breaking news
trains stop
-
భారత్ బంద్ పాక్షికం
న్యూఢిల్లీ: వివాదాస్పద సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పిలుపునిచ్చిన భారత్ బంద్ శుక్రవారం పంజాబ్, హరియాణా మినహా మిగతా ప్రాంతాల్లో పాక్షికంగా విజయవంతమైంది. పంజాబ్, హరియాణాల్లో రోడ్డు, రైలు రవాణాను రైతులు అడ్డుకున్నారు. రెండు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో హైవేలను దిగ్బంధించారు. రైళ్లను అడ్డుకున్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో నిర్వహిస్తున్న రైతు ఉద్యమానికి 4 నెలలు పూర్తయిన సందర్భంగా రైతు సంఘాల ఉమ్మడి వేదిక ‘సంయుక్త కిసాన్ మోర్చా’ శుక్రవారం ఉదయం 6నుంచి సాయంత్రం 6 గంటల వరకు భారత్ బంద్కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. బంద్ కారణంగా 4శతాబ్ది ఎక్స్ప్రెస్ రైళ్లు రద్దయ్యాయని, 35 ప్యాసెంజర్ రైళ్లను, 40 గూడ్స్ రైళ్లను రైతులు అడ్డుకున్నారని రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. యూపీలోని బల్లియాలో 20 మంది సీపీఐఎంఎల్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంద్ ప్రభావం ఢిల్లీపై పెద్దగా లేదు. -
నో లైన్... నో ప్లేస్ !
వైఎస్ఆర్ జిల్లా, రాజంపేట : రేణిగుంట రైల్వే జంక్షన్, తిరుపతి రైల్వేస్టేషన్లలో రైళ్ల రద్దీ రోజురోజుకూ పెరిగిపోవడంతో ఆ రైలు గమ్యాలకు చేరిన తర్వాత వాటిని నిలపడానికి లైన్ల కొరత పీడిస్తోంది. ఫలితంగా రేణిగుంట, తిరుపతి లైన్లు ఖాళీ లేకపోవడంతో ఆ రైళ్ల ఫార్మిసిన్లను జిల్లాలోని నందలూరు, రైల్వేకోడూరు స్టేషన్లలో స్టేబుల్ చేస్తున్నారు. ఒకేసారి రెండు నుంచి మూడు రైళ్ల ఫార్మిసన్లను పెట్టుకోలేని పరిస్థితిలో వాటిని జిల్లాకు తరలిస్తున్నారు. ఇందులో ప్రధానంగా బైవీక్లీ, యాత్రస్పెషల్స్ రైళ్లతోపాటు మరికొన్ని దూర ప్రాంతరైళ్లు ఉన్నాయి. పలుచోట్ల పలురైళ్ల స్టేబుల్ జిల్లా రైలుమార్గంలో బోగీల ఫార్మిసన్ను తీసుకొచ్చి నందలూరు వరకు ఏ స్టేషన్లో లైను ఖాళీగా ఉంటే అక్కడ నిలుపుతున్నారు. ఫలితంగా ఇక్కడ రైల్వేస్టేషన్లలో అధికంగా గూడ్స్రైళ్లు వచ్చినప్పుడు లైన్ ఖాళీ లేక రైల్వే అధికారులు వాటి రాకపోకలను కొనసాగించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా జిల్లాలో రైల్వేపరంగా నందలూరు రైల్వేకేంద్రంలో యార్డులైన్లు ఉండడం వల్లన రేణిగుంట, తిరుపతిలో నిలుపుకోలేని రైళ్లను ఇక్కడి తీసుకొచ్చి పెడుతున్నారు. అయితే నిత్యం 25కిపైగా గూడ్స్రైళ్లు నందలూరులో క్రూ(డ్రైవర్లు, గార్డులు మార్పు) ప్రక్రియ ఉన్నందువల్ల వాటి తాకిడి అధికంగా ఉంటుంది. ఈ కేంద్రంలో ఇటు పలు రైళ్లు ఫార్మసిన్లు, మరోవైపు గూడ్స్రైళ్ల రద్దీతో నందలూరు రైల్వేకేంద్రంలో రద్దీ కనిపిస్తోంది. పొడిగిస్తే పోలా..! పుణ్యక్షేత్రమైన తిరుపతి, జంక్షన్ కేంద్రమైన రేణిగుంట రైల్వేకేంద్రంలో వచ్చిన రైళ్లను నిలుపుకోలేని పరిస్థితిలో వాటిని జిల్లా వరకూ పొడిగిస్తే పోలా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మచిలీపట్నం ఎక్స్ప్రెస్ రైలుతోపాటు విజయవాడ, చెన్నై, కేరళ తదితర ప్రాంతాలకు నడిచే ఎక్స్ప్రెస్ రైళ్లను రోజుల తరబడి స్టేబుల్ చేసుకునేందుకు రైల్వే యంత్రాంగం నానాకష్టాలు పడుతున్న క్రమంలో జిల్లా వైపు పొడిగింపు దిశగా నడిస్తే జిల్లాలోని రైలుమార్గంలో మరికొన్ని రైళ్ల రాకపోకలు ప్రయాణికులకు ఉపయోగకరంగా ఉంటాయని కోరుతున్నారు. గతంలో కూడా రాజధానికి తిరుపతి, రేణిగుంట మీదుగా నడిచే పలు రైళ్లకు రోజుల వ్యవధి స్టేబుల్ కావాల్సిన పరిస్థితులు ఉంటే వాటిని జిల్లా కేంద్రవరకు అయినా పొడిగించాలని ఉన్నతాధికారులకు ఈ ప్రాంతం నుంచి వినతులు వెళ్లాయి. పట్టించుకోని రైల్వే.. జిల్లాకు తిరుపతి, రేణిగుంటలో ఖాళీగా ఉన్న రైళ్లను పొడిగించాలని అనేక మార్లు రైల్వే మంత్రిత్వశాఖ నుంచి ఉన్నతాధికారుల వరకు చేసిన విన్నపాలను పట్టించుకోవడంలేదన్న విమర్శలు వెలువడుతున్నాయి. జిల్లా కేంద్రం కడప, నందలూరు నుంచి గతంలో అటు చెన్నై, తిరుపతి, అటు గుంతకల్, రాయచూరు వరకు ప్యాసింజర్ రైళ్లు నడిచేవి. ఇప్పుడు కనీసం రాష్ట్ర రాజధాని వరకు అయినా ఒక పొడిగింపు రైలును రైల్వేబోర్డు మంజూరు చేయడంలేదు. కొత్త రైళ్లు రాకపోయినా.. పొడిగింపురైళ్లను అయినా జిల్లా రైలుమార్గంలో నడిపిస్తే జిల్లావాసులకు మార్గం సుగుమం అవుతుంది. -
విద్యుత్ వైర్లు తెగిపడి.. రైళ్లకు అంతరాయం
విజయవాడ: పశ్చిమ గోదావరి జిల్లాలో మంగళవారం సాయంత్రం బలమైన ఈదురు గాలులు వీచాయి. నిడదవోలు రైల్వే స్టేషన్లో ఈదురు గాలుల ప్రభావానికి విద్యుత్ వైర్లు తెగిపడటంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్ లైన్ కు మరమ్మత్తు పనులు చేయడంతో రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. అంతకుముందు నిడదవోలు దగ్గర కోణార్క్ ఎక్స్ప్రెస్ను ఆపివేశారు. విజయవాడ, రాజమండ్రి మధ్య రైళ్ల రాకపోకలకు కాసేపు అంతరాయం కలిగింది. విజయవాడ, రాజమండ్రి మధ్య పలు రైల్వే స్టేషన్లలో రైళ్లను ఎక్కడికక్కడ ఆపివేశారు. మరమ్మత్తులు చేశాక రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. -
విద్యుత్ వైర్లు తెగిపడి.. రైళ్లకు అంతరాయం