-
‘గురుకులం’లో రోజూ థర్మల్ స్క్రీనింగ్
సాక్షి, హైదరాబాద్: టెన్త్ పరీక్షలు తిరిగి ప్రారంభంకా నుండటంతో విద్యార్థుల పట్ల తీసుకోవల్సిన జాగ్రత్తల పై గురుకుల సొసైటీలు సన్నద్ధమవుతున్నాయి. విద్యార్థులకు వసతి, పరీక్షా కేంద్రాల వరకు రవాణా సౌకర్యం లాంటి ఏర్పాట్లు పక్కాగా చేసేందుకు ఉపక్రమించాయి. రాష్ట్రవ్యాప్తంగా 900 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, జనరల్ గురుకుల పాఠశాలల నుంచి దాదాపు 50 వేల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. ఇప్పటికే తెలుగు పేపర్–1, 2, హిందీ పరీక్షలు ముగియగా... కరోనా నేపథ్యంలో మిగతా పరీక్షలను వాయిదా వేసిన విషయం తెలిసిందే. తిరిగి ఈ నెల 8 నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. దీంతో గురుకుల విద్యార్థులను వారం ముందే పాఠశాలలకు చేరుకోవాలని అధికారులు ఆదేశించారు. సోమవారం నాటికి 90 శాతం మంది విద్యార్థులు చేరుకున్నారు. అనుక్షణం అప్రమత్తం: ఇప్పటికే అన్ని పాఠశాలలను సోడియం హైపోక్లోరైడ్తో మూడుసార్లు శానిటైజ్ చేశారు. పాఠశాలకు వచ్చిన విద్యార్థికి వ్యక్తిగత శానిటైజర్, సబ్బు, మాస్కులు అందిస్తున్నారు. భౌతిక దూరం పాటించేలా సూచనలు చేస్తున్నారు. పరీక్షల నేపథ్యంలో గురుకుల పాఠశాలల సిబ్బంది మే 28 నుంచే విధులకు హాజరువుతున్నారు. విద్యార్థుల సంఖ్య ఆధారంగా భౌతిక దూరంపాటించేలా బెడ్లు ఏర్పాటు చేయడంతో పాటు స్టడీ హాలులో కుర్చీలను ఏర్పాటు చేశారు. వంట సిబ్బందికి ప్రత్యేకంగా డ్రెస్కోడ్ పాటిస్తూ గ్లౌజులు, మాస్కులు ధరించి వంట వడ్డించేలా సూచనలు చేశారు. ప్రతి విద్యార్థికి రోజూ థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు చేస్తారు. దీనికోసంప్రతి స్కూల్కు ఒక ధర్మల్ స్క్రీనింగ్ యంత్రాన్ని పంపిణీ చేశారు. శరీర ఉష్ణోగ్రతల్లో తేడాలుంటే వెంటనే వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ప్రతి గురుకుల పాఠశాలలో ఒక హెల్త్ అసిస్టెంట్ను ఏర్పాటు చేసిన సొసైటీ అధికారులు... 24గంటలు అక్కడే అందుబాటులో ఉండాలని ఆదేశించారు. రోగనిరోధక శక్తి పెరిగేలా ఆహారం.. టెన్త్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల పట్ల అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రతి పాఠశాల ప్రిన్సిపాల్, బోధన, బోధనేతర సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినట్టు బీసీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శి మల్లయ్యభట్టు తెలిపారు. పోషకాహారాన్ని అందించే లా డైట్ చార్ట్ను మార్చామని, రోగ నిరోధకశక్తి పెరిగే ఆహార పదార్థాలు ఇవ్వాలని ఆదేశించామని చెప్పారు. -
స్కూళ్ల అకడమిక్ కేలండర్ ఇదే!
