breaking news
tlm
-
ఇంటింటా చదువుల ‘క్రాంతి
గజ్వేల్/ములుగు: కరోనా నేపథ్యంలో ఆన్లైన్ క్లాసులు వినలేని విద్యార్థులకు ఓ ఉపాధ్యాయురాలు ఇంటింటికీ వెళ్లి పాఠాలు బోధిస్తున్నారు. జాయ్ఫుల్ లెర్నింగ్, యాక్టివిటీ బేస్డ్, లో–కాస్ట్, నో–కాస్ట్ టీఎల్ఎమ్ పద్ధతుల్లో విద్యాబోధన చేస్తున్నారు. ‘పాఠశాలే నాకు లోకం. నిత్యం పిల్లలతో విద్యాబోధనలో గడపటమే నాకు ఇష్టం. అందుకే సెలవున్నా...పాఠశాలకు రావడం మర్చిపోను’అంటున్న ఆ ఉపాధ్యాయురాలు సిద్దిపేట జిల్లా ములుగు మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఎం.క్రాంతికుమారి. 130 మంది విద్యార్థులున్న ఆ పాఠశాలకు తొమ్మిదేళ్ల క్రితం వచ్చిన క్రాంతికుమారి మొదట్నుంచీ తన పనితీరుతో ఇతర ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. లాక్డౌన్ మినహా మిగతా అన్ని రోజుల్లో యథాతథంగా విధులు నిర్వహించారు. ప్రస్తుతం తను బోధించే ఐదో తరగతిలోని 35 మంది విద్యార్థుల్లో సగం మందికిపైగా స్మార్ట్ ఫోన్లు లేకపోవడంతో ఆమె వారి ఇంటికి వెళ్లి పాఠాలు చెప్తున్నారు. గతేడాది సెప్టెంబర్లో పాఠశాలను సందర్శించిన కలెక్టర్ వెంకట్రామిరెడ్డి పాఠశాలలో మెరుగైన వసతుల కల్పనకు రూ.5 లక్షల చెక్కును క్రాంతికుమారికి అందజేశారు. ఈ నిధులతో పాఠశాల కార్పొరేట్ సొబగులను అద్దుకుంది. -
బట్టీ చదువులకు స్వస్తి..
-బోధనోపకరణాలతో సత్ఫలితాలు – విద్యార్థుల్లో నూతనోత్సాహం భీమడోలు:బట్టీ చదువులకు స్వస్తి పలికి బోధనోపకరణాలను వినియోగం ద్వారా వచ్చే జ్ఞాపకశక్తి జ్ఞాప్తిలో ఉంటుంది. బోధనోపకరణాల ద్వారా విద్యాబోధన సత్ఫలితాలిస్తోంది. విద్యార్థులను హత్తుకొనే విధంగా ఉపాధ్యాయులు బోధనోపకరణాలతో బోధిస్తేపాఠశాలలు సృజనాత్మకత కేంద్రాలుగా మారుతాయి. నో కాస్ట్, లో కాస్ట్ నినాదంతో ఉపాధ్యాయులు పాఠ్యాంశాలు సులభంగా అర్థమయ్యే రీతిలో చార్టులు, నమూనాలు, ప్రదర్శనలు, తోరణాల చూపడం వల్ల చిన్నారులను హృదయాలను కట్టి పడేస్తాయి. దీనితో బీ,సీ గ్రేడు గల విద్యార్థులు డ్రాపవుట్స్ కాకుండా నిరంతరం పాఠశాలో చదువుకునే ఉత్సాహం అందుతోంది. ఇక పాఠశాలకు డుమ్మాకొట్టేవారే ఉండరు. ఇటీవల జిల్లా వ్యాప్తంగా విద్యామేళాను నిర్వహించారు. అందులో ఉపాధ్యాయులు ప్రదర్శించిన బోధనోపకరణాల ద్వారా విద్యాబోధన విద్యార్థుల్లో నృజనాత్మకతను పెంపొందిస్తుంది. క్లిష్టమైన గణితం, సామాన్యశాస్త్రాలు, ఇంగ్లీషు సబ్జెక్టుల్లో విద్యార్థులు పట్టు సాధించేందుకు ఈ మేళా దోహద పడుతుంది. జిల్లా విద్యాశాఖ ఈ ఏడాది అక్టోబర్లో మండల స్థాయిలో ఏర్పాటు చేసిన విద్యామేళాలు సర్కార్ బడుల్లో నాణ్యమైన విద్యాబోధన మరింత మెరుగుపడుతుంది. కొంత కాలంగా స్తబ్ధతగా ఉన్నా ఈ విధానానికి జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఊపందుకుంది. దీనితో విద్యాశాఖ, సర్వశిక్షాభియాన్ అధికారులు చర్యలు చేపట్టడంతో ఉపాధ్యాయులు సైతం ఆ తరహాలోనే స్పందించి నమూనాలు రూపొందించడంతో పాఠశాలల్లో ఆసక్తిదాయకమైన విద్యాబోధన కొనసాగుతుంది. చార్టులు, గోడ పత్రికల ద్వారా పలు అంశాలను విద్యార్థులు ఉపాధ్యాయులు బో«ధిస్తున్నారు. తరగతి గదుల్లో కఠినమైన గణితం, పదాలు, వాక్యాలు, అక్షర తోరణాలను గోడలకు అతికించడం ద్వారా విద్యార్థులకు ప్రధానాంశాల వారీగా అంశాలు వివరిస్తున్నారు. బట్టీ విధానానికి స్వస్తి పలికే క్రమంలో అందుబాటులోని పలు వస్తువుల ద్వారా ఆకృత్తులను రూపొందించి విద్యార్థులు మరింత అర్థమయ్యే విధంగా కళ్లముందుగా వాటి అర్థాలు చెబుతున్నారు. కృత్యాలను రూపొందించడం ద్వారా విద్యార్థుల్లో పోటీ తత్వం పెంపొందుతుంది. ఈ ప్రయోగాత్మకంగా ఉపాధ్యాయులు విద్యార్థులకు అంశాలను బోధిస్తే శాశ్మతకాలం గుర్తుండిపోతాయి. అక్టోబర్లో మండల స్థాయిలో జరిగిన బోధనోపకరణాల మేళలో ఉత్తమ బోధన ఉపకరణాలను రూపొందించిన ఉపాధ్యాయులను గుర్తించి వారిని ప్రోత్సహిస్తే మరింత ప్రయోజనం చేకూరుతుందని ఉపాధ్యాయ లోకమంటుంది. ఆ ఉపాధ్యాయులకు ప్రశంసా పత్రాలతో పాటు ఆ ఉపకరణాలను జిల్లా స్థాయిలో ప్రదర్శించే వి«ధంగా ఉన్నతాధికారులు చర్యలు చేపడితే వారికి మరింత ఆదర్శంగా తీర్చిదిద్దవచ్చునంటుంన్నారు. సులభంగా అÆర్థమవుతోంది.. ఉపకరణాల ద్వారా విద్యాబోధన చేయడం వల్ల సులభంగా అర్థమవుతుంది. తద్వారా సమయం వృథా కాదు. పట్టును సా«ధిస్తారు చింతాడ శిరీషా, 3వ తరగతి, నెం.3, పోలసానిపల్లి చిరకాలం గుర్తుంటాయి విద్యార్థుల్లో నైపుణ్యాలను సాధించుకోవడానికి ఈ తరహా బోధన దోహద పడుతుంది. బోధనోపకరణాల బోధన ద్వారా సంజ్ఞలు చిరకాలంగా నిలిచి ఉండిపోతాయి. ఈ విధానం వల్ల విద్యార్థులకు మేలు జరుగుతుంది. సబ్జెక్టులపై పూర్తి పట్టును సాధిస్తారు. 05కె.శ్యామలా, నెం.3, టీచర్, పోలసానిపల్లి జిల్లా పాఠశాలల్లో విద్యార్థుల వివరాలు పాఠశాలల సంఖ్య విద్యార్థులు ఉన్నత 447 66797 ప్రాధమికోన్నత 274 1,00,545 ప్రాధమిక 2546 1,44,376 -
గురువుల సామర్థ్యాల ప్రదర్శన
ఏలూరు సిటీ : జిల్లా వ్యాప్తంగా టీచర్ లెర్నింగ్ మెటీరియల్ (టీఎల్ఎం) ప్రదర్శనను జిల్లావిద్యాశాఖ శుక్రవారం చేపట్టింది. అన్ని మండల కేంద్రాల్లో టీఎల్ఎం ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఆయా మండలాల పరిధిలోని జెడ్పీ, మండలపరిషత్, ప్రభుత్వ, మునిసిపల్, ఎయిడెడ్ విద్యాసంస్థల్లో పనిచేసే ఉపాధ్యాయులంతా తాము బోధించే పాఠ్యాంశాలకు సంబంధించి టీఎల్ఎంలను తయారు చేసి ఈ ప్రదర్శనల్లో ఉంచారు. ఏలూరు మండలానికి సంబంధించి అర్భన్ స్కూల్స్కు స్థానిక ఎన్ఆర్పేటలోని సెయింట్ థెరిస్సా బాలికోన్నత పాఠశాల, రూరల్ స్కూల్స్ సత్రంపాడు, శనివారపుపేట జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఏలూరు ఉప విద్యాధికారి డి.ఉదయ్కుమార్ టీఎల్ఎం ప్రదర్శనలను పర్యవేక్షించగా, జిల్లా విద్యాధికారి జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించి టీఎల్ఎం ప్రదర్శనలు పరిశీలించారు. విద్యార్థికి అర్థమయ్యేలా వినూత్నమైన అంశాలతో ప్రాజెక్టులు తయారు చేయాలని అధికారులు ఉపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేశారు. కానీ ఈ టీఎల్ఎం ప్రదర్శనల్లో వినూత్నమైన ప్రాజెక్టుల జాడ కన్పించలేదు. ఇటీవల కాలంలో ప్రభుత్వ ఆన్లైన్ విధానాన్ని అమలు చేస్తూ ఉపాధ్యాయులపై పనిభారాన్ని విపరీతంగా పెంచేయటంతో టీచర్లపై ఒత్తిడి పెరగడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది.