-
టీపీసీసీ ఎన్నికల కమిటీ కుదింపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఎన్నికల కమిటీని కుదించనున్నారు. ముఖ్య నేతలు, సీని యర్లతోనే కమిటీని నియమించాలని ఏఐసీసీ నుంచి ఆదేశాలు వచ్చినట్టు గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు నియమించిన ఈ కమిటీలో 54 మందిని సభ్యులుగా నియమిం చారు. పార్టీ ముఖ్య నేతలతో పాటు కొందరు సీని యర్లు, జిల్లా స్థాయి నేతలు, అనుబంధ సంఘాల అధ్యక్షులకు చోటు కల్పించారు. తాజాగా ఎన్నికల కమిటీ కుదింపు ప్రక్రియపై టీపీసీసీ పెద్దలు దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ప్రస్తుత కమిటీలో సభ్యులుగా ఉన్న జిల్లా స్థాయి నేతలు, పలు నియోజకవర్గాల ఇన్చార్జీలతో పాటు కొన్ని అనుబంధ సంఘాల ప్రతినిధులను మినహాయించి కమిటీని సగానికి తగ్గించాలని యోచిస్తున్నట్టు సమాచారం. ఈ కమిటీనే పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాపై కసరత్తు చేయనుంది. ప్రతీ పార్లమెంటు స్థానానికి ముగ్గురు లేదా నలుగురు ఆశావహుల పేర్లతో జాబితాను ఏఐసీసీకి పంపనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై సమీక్ష.. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ఢిల్లీ స్థాయిలో కీలక సమీక్ష ఇంతవరకు జరగలేదు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా రెండోసారి జరిగిన ఎన్నికల్లోనూ కాం గ్రెస్ ఎందుకు ఓడిపోయిందన్న దానిపై ఏఐసీసీ పెద్ద లు టీపీసీసీ నేతలతో చర్చించలేదు. ఈ సమీక్ష కోసం ఫిబ్రవరి తొలి వారంలో టీపీసీసీ ముఖ్యులను ఢిల్లీకి పిలిపించాలని ఏఐసీసీ భావిస్తోంది. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్తో పాటు ఇతర ముఖ్య నాయకుల వీలును బట్టి ఫిబ్రవరి 2 నుంచి 7లోపు ఒక రోజు ఢిల్లీలో సమీక్షించనున్నారు. దీంట్లో పార్టీ ఓటమికి గల కారణాలపై చర్చించడంతో పాటు రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఏఐసీసీ మార్గనిర్దేశం చేస్తుందని టీపీసీసీ ముఖ్య నేత ఒకరు వెల్లడించారు. కాగా, 31 కొత్త జిల్లాలకు పార్టీ అధ్యక్షుల నియామకంపై రాష్ట్రస్థాయి కసరత్తు పూర్తయిందని తెలుస్తోంది. డీసీసీ అధ్యక్షులను ఖరారు చేస్తూ రెండు, మూడు రోజుల్లో ఏఐసీసీ ఆమోదముద్ర వేస్తుందని సమాచారం. -
టీపీసీసీ ఎలక్షన్ కమిటీలో డీఎస్
సురేశ్రెడ్డి, షబ్బీర్ అలీలకు చోటు టీపీసీసీ ప్రచారకమిటీ ఉపాధ్యక్షుడిగా షబ్బీర్అలీ సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ సభ్యుడిగా పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్ నియమితులయ్యారు. ఆయనతో పాటు మాజీ మంత్రి షబ్బీర్ అలీ, మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్రెడ్డిలకు అవకాశం దక్కింది. పొన్నాల లక్ష్మయ్య అధ్యక్షుడిగా ఏర్పడిన తెలంగాణ ప్రదేశ్ ఎన్నికల కమిటీలో కేంద్రమంత్రి జైపాల్రెడ్డితో 23 మంది ని అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నియమించింది. కాగా మంగళవారం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ)ని ప్రకటించిన ఏఐసీసీ, షబ్బీర్ అలీని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఉపాధ్యక్షునిగా నియమించింది. 1989లో మొదటిసారిగా కామారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలుపొందిన షబ్బీర్ అలీ ఆ తర్వాత 1994, 1999లలో టీడీపీ అభ్యర్థులు గంప గోవర్ధన్, యూసుఫ్అలీల చేతిలో ఓడిపోయారు. 2004లో గెలుపొం దిన షబ్బీర్ అలీ దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి మంత్రివర్గంలో పనిచేశారు. 2009 ఎన్నికల్లో ఓటమి చెందిన ఆయనకు పార్టీ అధిష్టానం ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది. మైనార్టీ నేతగా ఎదిగిన షబ్బీర్కు టీపీసీసీలో ప్రచార కమిటీ ఉపాధ్యక్షునిగా నియమించారు.
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
ముద్దు సీన్ అంత ఈజీ కాదు.. మైండ్లో ఉండేది అదొక్కటే: నటి దివ్య
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- అరుదైన ఘనత సాధించే పనిలో స్టార్ హీరోయిన్ జ్యోతిక
- కొత్తపల్లి గీతకు డిపాజిట్ దక్కేనా?
- కొత్తపల్లి గీత డిపాజిట్ దక్కేనా?
- హమ్మయ్య బంగారం దిగొచ్చింది! తులం ఎంతంటే..
- శుభకార్యానికి వెళ్తూ అనంతలోకాలకు..
- పెద్దలను ఎదిరించలేక ప్రేమ జంట ఆత్మహత్య
- దాడులు, దౌర్జన్యాలు, దమనకాండే టీడీపీ అజెండా
- ఆందోళనలు ఉద్రిక్తం.. హార్వర్డ్ యూనివర్సిటీలో పాలస్తీనా జెండా
- వెంటనే ముంబైకి.. ‘టీవీ రాముడు’పై కాంగ్రెస్ విమర్శలు
- ముద్దు సీన్ అంత ఈజీ కాదు.. మైండ్లో ఉండేది అదొక్కటే: నటి దివ్య
Advertisement