మార్చి మొదటివారంలోనే టెన్త్ పరీక్షలు మార్చి 21 నుంచే కొత్త విద్యా సంవత్సరం షురూ సాక్షి, హైదరాబాద్: వేసవి సెలవుల తర్వాత ఈ నెల 13 నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం కాబోతున్నాయి. కొత్త విద్యా సంవత్సరంలో పాఠశాలల్లో అమలు చేయాల్సిన విద్యా కార్యక్రమాలు, పరీక్షల నిర్వహణ, సెలవులకు సంబంధించిన సమగ్ర వివరాలతో విద్యాశాఖ బుధవారం అకడమిక్ కేలండర్ను ప్రకటించింది. పాఠశాలల్లో ఇందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని డీఈవోలను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి నెలలో చేపట్టాల్సిన కార్యాచరణను పంపించింది. దీని ప్రకారం ఈ నెల 13 నుంచి 2017 ఫిబ్రవరి 28 వరకు స్కూళ్లలో పాఠాలను బోధించాలి. పదోతరగతికి మాత్రం ఈ నెల 13న పాఠ్యాంశాల బోధన చేపట్టి వచ్చే ఏడాది జనవరి 31 నాటికి పూర్తి చేయాలి. స్కూళ్ల పని వేళలు ఇలా.. ఉన్నత పాఠశాలలు: ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 4:45 గంటల వరకు. రోజుకు 7 గంటల 15 నిమిషాలు కొనసాగాలి ప్రాథమికోన్నత పాఠశాలలు: ఆరు నుంచి 8వ తరగతి వరకు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4:15 గంటల వరకు(7 గంటల 15 నిమిషాలు) పని చేయాలి ప్రాథమిక పాఠ శాలలు, వాటిలోని అప్పర్ ప్రైమరీ సెక్షన్లు: ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు(ఏడు గంటలు) పని చేయాలి పరీక్షల షెడ్యూలు ఇదీ.. ఫార్మేటివ్ అసెస్మెంట్ (ఎఫ్ఏ)-1: పని దినాలు 39 రోజులు. జూలై 30వరకు బోధించి, పరీక్షలు నిర్వహించాలి. విద్యార్థుల సామర్థ్యాలను రిజిస్టర్ చేయాలి ఫార్మేటివ్-2: 41 రోజుల పనిదినాలు. సెప్టెంబర్ 22లోగా పరీక్షలు నిర్వహించాలి. ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 22 వరకు పని చేయాలి. సెప్టెంబర్ 22లోగా పరీక్షలు నిర్వహించి, సామర్థ్యాలను రికార్డు చేయాలి సమ్మేటివ్ అసెస్మెంట్ (ఎస్ఏ)-1 (త్రైమాసిక పరీక్షలు): అక్టోబర్ 27 నుంచి నవంబర్ 3 వరకు నిర్వహించాలి. విద్యార్థులకు జవాబు పత్రాలను ఇవ్వాలి. ఫలితాలను నవంబర్ 7న ప్రకటించాలి. ఫలితాలను నవంబర్ 10 వరకు రికార్డు చేయాలి. 11న పేరెంట్స్ మీటింగ్ నిర్వహించాలి. ఎఫ్ఏ-3: అక్టోబర్ 15 నుంచి డిసెంబర్ 9 వరకు. 57 పని దినాలు. డిసెంబర్ 9లోగా పరీక్షలు నిర్వహించి విద్యార్థుల సామర్థ్యాలను నమోదు చేయాలి ఎఫ్ఏ-4: ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వారికి 2017 ఫిబ్రవరి 20 వరకు. పదో తరగతి వారికి ఫిబ్రవరి 4 వరకు మొత్తంగా 52 రోజులు పని చేయాలి. విద్యార్థుల సామర్థ్యాలు రిజిస్టర్ చేయాలి. ఎస్ఏ-2: వచ్చే ఏడాది మార్చి 7 నుంచి 15 వరకు ఒకటి నుంచి 9 తరగతులకు వార్షిక పరీక్షలు. మార్చి 19న విద్యార్థులకు జవాబు పత్రాలు ఇవ్వాలి. ఫలితాలను రికార్డు చేయాలి. 20న తల్లిదండ్రుల సమావేశం నిర్వహించాలి. - 2017 ఫిబ్రవరి 6 నుంచి 18 వరకు: పదో తరగతి వారికి ప్రీ ఫైనల్ పరీక్షలు. మార్చి మొదటి వారంలో వార్షిక పరీక్షలు. క్రీడలు.. ఆగస్టు 5లోగా పాఠశాల స్థాయిలో నిర్వహించాలి. ఆగస్టు 20 నుంచి సెప్టెంబర్ 5 వరకు మండల/డివిజన్ స్థాయిలో, సెప్టెంబర్ 8 నుంచి 20 వరకు జిల్లా స్థాయిలో నిర్వహించాలి. ఎంపికైన విద్యార్థులను సెప్టెంబర్/అక్టోబర్లో జరిగే రాష్ట్రస్థాయి క్రీడల పోటీలకు పంపించాలి. -
రేపటి నుంచి టెన్త్ పరీక్షలు
-
టెన్త్ పరీక్షలపై ఆందోళన వద్దు
