breaking news
Train Art
-
వందే సృజన!
వందే భారత్ ఎక్స్ప్రెస్ వచ్చిన తరువాత చాలా ప్రాంతాల మధ్య దూరం తగ్గిపోయింది. కానీ టికెట్ ఖరీదు కాస్త ఎక్కువగా ఉండడంతో కొంతమంది దాని దరిదాపుల్లోకి కూడా వెళ్లడం లేదు. ఇలా వందేభారత్కు దూరంగా ఉన్న గ్రామానికి వందే భారత్ ఎక్స్ప్రెస్ను తీసుకొచ్చి అబ్బుర పరుస్తోంది పూర్ణిమా ముర్ము. అవును మీరు కరెక్ట్గానే చదివారు. మారుమూల గ్రామానికి వందే భారత్ను తీసుకొచ్చి అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది పూర్ణిమ. జార్ఖండ్లోని జంషెడ్పూర్కు పక్కనే ఉన్న ఓ గ్రామం పేరు జొండరాగోడ. ఈ గ్రామానికి చెందిన విద్యార్థే పూర్ణిమా ముర్ము. గిరిజనులు ఎక్కువ ఉండే ఈప్రాంతంలో దీపావళి సమయంలోనే సోహ్రాయ్ పండుగను ఎంతో వేడుకగా జరుపుకుంటారు. దీపావళి రెండో రోజున జరుపుకునే ఈ పండక్కి గిరిజనులంతా... తమ మట్టి ఇళ్లను శుభ్రం చేసి, రకరకాల సాంప్రదాయ డిజైన్లతో పెయింట్ వేస్తారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పూర్ణిమ తన ఇంటిని వందే భారత్ చిత్రంతో నింపేసింది. మట్టింటికి ముచ్చటగా.. గ్రామంలో ఎంతో సంతోషంగా ఆర్భాటంగా జరుపుకునే పండగను మరింత బాగా జరుపుకోవాలన్న ఉద్ధేశ్యంతో హైస్పీడ్ ట్రైన్తో ఇంటిని అలంకరించాలనుకుంది పూర్ణిమ. గ్రామవాసులు సహజసిద్ధ పదార్థాలతో తయారు చేసే రంగుల నుంచి.. తెలుపు, నీలం, నల్లరంగులు తీసుకుని ఇంటి గోడపైన వందేభారత్ రైలు బొమ్మను చక్కగా చిత్రించింది. రైలు బొమ్మ ఆకర్షణీయంగా ఉండడంతో గ్రామస్థులు పూర్ణిమ ఇంటిని చూసేందుకు ఎగబడుతున్నారు. ‘‘గ్రామంలోని చాలామందికి ‘వందేభారత్ రైలు’ ఎలా ఉంటుందో తెలియదు. దీని గురించి వినడమేగాని చూసింది లేదు. అందుకే అందరికీ వందేభారత్ను పరిచయం చేయాలన్న ఉద్దేశ్యంతో రైలు బొమ్మను చిత్రించాను. నిజానికి నేను కూడా ఇప్పటిదాకా వందేభారత్ చూసింది లేదు. ఫోన్లో వందేభారత్ బొమ్మను చూసి గీశాను. అచ్చం వందేభారత్ను పోలి ఉండడంతో నా పెయింటింగ్ గురించి తెలిసిన వారంతా చూడడానికి వస్తున్నారు. రైలు పెయింటింగ్ వేసిన తరువాత ఇంట్లో ఉన్నట్టుగా గాక, ట్రైన్లో ఉన్నట్టు ఉంది’’ అని సంతోషంగా చెబుతోంది పూర్ణిమ. వేడుకల్లో వందేభారత్ రైలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ పెయింటింగ్ను చూసిన గ్రామస్థులంతా.. ‘‘మేమయితే ఇంతవరకు ఈ రైలు ఎక్కలేదు. కనీసం ఇలాగైనా చూడగలుగుతున్నాం. వందే భారత్ను పూర్ణిమ చక్కగా వేసింది’’ అని మెచ్చుకుంటున్నారు. పిల్లలైతే కొత్త రైలు తమ ఊరు వచ్చిందని తెగ సంబరపడిపోతున్నారు. -
గ్రీన్సిగ్నల్
కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వేలైన్కు కేంద్రం ఆమోదం రూ.975కోట్లు ప్రాజెక్టు అంచనా వ్యయం కరీంనగర్ రూరల్ : కరీంనగర్ ప్రజల రైలు కళ నెరవేరనుంది. కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు రైల్వేబోర్డు ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ అర్జున్పర్వేజ్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. రూ.975 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన ఈ రైల్వే లైన్ పనులను భూసేకరణ పూర్తయిన వెంటనే ప్రారంభించనున్నట్టు లేఖలో పేర్కొన్నారు. దశాబ్దాల కల నేరవేర్చేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శరవేగంగా పావులు కదుపుతున్నాయి. షరతులు అంగీకరించాకే.. కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వే లైన్ నిర్మాణం విషయంలో కేంద్రం ప్రభుత్వం పలు షరతులు పెట్టింది. భూసేకరణకు అయ్యే వ్యయంలో మూడోవంతును రాష్ట్రం ప్రభుత్వం భరించాలని, ప్రాజెక్టు పూర్తయిన తరువాత ఐదేళ్లపాటు నిర్వహణ వ్యయాన్ని కూడా చెల్లించాలని పేర్కొంది. రాష్ట్ర సర్కారు ఈ షరతులకు అంగీకారం తెలపడంతో రైల్వే లైన్కు పచ్చజెండా ఊపింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, 2004లో తొలిసారి కరీంనగర్ నుంచి పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైన సమయంలో ప్రతిపాదించిన ఈ రైల్వేలైన్కు ప్రస్తుతం మోక్షం కలిగింది. గతంలో 2006-07 రైల్వేబడ్జెట్లో రైల్వే లైన్ నిర్మాణానికి రూ.975 కోట్లు అవసరమవుతాయని, రాష్ట్ర ప్రభుత్వం 1/3 వాటాగా భరించాలని కేంద్రం సూచించగా అప్పటి సీఎం కిరణ్కుమార్రెడ్డి ముందుకురాలేదు. దీంతో ఈ రైల్వే లైన్ నిర్మాణానికి ఆదిలోనే అడ్డంకి ఏర్పడింది. అప్పటి ఎంపీ పొన్నం ప్రభాకర్ కరీంనగర్ నుంచి హుస్నాబాద్ మీదుగా సికింద్రాబాద్ వరకు రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రతిపాదించారు. ఇటీవలి ఎన్నికల్లో పొన్నం స్థానంలో ఎంపీగా గెలిచిన వినోద్కుమార్ పాత ప్రతిపాదన వల్ల జిల్లాకు ప్రయోజనం లేదని పేర్కొంటూ కొత్తపల్లి-మనోహరాబాద్ లైన్ నిర్మాణ ప్రతిపాదనలను పంపారు. అందుకయ్యే భూసేకరణ ఖర్చులో మూడోవంతు, ఐదేళ్లపాటు నిర్వహణ వ్యయాన్ని భరించేందుకు రాష్ట్రం ముందుకు రావడంతో కేంద్రం ఆమోదం లభించింది. కేసీఆర్, కేటీఆర్, హరీష్రావు నియోజకవర్గాల మీదుగా... ముఖ్యమంత్రి కేసీఆర్, పంచాయతీరాజ్శాఖ మంత్రి కేటీఆర్, నీటిపారుదల శాఖమంత్రి హరీష్రావు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాలు కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వే లైన్ పరిధిలోకి వస్తాయి. ఈ రైలు మార్గం పూర్తై కరీంనగర్ నుంచి హైదరాబాద్కు 24 కిలోమీటర్ల దూరం తగ్గడంతోపాటు సమయం కూడా ఆదా అవుతుంది. ప్రస్తుతం హైదరాబాద్-ఢిల్లీ వెళ్లే రైళ్లు భువనగిరి, వరంగల్, కాజీపేట, జమ్మికుంట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల మీదుగా నడస్తున్నాయి. కొత్త రైలు మార్గం వస్తే మనోహరాబాద్, సిద్దిపేట, సిరిసిల్ల, వేములవాడ, కొత్తపల్లి, పెద్దపల్లి మీదుగా రామగుండం ద్వారా ఢిల్లీకి వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ప్రయాణికులకు వ్యయప్రయాసాలు తగ్గి ఎంతోమేలు జరుగుతుంది. రెట్టింపుకానున్నఅంచనా వ్యయం 2006-07 రైల్వే బడ్జెట్లో ఈ రైల్వేలైన్ నిర్మాణానికి రూ.975 కోట్ల ఖర్చవుతాయని అంచనా వేశారు. పదేళ్ల తరువాత ఆమోదం లభించడం, అందులోనూ రూట్మ్యాప్లో భారీ మార్పులు జరగడంతో వ్యయం రూ.1800 కోట్లకు చేరే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. భూసేకరణ, పరిహారం చెల్లించడానికే ప్రాజెక్టు వ్యయంలో మూడోవంతు ఖర్చవుతుందని పేర్కొంటున్నారు.