-
స్వచ్ఛ భారత్లో ఏపీకి మూడు అవార్డులు
సాక్షి, విజయవాడ : జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్కు మరోసారి అవార్డుల పంట పండింది. తాజాగా కేంద్రం శుక్రవారం స్వచ్చ భారత్ దివస్కు సంబంధించిన జాతీయ అవార్డులను ప్రకటించింది. ఈ సందర్భంగా స్వచ్ఛ భారత్ గ్రామీణ్లో రాష్ట్రానికి తొలిసారి మూడు అవార్డులు లభించాయి. కేంద్రం ప్రకటించిన అవార్డుల్లో స్వచ్ఛ సుందర్ సముదాయక్ శౌచాలయ కేటగిరీలో రెండో ర్యాంకు, సముదాయక్ శౌచాలయ అభియాన్ కేటగిరీలో మూడవ ర్యాంక్, దీంతో పాటు గంధగి ముక్త్ భారత్ కేటగిరీలో మూడవ ర్యాంక్ లభించింది. జాతీయ స్థాయిలో ఏపీకి అవార్డులు రావడం వెనుక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి ఎంతో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన గ్రామ సచివాలయ వ్యవస్థ మంచి సత్ఫలితాలనిచ్చింది. కాగా గతంలో ఎన్నడూ రాష్ట్రానికి ఇన్ని ర్యాంకులు దక్కలేదు. సచివాలయ వ్యవస్థతోనే జాతీయ ర్యాంకులు సాధ్యమైన వేళ రాష్ట్ర వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతుంది. కాగా 2014 నుంచి ప్రతిఏటా అక్టోబర్ 2న గాంధీ జయంతి పురస్కరించుకొని స్వచ్ఛ భారత్ దివస్గా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ నేపథ్యంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన రాష్ట్రాలను స్వచ్ఛ భారత్ దివస్ కింద ర్యాంకులను ప్రకటిస్తారు. -
ఊడ్చిన చెత్త ఊరినెత్తిన
పల్లెల్లో కొరవడిన పారిశుధ్యం పంచాయతీల్లో కానరాని డంపింగ్ యార్డులు నీరుగారుతున్న ప్రభుత్వ లక్ష్యం మహారాణిపేట (విశాఖ): పల్లెల్లో పారిశుధ్యం కొరవడింది. ఎక్కడికక్కడ చెత్తకుప్పలు దర్శనమిస్తున్నాయి. స్వచ్ఛభారత్ కార్యక్రమం తొలినాళ్లలో కొందరు చీపుళ్లు పట్టుకుని హడావుడి చేశారు. ప్రభుత్వ కార్యాలయల పరిసరాల్లో ఊడ్చడం, పరిశుభ్రం చేయడం కనిపించేది. దీంతో గ్రామాల స్వరూపం మారిపోతుందని అంతా ఆశించారు. పారిశుధ్యం మెరుగు పడుతుందని ఆశించారు. ఇందులో భాగంగా రాష్ట్రప్రభుత్వం రెండడుగులు ముందుకేసి ప్రతి గ్రామంలోనూ డంపింగ్యార్డులు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. ఇందుకు 20 నుంచి 30 సెంట్లు భూమి కేటాయించాలని తహశీల్దార్లు, సర్పంచ్లను ఆదేశించింది. అధికారుల పట్టించుకోని తనమో, సర్పంచ్ల నిర్లక్ష్యమో కాని జిల్లాలో ఇది అమలు కాలేదు. ఒక్క పంచాయతీలోనూ డంపింగ్యార్డు ఏర్పాటు కాలేదు. అవగాహన లోపంతో గ్రామీణులు ఇళ్లల్లో ఊడ్చిన చెత్తను తెచ్చి రోడ్లపై వేసేస్తున్నారు. దీంతో పారిశుధ్యం కొరవడి పరిస్థితి దయనీయంగా ఉంటోంది. 12 పంచాయతీల్లోనే స్థలాల గుర్తింపు జిల్లాలో 925 పంచాయతీల్లో కేవలం 12మంది సర్పంచ్లు మాత్రమే డంపింగ్యార్డులకు స్థలాలను గుర్తించి ప్రతిపాదనలు పంపించారు. మిగతా వారు పట్టించుకోలేతదు. అసలు ఈ యార్డులు ఎవరు ఏర్పాటు చేయాలన్న దానిపై ఇంత వరకూ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఈ లక్ష్యం నీరుగారిపోతోంది.గ్రామాల్లో పారిశుధ్యం కొరవడి అన్ని వీథుల్లోనూ చెత్తకుప్పలు దర్శనమిస్తున్నాయి. ఈగలు, దోమలు విజృంభిస్తున్నాయి. జనం రోగాలతో మంచానపడి విలవిల్లాడుతున్నారు. యార్డుల ఏర్పాటు ఎలా అంటే.. డంపింగ్యార్డుకు 20 నుంచి 30 సెంట్లు స్థలం ఉండాలి. దానిని గ్రామపంచాయతీ పరిధిలో సర్పంచ్లే గుర్తించాలి. పంచాయతీ స్థలం లేకపోతే రెవెన్యూ అధికారులు కేటాయించాలని సర్పంచ్ మండల తహశీల్దార్కు లేఖ రాయాలి. అప్పుడు రెవెన్యూ అధికారులు ఆ పంచాయతీ పరిధిలో 30సెంట్లు స్థలం గుర్తించి ఇవ్వాలి. ఉపాధిహామీ పథకంలో ఈ డంపింగ్యార్డు ఏర్పాటు చేయాలి. గ్రామంలో ఊడ్చిన చెత్తనంతటినీ తెచ్చి ఇక్కడ వేయాలి. ఈ విధానం ఏ మండలంలోనూ కానరావడం లేదు. అసలు ఈ డంపింగ్యార్డులు గురించి పంచాయతీ అధికారులే పట్టించుకోవడం లేదు. గ్రామపంచాయతీలపై ఈవోపీఆర్డీల పర్యవేక్షణ లేదు. ఇబ్బంది కరంగా ఉంది శ్రీరాంపురంలో పాఠశాల, అంగన్వాడీ కేంద్రం ప్రాంతాల్లో రోడ్డుకు ఇరు వైపులా రోజూ చెత్త వేసేస్తున్నారు. వ ర్షం పడితే ఇబ్బందిగా ఉంటోంది. డంపింగ్ యార్డు ఏర్పాటుకు చర్యలు చేపట్టడం లేదు. ఇప్పటకయినా అధికారులు స్పందించాలి. రోడ్డు పక్కన చెత్త వేయకుండా చూడాలి. -ఎం.శ్రీనివాసరావు, శ్రీరాపురం
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
ఎమ్మెల్యే కనకయ్యకు మంత్రి పరామర్శ
వడదెబ్బతో ముగ్గురు మృతి
భార్య హత్య కేసులో భర్తకు జీవితఖైదు
చికిత్స పొందుతున్న వ్యక్తి...
బీజేపీతోనే సుస్థిర పాలన
మద్యం స్వాధీనం
గిరిజనుల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి
మిత్రపక్ష పార్టీల కోఆర్డినేటర్లు వీరే...
హైదరాబాద్కు సుప్రీం బెంచ్ తెస్తాం
తప్పక చదవండి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
Advertisement