ఎంపీపీ వెంకటసుబ్బమ్మ ముత్తుకూరు: విద్యార్థులు ఎటువంటి ఆందోళనలకు గురికాకుండా పదో తరగతి పరీక్షలను బాగా రాయాలని ఎంపీపీ తేట్ల వెంకటసుబ్బమ్మ అన్నారు. ముత్తుకూరు జెడ్పీ హైస్కూల్లో టెన్త్ పరీక్షలకు హాజరయ్యే 145 మంది విద్యార్థులకు సోమవారం పెన్నులు, జామెంట్రీ బాక్సులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ, కష్టపడి చదివే వారికి మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. ఎంఈఓ ఆర్.మురళీధర్, మండల ఉపాధ్యక్షుడు మురాల వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ సభ్యుడు గండవరం సుగుణ, ఈఓపీఆర్డీ చెంచుకృష్ణయ్య, పంచాయతీ కార్యదర్శి వరప్రసాద్, అడిషనల్ హెచ్ఎం షరీఫ్, ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పరీక్షల్లో భయం వీడండి ఇనుకుర్తి(పొదలకూరు) : టెన్త్ విద్యార్థులు పరీక్షల్లో భయం వీడి చక్కగా పరీక్షలను రాయాలని తహశీల్దార్ వి.కృష్ణారావు సూచించారు. మండలంలోని ఇనుకుర్తి జెడ్పీ హైస్కూల్ టెన్త్ విద్యార్థులకు సర్పంచ్ అక్కెం రాఘవరెడ్డి తండ్రి అక్కెం రమణారెడ్డి జ్ఞాపకార్థం సోమవారం పరీక్ష సామాగ్రిని అందజేశారు. తహశీల్దార్ మాట్లాడుతూ దాతలు మందుకు వచ్చి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ప్రోత్సహించడం మంచిపరిణామంగా పేర్కొన్నారు. సర్పంచ్ రాఘవరెడ్డి మాట్లాడుతూ తమ గ్రామంలోని హైస్కూల్పై ఉపాధ్యాయులతో పాటు గ్రామస్తులంతా కలసి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్టు వెల్లడించారు. సమావేశంలో మాజీ ఎంపీటీసీ సభ్యుడు, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు పెదమల్లు రమణారెడ్డి పాఠశాల హెడ్మాస్టర్ మస్తాన్సాహెబ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
రేపటి నుంచి టెన్త్ పరీక్షలు
పరీక్షలు రాయనున్న విద్యార్థులు 8.26 లక్షల మంది మే మూడో వారంలో ఫలితాలు సాక్షి, బెంగళూరు : పదో తరగతి వార్షిక పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభ ం కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి 8,26,269 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందులో 4.88 లక్షల మంది బాలురు, 3.37 లక్షల మంది బాలికలు ఉన్నారు. కాగా పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎస్ఎస్ఎల్సీ బోర్డ్ సెక్రెటరీ నాగేంద్ర కుమార్ ‘సాక్షి’తో పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,016 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. గత అనుభవాల దృష్ట్యా ఇందులో 161 సమస్యాత్మక, 51 అతి సమస్యాత్మక కేంద్రాలుగా విద్యాశాఖ గుర్తించింది. వీటిలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరకకుండా ఉండేందుకు ఎక్కువ సంఖ్యలో స్క్వాడ్లను ఏర్పాటు చేయడమే కాకుండా పరీక్ష కేంద్రంలో వీడియో చిత్రీకరణ చేయనున్నారు. ఈ విధంగా వీడియో తీయడం ఇదే మొదటిసారి. ఇదిలా ఉండగా ఈసారి పదోతరగతి ఫలితాలు కొంత ఆలస్యంగా వెలువడే అవకాశం ఉంది. మొదట్లో వచ్చేనెల 14 నుంచి పరీక్షల మూల్యాంకనం ప్రారంభించాలని విద్యాశాఖ భావించింది. అయితే అదే నెల 17న రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఓటింగ్ జరగనుంది. దీంతో మూల్యాంకనం ఏప్రిల్ 20న ప్రారంభించాలని విద్యా శాఖ నిర్ణయించింది. ఇది మరికొంత ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నట్లు సిబ్బంది పేర్కొంటున్నారు. అందువల్ల మొదట్లో అనుకున్నట్లు మే మొదటి వారంలో కాకుండా మే మూడో వారంలో పదోతరగతి ఫలితాలు వెలువడే అవ కాశం ఉన్నట్లు సమాచారం.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement