్, సినిమా చూసేలా ఏర్పాట్లు చేసుకోండి. ఇలాంటి సింపుల్ చిట్కాలతో ట్రైన్ జర్నీని హాయిగా ఎంజాయ చేస్తే సరి." అని మలైకా వీడియోలో వివరించారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) (చదవండి: చర్మతత్వాన్ని బట్టి మాయిశ్చరైజర్లు రాసుకోవాలి..!) -
Travel: హిమాలయాల్లో చివరి నివాస ప్రదేశం ఇదే!
Travel Tips In Telugu: హిమకుండ్ సాహిబ్... ఇది సిక్కుల పవిత్రతీర్థం. సిక్కుల పదవ గురువు ‘గురు గోవింద్ సింగ్’ ధ్యానం చేసుకున్న ప్రదేశం. హిమకుండ్ అంటే మంచుసరస్సు. ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలో, సముద్ర మట్టానికి 4,329 మీటర్ల ఎత్తున ఉంది ఈ ప్రదేశం. ఇక మంచు టోపీలు పెట్టుకున్న పర్వత శిఖరాలు చూపరులను కట్టి పడేస్తాయి. ఇక్కడ గురుద్వారా, లక్ష్మణునికి ఆలయం ఉన్నాయి. సిక్కులు ఈ పవిత్ర తీర్థంలో మునిగి ఇక్కడ ఉన్న గురుద్వారాని దర్శించుకుంటారు. ఆసక్తికర అంశాలు ►హిమకుండ్ సాహిబ్ టూర్లో వరల్డ్ హెరిటేజ్ సైట్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ను కూడా కలుపుకోవచ్చు. ►ఘంఘారియా ప్రత్యేకతను కూడా తెలుసుకుని మరీ ఇక్కడ పర్యటన కొనసాగించాలి. ►ఇది పుష్పావతి, హిమగంగ నదుల కలయిక ప్రదేశం. హిమాలయాల్లో చివరి నివాస ప్రదేశం కూడా. ►డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకు ఈ ప్రదేశం మంచుదుప్పటి కప్పుకుని ఉంటుంది. ►ట్రెకింగ్కి మే నెల నుంచి అక్టోబర్ వరకు అనుమతిస్తారు. చదవండి: Beauty Tips In Telugu: నల్లని కురులకు.. బ్లాక్ జీరా ప్యాక్! -
Travel: కివి, అప్రికాట్, ఎర్రటి యాపిల్ పండ్లు.. నది పాయలు, మంచు..
Reasons to Discover Sangti Valley: కనుచూపు మేరలో ఎటుచూసినా ధీరగంభీరంగా హిమాలయ పర్వతాలు. చడీచపుడు చేయకుండా సన్నగా కురిసే మంచు. మంచుకు ఆవల కనుచూపుమేర విస్తారమైన పండ్లతోటలు. కివి, అప్రికాట్, పెద్ద సీమ కమలాలు, కశ్మీర్ యాపిల్ను తలదన్నే ఎర్రటి యాపిల్ పండ్లు... రంగురంగుల్లో నోరూరిస్తుంటాయి. నల్ల మెడ తెల్ల కొంగలు ఈ తోటల్లో సొంతదారుల్లా విహరిస్తుంటాయి. ఈ తోటల వాలులో ఝమ్మని మంద్రంగా శబ్దం చేస్తూ కనిపించీ కనిపించకుండా ప్రవహించే నది పాయలు. ఇది అరుణాచల్ ప్రదేశ్, సంగ్తిలోయకు సొంతమైన ప్రకృతి సౌందర్యం. బస ఇలాగ! సంగ్తి వ్యాలీ పూర్తిగా ప్రకృతి ఒడి. ఇక్కడ ఆధునికత అంటే పర్యాటక ప్రధానమైన అభివృద్ధి మాత్రమే. పర్యాటకులు ప్రకృతితో మమైకమై జీవించిన అనుభూతి పొందడం కోసం బసకు గుడారాలుంటాయి. గుడారపు బసలు విలాసవంతంగా ఉండవు. కానీ చక్కటి బెడ్, లైట్లు, ఫ్యాన్, అటాచ్డ్ బాత్రూమ్తో సౌకర్యవంతంగానే ఉంటాయి. గుడారాలన్నీ నది తీరానే ఉంటాయి. ఈ ట్రిప్లో... రాత్రి భోజనం తర్వాత నది తీరాన చలిమంట వేసుకుని ఆ మంట చుట్టూ తిరుగుతూ డాన్స్ చేయడం మాత్రం మర్చిపోకూడదు. ఇక్కడ ఏమి తినాలి? ఆహారంలో మసాలాలు తక్కువగా ఉంటాయి. భోజనం రుచిగానే ఉంటుంది. స్థానిక భోజనం రుచి చూడాలంటే కొంచెం కష్టమే. ఇక్కడి హోటళ్లలో టూరిస్టుల కోసం నార్త్, సౌత్ ఇండియన్ రుచులనే ఎక్కువగా వండుతారు. ఇంకా! ►మొబైల్ సిగ్నల్స్ ఉండవు. కాబట్టి రూట్ని ముందుగా డౌన్లోడ్ చేసుకోవాలి. ఫోన్ కాల్స్ డిస్టర్బెన్స్ ఉండదు, కాబట్టి టూర్ని ఆసాంతం ఆస్వాదించవచ్చు. ►ఇక్కడి మనుషులు అత్యంత వినయశీలురు, నిజాయితీపరులు. క్యాబ్ డ్రైవర్లు డ్యూటీ టైమ్కి పది నిమిషాల ముందే సిద్ధంగా ఉంటారు. ►పర్యాటకులు క్యాబ్లో పర్సు మర్చిపోతే ఫోన్ చేసి మరీ ఆ పర్సును డబ్బుతో సహా జాగ్రత్తలగా పర్యాటకులకు చేరే ఏర్పాటు చేస్తారు. ►టూరిస్టు ప్రదేశాలన్నీ ప్లాస్టిక్ రహితంగా ఉంటాయి. కానీ స్థానికులకు ప్లాస్టిక్ వాడకం పట్ల పెద్దగా పట్టింపులు ఉన్నట్లు కనిపించదు. ►యధేచ్ఛగా వాడేస్తుంటారు. ప్లాస్టిక్ వాడకం పట్ల ప్రపంచం స్వీయనియంత్రణలు అనుసరిస్తున్న సంగతి బహుశా వాళ్లకు తెలియకపోవచ్చు. చదవండి: Chikmagalur: చిక్మగళూరు.. మంచి కాఫీలాంటి విహారం -
Travel Tips: ప్రయాణానికి ముందు జాగ్రత్తలు మర్చిపోకండి!
