breaking news
Tere Ishk Mein Movie
-
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 28 సినిమాలు
మరోవారం వచ్చేసింది. సంక్రాంతి రిలీజైన తెలుగు సినిమాల్లో చిరంజీవి, నవీన్ పొలిశెట్టి, శర్వానంద్ చిత్రాలు.. ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయి. దీంతో ఎప్పటిలానే ఈ వారం కొత్త రిలీజులు ఏం లేవు. 'ఓం శాంతి శాంతి శాంతిః' అనే తెలుగు మూవీని 23వ తేదీన రిలీజ్ చేస్తామని చాన్నాళ్ల క్రితం ప్రకటించారు గానీ ప్రమోషన్స్ చేయట్లేదు. దీంతో వాయిదా కన్ఫర్మ్ అనిపిస్తుంది. మరోవైపు 'బోర్డర్ 2' అనే హిందీ చిత్రం ఇదే వీకెండ్ థియేటర్లలోకి రానుంది.(ఇదీ చదవండి: హ్యాట్రిక్ ఫ్లాప్స్ తర్వాత మెగా హీరో హారర్ మూవీ.. గ్లింప్స్ రిలీజ్)ఓటీటీల్లో అయితే 28 వరకు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్లు ఈ వారం స్ట్రీమింగ్ కానున్నాయి. శోభిత ధూళిపాళ్ల 'చీకటిలో' మూవీ ఆసక్తికరంగా అనిపిస్తోంది. దీంతో పాటు తేరే ఇష్క్ మైన్, మార్క్ అనే డబ్బింగ్ చిత్రాలు.. 45, సిరాయ్ అనే పరభాష సినిమాలు ఉన్నంతలో ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఇంతకీ ఏ మూవీ ఏ ఓటీటీలోకి రానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (జనవరి 19 నుంచి 25 వరకు)అమెజాన్ ప్రైమ్ప్రిపరేషన్ ఫర్ ద నెక్స్ట్ లైఫ్ (ఇంగ్లీష్ మూవీ) - జనవరి 19స్టీల్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 21చీకటిలో (తెలుగు సినిమా) - జనవరి 23ఇట్స్ నాట్ లైక్ దట్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 25నెట్ఫ్లిక్స్సండోకన్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 19జస్ట్ ఏ డ్యాష్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 20రిజోలి & ఐల్స్ సీజన్ 1-7 (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 20సింగిల్స్ ఇన్ఫెర్నో సీజన్ 5 (కొరియన్ సిరీస్) - జనవరి 20స్టార్ సెర్చ్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 20కిడ్నాపెడ్: ఎలిజిబెత్ స్మార్ట్ (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 21క్వీర్ ఐ సీజన్ 10 (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 21కాస్మిక్ ప్రిన్సెస్ కగుయా (జపనీస్ సినిమా) - జనవరి 22ఫైండింగ్ హెర్ ఎడ్జ్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 22ఫ్రీ బెర్ట్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 22స్కై స్క్రాపర్ లైవ్ (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 23తేరే ఇష్క్ మైన్ (తెలుగు డబ్బింగ్ చిత్రం) - జనవరి 23ద బిగ్ ఫేక్ (ఇటాలియన్ సినిమా) - జనవరి 23హాట్స్టార్ఏ నైట్ ఆఫ్ ద సెవెన్ కింగ్డమ్స్ సీజన్ 1 ఎపిసోడ్ 1 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జనవరి 19హిమ్ (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 19మార్క్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - జనవరి 23స్పేస్ జెన్: చంద్రయాన్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 23ఆహాసల్లియర్గళ్ (తమిళ మూవీ) - జనవరి 20శంబాల (తెలుగు సినిమా) - జనవరి 22జీ545 (కన్నడ సినిమా) - జనవరి 23మస్తీ 4 (హిందీ మూవీ) - జనవరి 23సిరాయ్ (తమిళ సినిమా) - జనవరి 23కాళీపోట్కా (బెంగాలీ సిరీస్) - జనవరి 23ఆపిల్ టీవీ ప్లస్డ్రాప్ ఆఫ్ గాడ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 21ముబీలా గ్రేజియా (ఇటాలియన్ మూవీ) - జనవరి 23(ఇదీ చదవండి: నా మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు: ఏఆర్ రెహమాన్) -
ధనుష్ సినిమాపై రూ. 84 కోట్ల నష్టపరిహారం..
కోలీవుడ్ నటుడు ధనుష్, బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ జంటగా నటించిన రొమాంటిక్ డ్రామా మూవీ ‘తేరే ఇష్క్ మే’ వివాదంలో చిక్కుకుంది. తెలుగులో 'అమర కావ్యం' పేరుతో ఈ మూవీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. నవంబర్ 28న మొదట హిందీలో థియేటర్స్లోకి వచ్చిన ఈ చిత్రంపై ఈరోస్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ముంబై కోర్టును ఆశ్రయించింది. ఈ మూవీ దర్శకుడు, నిర్మాత ఆనంద్ ఎల్. రాయ్పై నష్టపరిహారం కోసం కోర్టు మెట్లు ఎక్కిందని బాలీవుడ్లో కథనాలు వస్తున్నాయి.‘తేరే ఇష్క్ మే’ విడుదల సమయంలో 'రాంఝణా' చిత్రానికి సీక్వెల్ అని ప్రచారం చేశారు. ఇదే వారికి చిక్కులు తెచ్చింది. ధనుష్, దర్శకుడు ఆనంద్ ఎల్. రాయ్ కాంబినేషన్లో 'రాంఝణా' (Raanjhanaa) చిత్రాన్ని 2013లో తెరకెక్కించారు. రూ. 35 కోట్ల బడ్జెట్తో ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ఈ మూవీని నిర్మించింది. బాక్సాఫీస్ వద్ద రూ. 105 కోట్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. దీంతో ఈ చిత్ర యూనిట్కు మంచి ఇమేజ్ వచ్చింది. ఈ చిత్రానికి సీక్వెల్ అంటూ తేరే ఇష్క్ మే చిత్రాన్ని మేకర్స్ పబ్లిసిటీ చేసుకున్నారు. దీనిని ఈరోస్ సంస్థ తప్పుబట్టింది. తమ ప్రమేయం లేకుండా సీక్వెల్ అని ఎలా ప్రకటిస్తారంటూ ముంబై కోర్టును ఆశ్రయించింది. 'రాంఝణా' సినిమాకు సీక్వెల్ అని చెప్పుకుని భారీగా లాభపడ్డారని ఆ సంస్థ పేర్కొంది. ఆనంద్ ఎల్. రాయ్ చర్యల వల్ల తమ సినిమా ఇమేజ్ దెబ్బతిందని, అందుకు గాను రూ. 84 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని ఈరోస్ కోరింది. 'రాంఝణా' సినిమాకు ఆనంద్ ఎల్. రాయ్ కేవలం దర్శకుడు మాత్రమేనని ఆ మూవీకి సంబంధించిన పూర్తి హక్కులు తమ వద్దే ఉన్నాయని ఈరోస్ చెప్పింది. తమ ప్రమేయం లేకుండా 'రాంఝణా' చిత్రానికి సీక్వెల్ అంటూ ‘తేరే ఇష్క్ మే’ చిత్రాన్ని ప్రమోట్ చేసుకున్నారని ఆ సంస్థ ఆరోపించింది. మరీ ముఖ్యంగా, తేరే ఇష్క్ మే టీజర్లో 'ఫ్రమ్ ది వరల్డ్ ఆఫ్ రాంఝణా, #వరల్డ్ ఆఫ్ రాంఝనా' వంటి హ్యాష్ ట్యాగ్లు ఉపయోగించబడ్డాయని ఈరోస్ హైలైట్ చేసింది. ప్రస్తుతానికి, తేరే ఇష్క్ మే నిర్మాతలు స్పందించలేదు. -
ఓటీటీలో 'ధనుష్' హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ప్రకటన
కోలీవుడ్ నటుడు ధనుష్, బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ జంటగా నటించిన రొమాంటిక్ డ్రామా మూవీ ‘తేరే ఇష్క్ మే’.. తెలుగులో 'అమర కావ్యం' పేరుతో విడుదలైంది. అయితే, నవంబర్ 28న మొదట హిందీలో రిలీజ్ అయింది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఇప్పటికే రూ. 150 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది. థియేటర్ రన్ ముగిసిని తర్వాత ఈ మూవీ ఓటీటీ బాట పట్టింది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు. ‘రాంఝాణా, అత్రంగి రే’ చిత్రాల తర్వాత ధనుష్, దర్శకుడు ఆనంద్. ఎల్. రాయ్ కాంబినేషన్లో ఈ చిత్రం తెరకెక్కింది. హిందీలో సూపర్హిట్ టాక్ తెచ్చకున్న ఈ మూవీ టాలీవుడ్ ప్రేక్షకులను కూడా మెప్పించింది.ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం ఈ మూవీకి ప్రధాన ఆకర్షణగా నిలిచింది.రొమాంటిక్ డ్రామా కథతో తెరకెక్కిన ‘తేరే ఇష్క్ మే’ (అమర కావ్యం) మూవీ ‘నెట్ఫ్లిక్స్’ (Netflix)లో ఈ నెల 23న విడుదల కానుంది. హిందీతో పాటు తమిళం, తెలుగు భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాలో శంకర్ పాత్రలో ధనుష్ బాగా నటించారు. తన కోపం కారణంగా ఎప్పుడూ కాలేజ్లో గొడవలు పడుతూ ఉంటాడు. అయితే, కాలేజీ రోజుల్లోనే సాహీ (కృతి సనన్)తో ప్రేమలో పడుతాడు. అయితే, తన కోపం కారణంగా నిజాయితీగా ప్రేమించినప్పటికీ తన ప్రియురాలిని కోల్పోవాల్సి వస్తుంది. దీంతో అతను ఏం చేశాడు..? సాహీ జీవితంపై శంకర్ ప్రభావం ఎలా చూపింది..? ఫైనల్గా ఈ జోడీ కలిసిందా..? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. -
నాలాంటోడి ప్రేమలో పడితే ఊరి మొత్తాన్ని తగలబెట్టేస్తా..
కోలీవుడ్ నటుడు ధనుష్, బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ జంటగా నటించిన రొమాంటిక్ డ్రామా మూవీ ‘తేరే ఇష్క్ మే’.. తెలుగులో అమర కావ్యం పేరుతో తాజాగా విడుదల అయితే.. నవంబర్ 28న హిందీలో రిలీజ్ అయింది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఇప్పటికే రూ. 100 కోట్ల కలెక్షన్స్తో దూసుకుపోతుంది. ‘రాంఝాణా, అత్రంగి రే’ చిత్రాల తర్వాత ధనుష్, దర్శకుడు ఆనంద్. ఎల్. రాయ్ కాంబినేషన్లో ఈ చిత్రం తెరకెక్కింది. హిందీలో సూపర్హిట్ టాక్ తెచ్చకున్న ఈ మూవీ టాలీవుడ్లో కూడా విడుదల కానుంది. ఈ క్రమంలోనే తెలుగు ట్రైలర్ను రిలీజ్ చేశారు. ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం ఈ మూవీకి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. -
ధనుశ్ బాలీవుడ్ మూవీ.. ఆసక్తిగా తెలుగు టైటిల్!
