breaking news
Terra Motors
-
8 నిమిషాల చార్జింగ్తో 200 కిలోమీటర్లు
న్యూఢిల్లీ: ‘టెర్రా హెచ్పీ ఫాస్ట్ చార్జింగ్ సిస్టమ్’ను ఏబీబీ భారత మార్కెట్ కోసం ఆవిష్కరించింది. ఇందుకు ప్రపంచ రవాణా సదస్సు వేదికగా నిలిచింది. కేవలం 8 నిమిషాల చార్జింగ్తో ఓ కారు 200 కిలోమీటర్లు ప్రయాణించడం ఈ వ్యవస్థ ప్రత్యేకత అని కంపెనీ తెలిపింది. రవాణా వ్యవస్థను ఎలక్ట్రిక్ ఆధారితంగా మార్చే విషయంలో భారత ప్రభుత్వ ఆకాంక్షలు, చర్యల్ని ఏబీబీ సీఈవో ఉల్రిచ్ స్పీసోఫర్ ప్రశంసించారు. మూవ్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా మాట్లాడుతూ... భారత్లో ఎలక్ట్రిక్ రవాణాకు ఏబీబీ తన టెక్నాలజీలతో సాయం అందించేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. ‘‘కొన్ని నెలల క్రితం జర్మనీలో జరిగిన హానోవర్ ఇండస్ట్రీ ఫెయిర్లో నూతన టెర్రా హైపవర్ ఈవీ చార్జర్ను ఏబీబీ ఆవిష్కరించింది. ఇది ఎనిమిది నిమిషాల చార్జింగ్తో ఓ కారును 200 కిలోమీటర్ల మేర ప్రయాణించేలా చేయగలదు. ఈ తరహా ఫాస్ట్ చార్జర్ను ఈ కార్యక్రమానికి తీసుకురావడం జరిగిందని’’ స్పీసోఫర్ తెలిపారు. ఎలక్ట్రిక్ బస్సుల రవాణాకు సంబంధించిన టెక్నాలజీలో లీడర్గా ఉన్నామని, టోసా సిస్టమ్ కేవలం 20 సెకండ్ల బరస్ట్తో ఓ బస్సు రోజంతా నడిచేలా చేయగలదన్నారు. -
కంపెనీల ఎలక్ట్రిక్ సవారీ!
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో పలు కంపెనీలు, స్టార్టప్ సంస్థలు రంగంలోకి దిగుతున్నాయి. జపాన్, తైవాన్ తదితర దేశాలతో పాటు దేశీ సంస్థలూ ఈ లిస్టులో ఉన్నాయి. కొత్త ద్విచక్ర, త్రిచక్ర ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టడంపై ఇవి మరింతగా దృష్టి సారిస్తున్నాయి. నేషనల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మిషన్ ప్రణాళిక ప్రకారం 2020 నాటికి 60 లక్షల నుంచి 70 లక్షల దాకా హైబ్రీడ్, ఎలక్ట్రిక్ వాహనాల్ని తేవాలని కేంద్రం లకి‡్ష్యంచింది. కానీ ఎలక్ట్రిక్ వాహనాల విధానాలు మారిపోతుండటం, వాహనాల చార్జింగ్ కోసం ఉద్దేశించిన మౌలిక సదుపాయాలు అందుబాటులో లేకపోవడం మొదలైనవి ఈ భారీ లక్ష్యాన్ని సాధించడంలో పెద్ద అవరోధాలుగా మారాయి. దీంతో దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలు హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్ మొదలైనవి వేచి చూసే ధోరణిలో ఉన్నాయి. అయితే, కొత్తగా ఈ విభాగంలోకి ప్రవేశించాలనుకుంటున్న కంపెనీలు ఈ అవరోధాలను పెద్దగా పట్టించుకోవడం లేదు. భారత్లో 2014 నుంచి ఈ–రిక్షాలు విక్రయిస్తున్న జపాన్కి చెందిన టెరా మోటార్స్ ప్రస్తుతం ఎలక్ట్రిక్ ఆటో రిక్షాను తేవాలని యోచిస్తోంది. వచ్చే జనవరికల్లా దీన్ని ఆవిష్కరించాలని, ఏటా 5 లక్షల అమ్మకాలు సాధించాలని నిర్దేశించుకుంది. ఆటోమొబైల్ మార్కెట్ పరిమాణం భారీగా ఉండే భారత్, ఇతరత్రా దక్షిణాసియా దేశాల్లో ఎలక్ట్రిక్ వాహనాలకు గణనీయంగా డిమాండ్ ఉంటుందని టెరా మోటార్స్ భావిస్తోంది. అందుకే దక్షిణాసియా దేశాల మార్కెట్లలోకి కూడా విస్తరించేందుకు వీలుగా భారత్లో కార్యాలయం ఏర్పాటు చేసింది. వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు, ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు తమను ఆకర్షించాయని కంపెనీ వర్గాలు తెలిపాయి. జనవరి నాటికి ఈ–ఆటో రిక్షాను ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొన్నాయి. లిథియం అయాన్ బ్యాటరీలతో నడిచే వీటి గరిష్ట వేగం గంటకు 50–60 కి.మీ. దాకా ఉంటుంది. ఆటో రిక్షాలను ఆవిష్కరించడానికి ముందుగానే, చార్జింగ్కి సంబంధించిన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని టెరా యోచిస్తోంది. ఇందుకోసం భారత రవాణా శాఖతో లాబీయింగ్ చేసేందుకు జపాన్ సహకారాన్ని తీసుకుంటోంది. టెరా మోటార్స్ దేశీయంగా 2014లో అమ్మకాలు మొదలుపెట్టినప్పట్నుంచి 12,000 యూనిట్లు విక్రయించింది. ప్రస్తుతం అసోం, బెంగాల్, బీహార్లో ఈ–రిక్షాలు విక్రయిస్తున్న కంపెనీ.. తాజాగా ఉత్తరాది మార్కెట్లపైనా దృష్టి పెట్టింది. ఈ–రిక్షాల మార్కెట్ పరిమాణం ఏటా 80,000 యూనిట్లకు మాత్రమే పరిమితమైందని, అందుకే ఎలక్ట్రిక్ ఆటో రిక్షాల మార్కెట్ వైపు దృష్టి సారిస్తున్నామని టెరా మోటార్స్ ఎండీ అకిహిరో తెలిపారు. ఆర్టెమ్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఇక ఆర్టెమ్ ఎనర్జీ ఫ్యూచర్ అనే దేశీ ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ సంస్థ కూడా ఆర్టెమ్ ఎం9 పేరిట ఈ–స్కూటర్ను ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. లగ్జరీ కార్లలో ఉండే అత్యంత సురక్షితమైన, అత్యాధునిక ఫీచర్స్ ఇందులో ఉంటాయని చెబుతోంది. భద్రత, టెక్నాలజీలే తమ ప్రధాన బలమని అంటోంది. చార్జింగ్ కోసం ఆన్బోర్డ్ ఫాస్ట్ చార్జర్ను అమర్చడంతో పాటు బ్యాటరీల మార్పిడి వెసులుబాటు కూడా ఎం9లో అందిస్తామని ఆర్టెమ్ వెల్లడించింది. వంద కిలోమీటర్ల దాకా ప్రయాణించగలిగే సామర్ధ్యం ఉండేలా దీన్ని తీర్చిదిద్దుతున్నామని పేర్కొంది. తైవాన్ కంపెనీల ఆసక్తి.. దేశీ ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలోకి ప్రవేశించడానికి ఆగ్నేయాసియా దేశాల కంపెనీలు ఆసక్తిగా ఉన్నాయి. ఈవీలకు సంబంధించిన సాంకేతికాంశాలు, టెక్నాలజీపై పరస్పరం సహకరించుకునే దిశగా.. గత నెలలోనే సొసైటీ ఆఫ్ మ్యాన్యుఫాక్చరర్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ .. తైవాన్ ఎక్స్టర్నల్ ట్రేడ్ డెవలప్మెంట్ కౌన్సిల్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఎలక్ట్రిక్ వాహనాలు, విడిభాగాలు తయారు చేసే 11 తైవాన్ కంపెనీలు ఈ నెలలో భారత్ సందర్శించనున్నాయి. -
కివామి ఎలక్ట్రిక్ సూపర్ బైక్ వస్తోంది..
న్యూఢిల్లీ: భారత టూవీలర్ల మార్కెట్లోకి జపాన్కు చెందిన టెర్రా మోటార్స్ ప్రవేశిస్తోంది. ఈ కంపెనీ ఎలక్ట్రిక్ టూ, త్రీ వీలర్లు తయారు చేస్తోంది. రూ. 18 లక్షల ఖరీదుండే కివామి ఎలక్ట్రిక్ సూపర్ బైక్ను త్వరలో అందిస్తామని టెర్రా మోటార్స్ సీఈవో, ఫౌండర్ తొరు టొకుషిగె చెప్పారు. 1,000 సీసీ ఇంజిన్ సామర్థ్యం ఉన్న ఈ కివామి బైక్ భారత్లోనే తొలి ఎలక్ట్రిక్ సూపర్ బైక్ అని, ఈ బైక్ను జపాన్లో పూర్తిగా చేతితోనే తయారు చేయించామని తెలిపారు. భవిష్యత్తులో ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రిక్ స్కూటర్లను కూడా అందిస్తామని ఆయన వివరించారు. వచ్చే నెలలో జరిగే ఆటో ఎక్స్పోలో ఈ సూపర్ బైక్ను, ఈ-స్కూటర్లు, ఎలక్ట్రిక్ త్రీ వీలర్లను ప్రదర్శించనున్నామని టొకుషిగె వెల్లడించారు. కివామి ప్రత్యేకతలు ఇవీ... 1,000 సీసీ బైక్, గరిష్ట వేగం గంటకు 160 కిమీ. ఈ బైక్ను ఒక్కసారి చార్జింగ్ చేయడానికి ఆరు గంటలు పడుతుంది. ఒక్కసారి చార్జింగ్ చేస్తే 200 కిమీ దూరం ప్రయాణించగలదు. ఇంత అధిక దూరం భారత్ మార్కెట్లో ఉన్న ఏ ఇతర ఎలక్ట్రిక్ బైక్ ప్రయాణించలేదని టొకుషిగె వివరించారు.