కచ్ మహోత్సవ్కు వెళ్లాలనుకున్న వాళ్లు టెంట్ సిటీలో బస చేయాలనుకుంటే షెడ్యూల్ విడుదల అయిన వెంటనే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. టెంట్ సిటీ అంటే... ఈ వేడుకల కోసం చక్కటి వ్యూ ఉన్న ప్రదేశంలో టూరిజం డిపార్ట్మెంట్ గుడారాలతో సిద్ధం చేసిన నగరం. ఇందులో దాదాపుగా స్టార్ హోటల్ సౌకర్యాలన్నీ ఉంటాయి. ►పగలు సూర్యుడి కిరణాలు కళ్ల మీద పడి దృష్టిని చెదరగొడుతుంటాయి. కాబట్టి టూర్కి వెళ్లేటప్పుడు కూలింగ్ గ్లాసెస్తోపాటు పెద్ద హ్యాట్, గొడుగు దగ్గర ఉంచుకోవాలి. ►రాత్రి ఉష్ణోగ్రతలు బాగా తక్కువ కాబట్టి ఉలెన్ జాకెట్లు తీసుకెళ్లాలి. దేశ సరిహద్దు కావడంతో ఇక్కడ సెక్యూరిటీ పటిష్టంగా ఉంటుంది. ►ఐడీ కార్డు దగ్గర ఉంచుకోవాలి. అలాగే గ్రూప్గా వెళ్లినవాళ్లు గ్రూప్ నుంచి విడివడి ఒంటరిగా మరీ దూరంగా వెళ్లకపోవడమే మంచిది. ►ఒకవేళ వెళ్లినట్లయితే ఐడీకార్డు చూపించి సెక్యూరిటీ ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగి ఉండాలి. ►పర్యటనకు వెళ్లినప్పుడు స్థానికుల సంప్రదాయాలను హేళన చేయరాదు, తేలిక చేసి మాట్లాడరాదు. ►ఇతరుల సంప్రదాయాలను గౌరవించడమే సంస్కారం అని మర్చిపోకూడదు. చదవండి: చిన్నవయసులో ఆర్ధరైటిస్.. ఈ లక్షణాలు ఉన్నాయేమో చూసుకోండి -
ఇండియాలో ఎక్కువ దూరం ప్రయాణించే రైలు ఏదో తెలుసా?
మనదేశంలో ఎక్కువ దూరం ప్రయాణించే రైలు వివేక్ ఎక్స్ప్రెస్. ఇది అస్సాంలోని దిబ్రూగఢ్ నుంచి తమిళనాడులోని కన్యాకుమారి వరకు 4,273 కి.మీల దూరం ప్రయాణిస్తుంది. తొమ్మిది రాష్ట్రాల మీదుగా సాగిపోతుంది. మధ్యలో 56 స్టేషన్లలో ఆగుతుంది. దిబ్రూగఢ్లో మొదలైన రైలు కన్యాకుమారి చేరడానికి ఐదు రోజులు పడుతుంది. ఇది వీక్లీ ట్రైన్. ట్రావెల్ టిప్స్: జాగ్రత్తగా వెళ్లి వద్దాం ► టూర్కి వెళ్తున్న ప్రదేశం ప్రత్యేకతలను ముందుగా తెలుసుకుని బయలుదేరితే పర్యటనను ఆసాంతం ఆస్వాదించవచ్చు. ► ముఖ్యంగా అక్కడికి మాత్రమే ప్రత్యేకమైన వంటలు, పండ్లు, అక్కడ మాత్రమే దొరికే వస్తువులను మిస్ కాకూడదు. ► టూర్లో ఉదయం బ్రేక్ఫాస్ట్ మాత్రం పూర్తి స్థాయిలో తీసుకోవాలి. ► ఇక రోజంతా ఆహారాన్ని ఒకేసారి ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు. కొద్ది కొద్దిగా ఎక్కువ సార్లు తీసుకోవాలి. ► టూర్కి వెళ్లే ముందు ఫ్యామిలీ డాక్టర్ను సంప్రదించి, డాక్టర్ సూచించిన మందులను వెంట తీసుకు వెళ్లాలి. -
Neelakurinji: ఆ పువ్వులు మళ్లీ 2030లో పూస్తాయి!
మున్నార్ అంటే మూడు నదుల సమ్మేళనం. పశ్చిమ కనుమలలో విస్తరించిన ఈ ప్రదేశం ముథిరాప్పుజ, నల్లతన్ని, కుండలి నదుల మధ్య ఉన్న హిల్స్టేషన్. ఈ కొండలకు నీలగిరులు అనే పేరు రావడానికి ‘నీలకురింజి’ పూలే కారణం. కేరళలో ఏ ప్రదేశానికి ట్రిప్ అయినా సరే ట్రైన్ పాలక్కాడ్ సమీపించగానే మరోలోకంలోకి వెళ్తున్న భావన కలుగుతుంది. పచ్చని పొలాలు, లెక్కపెట్టటానికి సాధ్యం కానన్ని కొబ్బరిచెట్లు కనువిందు చేస్తాయి. రైల్లోకి కనిపించే చిన్న చిన్న గ్రామాలు, ఇళ్లు ముచ్చటగా ఉంటాయి. చాలా వరకు పెంకుటిళ్లే. పెంకులను అమర్చడంలో నైపుణ్యం సీనియర్ ఆర్కిటెక్ట్ను కూడా మురిపించేటట్లు, ఇల్లంటే ఇలా ఉండాలి అనిపించేటట్లు ఉంటుంది. ఇటీవల ఆర్కిటెక్ట్లు ఎర్ర పెంకు కప్పు నిర్మాణాల మీద ప్రత్యేకంగా అధ్యయనం చేస్తున్నారు కూడా. పుష్కరకాలం ఎదురు చూపు నీలగిరుల్లో పన్నెండేళ్లకోసారి ప్రకృతి వరం వికసిస్తుంది. కొండల మీద ఎటు చూసినా నీలకురింజి చెట్లే. ఈ చెట్లు పన్నెండేళ్లకు ఒకసారి పూస్తాయి. పూసిన పువ్వు ఏడాది వరకు ఉంటుంది. ఒక చెట్టు ఒక్కపువ్వును మాత్రమే పూసి వాడిపోతుంది. ఆ పువ్వు పేరు నీలకురింజి. నీల అంటే నీలిరంగు, కురింజి అంటే మళయాళంలో పువ్వు అని అర్థం. ఆ నీలిపువ్వునుంచి రాలిన గింజలు మొలకెత్తి పన్నెండేళ్లకు పూతకు వస్తాయి. నీలకురింజి పూలు పూసిన ఏడాది పర్యటించగలగడం అదృష్టమనే చెప్పాలి. 2006లో ఈ పూలు పూశాయి, ఆ తర్వాత 2018లో పూశాయి. ఆ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం రోజు ప్రధానమంత్రి తన ప్రసంగంలో పశ్చిమ కనుమల్లో విరిసే నీలకురింజి గురించి ప్రస్తావించారు. అయితే ఆ ఏడాది ప్రకృతి వరం ఇవ్వడంతోపాటు కన్నెర్ర కూడా చేసింది. పూలు కొండల నిండుగా విరిసిన జూలై, ఆగస్టుల్లో కుంభవృష్టి కురిసింది. కొచ్చి ఎయిర్పోర్టు రన్వే మీద కూడా నీళ్లు నిలిచాయి. విమాన సర్వీసులు ఆగిపోయాయి. రైళ్లు నడవడం కూడా కష్టమైంది. వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత కూడా టూరిజం గాడిన పడడానికి కొద్ది నెలలు పట్టింది. పర్యాటకుల పుష్కర కాలపు ఎదురు చూపు వృథా అయింది. ఒకటి కాదు... యాభై రకాలు! కురింజి పూసినప్పుడు కొండలన్నీ నీలిరంగు దుప్పటి పరిచినట్లు ఉంటాయి. మున్నార్, ఊటీ, కొడైకెనాల్లను మామూలు రోజుల్లో చూసిన వాళ్లు కూడా కురింజి కోసం ఆ పువ్వు పూసే ఏడాది మళ్లీ టూర్ ప్లాన్ చేసుకుంటారు. బొటానికల్గా వీటిని 50 రకాల జాతులుగా చెప్తారు కాని మనకు చూడడానికి అన్నీ నీలంగానే ఉంటాయి, షేడ్లు మాత్రం ఏ చిత్రకారుడూ మిక్స్ చేయలేనంత లలితంగా ఉంటాయి. ఈ పూలు మళ్లీ 2030లో పూస్తాయి. ఆ ఏడాది కోసం ఎదురు చూద్దాం. ట్రావెల్ టిప్స్: జాగ్రత్తగా వెళ్లి వద్దాం! కేరళలో ఎండాకాలం ఉష్ణోగ్రతలు ఎక్కువ. కాబట్టి టూర్లో తేలికపాటి దుస్తులు ధరించాలి. ఈ వాతావరణంలో పాదాలకు కూడా చెమట పడుతుంది. రెయినీ షూస్ అయితే తడి నేల మీద అడుగు వేసినప్పుడు జారదు. బురద అంటినా శుభ్రం చేసుకోవడం సులభం. కేరళ ఆహారంలో మసాలాలు ఉండవు కాబట్టి, జీర్ణాశయ సమస్యలు ఎదురుకావు. జలుబు, జ్వరం మందులు మాత్రం దగ్గర ఉంచుకుంటే సరిపోతుంది. కేరళ టూర్లో రోజూ తలస్నానం చేయాలి, ఒక కొబ్బరి బోండాం తాగడం కూడా మంచిది. కేరళలో దొరికే అరటికాయ చిప్స్ రుచి చూడాలి. కొబ్బరి నూనెలో వేయించిన అరటికాయ చిప్స్ నెల రోజుల వరకు తాజాగా ఉంటాయి. వీలయితే కొన్ని ప్యాకెట్లు తెచ్చుకోవచ్చు. ∙టీ ఆకులతో మరిగించిన టీ రుచి చూడాలి. టీ పొడులు రకరకాల ఫ్లేవర్లు దొరుకుతాయి. చదవండి: కొండల రాణి.. మేఘాల్లో తేలినట్లుగా ఉంటుంది! -
ప్రయాణంలో పిల్లలను వెంట తీసుకెళ్లాల్సి వస్తే...
ట్రావెల్ టిప్స్ వేసవిలో పిల్లలకోసం తప్పనిసరి ప్రయాణాలుంటాయి. వారిలో ప్రయాణపు ఆనందాన్ని పెంచడానికి కొన్ని సూచనలు... పిల్లలు ఎప్పుడూ ఫన్ కోరుకుంటారు. బొమ్మలు వారి సరదా తీర్చినా, అది కొంతసేపే! వారి మెదళ్లకు ఎక్కువ పని ఉండేవి.. బోర్ కొట్టని ‘బ్రెయిన్ బిల్డింగ్ గేమ్స్’ వెంట తీసుకెళ్లడం మంచిది. వాతావరణ మార్పులు పడక పిల్లలకు జలుబు, దగ్గు, జ్వరం వస్తుంటాయి. వీటికి సంబంధించిన మందుల కోసం ప్రయాణానికి ముందుగానే డాక్టర్ని సంప్రదించి, వారి సూచన తీసుకోవాలి. పెద్దవారి మందులతో కలిపి కాకుండా జిప్పర్లాక్ బ్యాగ్లో వేసి, విడిగా పెడితే త్వరగా తీసుకొని, ఉపయోగించడానికి వీలుగా ఉంటుంది. కొంతమంది పిల్లలకు వాహనాల్లో ప్రయాణించడం పడదు. వాంతి చేసుకోకుండా ఉండటానికి ‘సిక్నెస్’ మందులను కూడా వైద్యుల సూచన మేరకు వెంట ఉంచుకోవాలి.ఆకలి వేసి పిల్లలు విసిగించకుండా ఉండాలంటే అల్పాహారం, భోజనం సరిపడినంత తినిపించాలి. బిస్కెట్లు, పాలు, జ్యూస్, పెరుగు, పండ్లు.. ఇలా పిల్లలు తినదగ్గ, ఎంపిక చేసుకున్న ఇతర పదార్థాలను హోటల్రూమ్లో సిద్ధంగా ఉంచుకోగలిగితే సమయం, డబ్బు ఆదా అవుతాయి. వెళ్లే చోట పిల్లలు ఆనందించే విహార ప్రదేశాల గురించి ముందే తెలుసుకోవాలి. రోజులో పిల్లలు ఎక్కువ సేపు ఆడుకునే క్రీడా మైదానాలకు తీసుకెళితే, ఆ తర్వాత చూడాల్సిన ప్రదేశాలనూ వారు బాగా ఆనందిస్తారు.