కోలీవుడ్ హీరో ధనుశ్ బాలీవుడ్లో నటిస్తోన్న రొమాంటిక్ లవ్ స్టోరీ తేరే ఇష్క్ మే(Tere Ishq Mein Movie). ఈ మూవీకి ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వం వహిస్తున్నారు. 2023లోనే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించినప్పటికీ కొన్ని కారాణాల వల్ల వాయిదా పడుతూనే వచ్చింది. ఎట్టకేలకు ఈ ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. ఇటీవలే ఈ మూవీ ట్రైలర్ను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ మూవీలో ఆదిపురుష్ భామ కృతి సనన్ హీరోయిన్గా కనిపించనుంది. తాజాగా ఈ మూవీ తెలుగు టైటిల్ను ఖరారు చేశారు. టాలీవుడ్లో అమరకావ్యం అనే పేరుతో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 28న హిందీ, తమిళం, తెలుగు భాషల్లో థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీని టీ సిరీస్ బ్యానర్లో ఆనంద్ ఎల్ రాయ్, హిమాన్షు శర్మ, భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్ నిర్మించారు.A love story etched into history ❤️🔥#TereIshqMein arrives in Telugu as #AmaraKavyam ❤️🔥In cinemas 28th November ✊🏾@dhanushkraja @kritisanon @arrahman @aanandlrai #BhushanKumar #HimanshuSharma #KrishanKumar @Irshad_kamil @neerajyadav911 @ShivChanana @NeerajKalyan_24 @TSeries… pic.twitter.com/AeTgFO1omf— Vamsi Kaka (@vamsikaka) November 23, 2025 -
ఆయనతో నటిస్తూ ఎంజాయ్ చేశా: కృతి సనన్
కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ అనే తారతమ్యం లేకుండా నటిస్తూ పాన్ ఇండియా కథానాయకుడిగా రాణిస్తున్న నటుడు ధనుష్. అదేవిధంగా నటుడిగా, కథకుడిగా, గాయకుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా సత్తా చాటుతున్న ఈయన ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. అలా ధనుష్ నటిస్తున్న తాజా చిత్రాల్లో తేరే ఇష్క్ మే(Tere Ishk Mein) హిందీ చిత్రం ఒకటి. కృతిసనన్(Kriti Sanon) నాయకిగా నటించిన ఈ చిత్రానికి ఏఆర్.రెహా్మన్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్ర ఆడియో ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లి గుడ్ టాక్ను క్రియేట్ చేసింది. తేరే ఇష్క్ మే చిత్రం ఈనెల 28న హిందీ, తమిళం తెలుగు భాషల్లో విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా కృతి సనన్(Kriti Sanon) ధనుష్ సరసన నటించిన అనుభవాన్ని పంచుకున్నారు. ఆమె మాట్లాడుతూ ధనుష్ ఒక అసాధారణ నటుడని అన్నారు. పలు చిత్రాలకు దర్శకత్వం వహించిన అనుభవం కలిగిన నటుడని అన్నారు. ఆయనతో నటించడానికి చాలా ఎగ్జైటెడ్ ఫీలయ్యానని, ధనుష్ నుంచి చాలా నేర్చుకున్నానన్నారు. ఆయనతో కలిసి నటించడాన్ని చాలా ఎంజాయ్ చేశానని అన్నారు. తమ మధ్య కెమిస్ట్రీ వర్కవుట్ అయ్యిందన్నారు. తామిద్దరం చాలా చిత్రాల్లో నటించాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ చిత్రానికి ఆనంద్ ఎల్.రాయ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని టి.సిరీస్కు చెందిన గుల్షన్కుమార్, కలర్ ఎల్లో సంస్థ సమర్పణలో ఆనంద్ ఎల్.రాయ్, హిమాన్షూశర్మ, భూషన్కుమార్, కృష్ణకుమార్ కలిసి నిర్మించారు. -
ధనుశ్ బాలీవుడ్ మూవీ.. అఫీషియల్ ట్రైలర్ వచ్చేసింది!
కోలీవుడ్ హీరో ధనుశ్ బాలీవుడ్లో నటిస్తోన్న రొమాంటిక్ లవ్ స్టోరీ తేరే ఇష్క మే. ఈ మూవీకి ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వం వహిస్తున్నారు. 2023లోనే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించినప్పటికీ కొన్ని కారాణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఈ ఏడాది ఈ చిత్రం షూటింగ్ మొదలు పెట్టిన మేకర్స్ ప్రమోషన్స్తో దూసుకెళ్తున్నారు.తాజాగా తేరే ఇష్క్ మే ట్రైలర్ను రిలీజ్ చేశారు. ఈ మూవీలో ఆదిపురుష్ భామ కృతి సనన్ హీరోయిన్గా కనిపించనుంది. ట్రైలర్ చూస్తుంటే ధనుశ్ ఈ మూవీలో ఎయిర్ఫోర్స్ కమాండర్గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. లవ్ స్టోరీతో పాటు ఫుల్ అగ్రెసివ్ మూవీగా తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా నవంబర్ 28న హిందీ, తమిళం, తెలుగు భాషల్లో థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీని టీ సిరీస్ బ్యానర్లో ఆనంద్ ఎల్ రాయ్, హిమాన్షు శర్మ, భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్ నిర్మించారు. Tere ishk mein trailer @aanandlrai @arrahman @kritisanon @TSeries https://t.co/zpdoOh0SIe— Dhanush (@dhanushkraja) November 14, 2025


