breaking news
Transport authorities
-
ఓలాకు షాక్ : లండన్లో బ్యాన్
సాక్షి, న్యూఢిల్లీ : దేశీయ క్యాబ్ సేవల సంస్థ ఓలాకు లండన్లో ఎదురు దెబ్బ తగిలింది. ప్రజా రవాణా భద్రతా నిబంధనలు ఉల్లంఘించిన ఆరోపణలతో ఓలాకు చెందిన ఆపరేటింగ్ లైసెన్స్ ను లండన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ అథారిటీ రద్దు చేసింది. ఓలా భద్రతా చర్యలు నిబంధనలకు అనుగుణంగా లేవని, ప్రయాణీకుల భద్రతను ప్రమాదంలో పడేసిందని పేర్కొంది. ఈ మేరకు ట్రాన్పోర్ట్ ఫర్ లండన్ (టీఎఫ్ఎల్) ఒక ప్రకటన జారీ చేసింది. మరో క్యాబ్ సేవల సంస్థ, ఓలా ప్రధాన ప్రత్యర్థి ఉబెర్ గతంలో భద్రతాపరమైన కారణాల రీత్యా ఇలాంటి చర్యలనే ఎదుర్కొంది. అయితే చట్టబద్ధమైన నిబంధనలు తొలగి, లైసెన్స్ తిరిగి సాధించిన సేవలకు సుగమమైన తరుణంలో ఓలాకు వ్యతిరేకంగా తాజా ఆదేశాలు జారీ అయ్యాయి. ఓలా సేవల్లో అనేక వైఫల్యాలను కనుగొన్నట్లు టీఎఫ్ఎల్ తెలిపింది. నిబంధనల ఉల్లంఘనలతో సహా, లైసెన్స్ లేని డ్రైవర్లు వాహనాలను నడుపుతున్నారని వాదించింది. దీనిపై అప్పీల్ చేయడానికి ఓలాకు 21 రోజులు (అక్టోబర్ 24) సమయం ఉందని తెలిపింది. దీనిపై స్పందించిన ఓలా డేటా బేస్లో సాంకేతిక లోపం కారణంగానే ఈ సమస్య తలెత్తిందని వెల్లడించింది. ఈ విషయంలో టీఎఫ్ఎల్ సంస్థతో సంప్రదింపులు జరుపుతామని, పారదర్శకంగా పనిచేయడానికే తమ ప్రాధాన్యత అని ఓలా యూకే ఎండీ మార్క్ రోజెండల్ తెలిపారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. కాగా బెంగళూరుకు చెందిన ఓలా ఈ ఏడాది ఫిబ్రవరిలో లండన్ టాక్సీ మార్కెట్లోకి ప్రవేశించింది. భారతదేశంలో ఉబెర్తో పోటీపడుతున్న భవిష్ అగర్వాల్ నేతృత్వంలోని సంస్థ యుకెతో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్కు తన సేవలను విస్తరించిన సంగతి తెలిసిందే. -
అక్కడ ప్రమాదం.. ఇక్కడ తనిఖీలు
మత్తువీడిన రవాణశాఖ అధికారులు రెండు రోజులుగా స్కూల్ బస్సుల తనిఖీలు ఒంగోలు క్రైం :మెదక్ జిల్లాలో స్కూల్ బస్సు ప్రమాదానికి గురై విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడంతో జిల్లాలో రవాణాశాఖాధికారులు అప్రమత్తమయ్యారు. పాఠశాలలు, కళాశాలలు ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నా బస్సులను తనిఖీ చేయని అధికారులు.. మెదక్లో ప్రమాదం జరగడంతో ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. పాఠశాలలు ప్రారంభానికి మందే బస్సులను ఆర్టీవో అధికారులు తనిఖీ చేయాల్సి ఉంది. ఇంతవరకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు తీసుకోకుండానే 150 బస్సులు విద్యార్థులను పాఠశాలలకు తీసుకెళ్లి తీసుకొస్తున్నాయి. జిల్లాలో మొత్తం 1310 స్కూలు, కళాశాలలకు చెందిన బస్సులు ఉన్నాయి. ఇవి కళాశాలల యాజమాన్యాలు ఆర్టీవో అధికారులకు ఇచ్చిన లెక్కలు మాత్రమే. ఇవికాకుండా ఆటోలు, మినీ వ్యాన్లు, చిన్న చిన్నవాహనాలు వందల కొద్దీ ఉన్నా అవి ఆర్టీఏ అధికారుల లెక్కల్లో లేవు. రవాణశాఖ అధికారుల కళ్ల ముందు ఫిట్నెస్ చేయించుకోని వాహనాలు తిరుగుతున్నా వాటి వైపు కన్నెత్తి కూడా చూసిన పాపాన పోవడంలేదు. పాఠశాలలు, కళాశాలలు ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు కేవలం 1099 బస్సులకు మాత్రమే ఫిట్నెస్ సర్టిఫికెట్లు మంజూరు చేశారు. మెదక్ సంఘటనతో జిల్లా రవాణాశాఖాధికారులు అప్పటికప్పుడు రోడ్లపైకి వచ్చారు. బస్సులను తనిఖీ చేసే కార్యక్రమాన్ని హడావుడిగా చేపట్టారు. ఐదు బస్సులపై కేసులు నమోదు చేశారు. శుక్రవారం కూడా జిల్లావ్యాప్తంగా పాఠశాలల, కళాశాలల బస్సులపై దాడులు నిర్వహించారు. జిల్లాలో ఆర్టీవో పి.కృష్ణమోహన్తో కలిసి 16 మంది రవాణాశాఖాధికారులు ఉన్నారు. ఒక్క ఒంగోలులోనే 11 మంది బ్రేక్ ఇన్స్పెక్టర్లు, అసిస్టెంట్ బ్రేక్ ఇన్స్పెక్టర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరు కాకుండా కందుకూరు, చీరాల, మార్కాపురం, దర్శి కేంద్రాలుగా బ్రేక్ ఇన్స్పెక్టర్లు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇంతమంది అధికారులు ఉన్నా స్కూలు బస్సులపై కనీస నిఘా పెట్టకపోవడంతో అక్కడక్కడా పమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల ఒంగోలులోనే మంగమూరు రోడ్డు బైపాస్ సమీపంలో ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన బస్సు ప్రమాదానికి గురైంది. టైరు పంక్చరై రోడ్డు మార్జిన్లోకి దూసుకుపోయింది. డ్రైవర్ అప్రమత్తతతో విద్యార్థులు స్వల్ప గాయాలతో బయట పడగలిగారు. అదే వెనుక నుంచి ఏదైనా వాహనం వేగంగా వచ్చి ఉంటే పెను ప్రమాదమే జరిగేది.