breaking news
steel bridge
-
వర్షం వస్తే మునిగిపోయే రాజధాని నాసిరకం నిర్మాణాలు
-
‘ప్రజాధనాన్ని కుంగిపోయే బ్రిడ్జిలకు ఖర్చు చేస్తారా?’
తాడేపల్లి: ఉండవల్లి స్టీల్ బ్రిడ్జిను వైఎస్సార్సీపీ నేతలు పరిశీలించారు. బకింగ్హామ్ కెనాల్పై నిర్మాణంలో ఉన్న స్టీల్ బ్రిడ్జిను వైఎస్సార్సీపీ నేతలు అంబటి రాంబాబు, మల్లాది విష్ణు, లేళ్ల అప్పిరెడ్డి, శైలజానాథ్లు పరిశీలించారు. రాజధానిలోని సీడ్ యాక్సిస్ రోడ్కు అనుసంధానంగా స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టారు. అయితే నిర్మాణ సమయంలో స్టీల్ బ్రిడ్జ్ గర్డర్ ఒరిగింది. దీన్ని పరిశీలించడానికి వెళ్లిన వైఎస్సార్సీపీ నేతలు.. రాజధాని పనుల్లో నాణ్యత ప్రశ్నార్థకం అనడానికి ఇదొక నిదర్శమన్నారు. పూటకో మాట చెప్తున్నారు..బ్రిడ్జి నిర్మాణంలో అధికారులు పూటకో మాట చెప్తున్నారని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. ఉదయం తప్పులేదన్నారు, సాయంత్రానికి తప్పు జరిగినట్టు ప్రకటించారన్నారు. ‘రైతుల బాధలను ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. అమరావతి పేరుతో విజయవాడను ఓల్డ్ సిటీగా మార్చేశారు. అప్పులు తెచ్చి అమరావతి అవసరమా?, అప్పులు ఆపండి, చిన్న బ్రిడ్జి నిర్మాణంలోనే ఇన్ని లోపాలు ఉంటే ఇక అమరావతి ఎప్పటికి అవుతుంది?, రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించవద్దు’ అని ధ్వజమెత్తారు.మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ‘ ఆర్నెళ్ల క్రితం ప్రారంభించిన బ్రిడ్జి ఇంకా పూర్తవలేదు. ఈలోపు కొంత కుంగిపోయింది. పనులు ఆపేశారు. సీడ్ యాక్సెస్ రోడ్డు వారధి దగ్గర కలుపుతామన్నారు. మరి స్టీల్ బ్రిడ్జి నిర్మాణం ఎందుకు చేస్తున్నట్టు?, అంటే ప్లానింగ్ లోపం ఉన్నట్టా?, కొండవీటి వాగు మీద బ్రిడ్జి పూర్తి కాకుండానే బకింగ్హామ్ కెనాల్ బ్రిడ్జి నిర్మాణం ఎందుకు చేస్తున్నారు?, కమీషన్ల కక్కుర్తితో హడావుడిగా పనులు చేయటం వలనే బ్రిడ్జి కుంగింది. బకింగ్హామ్ కెనాల్ జలరవాణాకు సంబంధించినది. దానిమీద బ్రిడ్జి నిర్మాణం చేయాలంటే చాలా పర్మిషన్ లు కావాలి. ఏం పర్మిషన్ లు తీసుకుని బ్రిడ్జి కడుతున్నారు?, అధికారం ఉందని ఇష్టానుసారం బ్రిడ్జిలు కడతారా?, చంద్రబాబు, లోకేష్, మంత్రి నారాయణ ప్రజలకు సమాధానం చెప్పాలి. ప్రజాధనాన్ని కుంగిపోయే బ్రిడ్జిలకు ఖర్చు చేస్తారా?’ అని ప్రశ్నించారు. -
అమరావతి పనుల్లో నిర్లక్ష్యం.. ఒరిగిన స్టీల్ బ్రిడ్జి గడ్డర్లు
-
అమరావతి నిర్మాణ పనుల్లో భారీ లోపం..
తాడేపల్లి రూరల్: అమరావతి నిర్మాణ పనుల్లో డొల్లతనం బయటపడింది. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, ప్రభుత్వ పర్యవేక్షణలోపం కారణంగా నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి గడ్డర్లు ఒరిగిపోయాయి. 20 రోజులుగా ఈ బ్రిడ్జి పూర్తిగా పడిపోకుండా అధికారులు క్రేన్ను అడ్డంపెట్టారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. రాజధానికి అతి ముఖ్యమైన సీడ్ యాక్సెస్ రోడ్డుకు అనుసంధానంగా బకింగ్హామ్ కాలువ–కొండవీటి వాగుపై అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్నట్లుగా చెబుతున్న స్టీలు బ్రిడ్జి నిర్మాణంలో లోపాలు తలెత్తాయి.స్టీలు బ్రిడ్జి ఏర్పాటు చేసే సమయంలో రెండు పిల్లర్ల మధ్య నిర్మించిన గడ్డర్లు ఒక పక్కకు వాలిపోయాయి. అవి పడిపోకుండా క్రేను అడ్డంపెట్టిన అధికారులు.. గురువారం వాటిని తొలగించే పనులు చేపట్టారు. రాజధానికి, 16వ నంబరు జాతీయ రహదారికి అనుసంధానంగా నిర్మిస్తున్న సీడ్ యాక్సెస్ రోడ్డును ఉండవల్లి వరకు నిర్మించారు. ఇక్కడి నుంచి ఉండవల్లి సెంటర్ బకింగ్హామ్ కెనాల్ మీదుగా తాడేపల్లి కృష్ణాకెనాల్ రైల్వే బ్రిడ్జిని దాటిస్తూ మణిపాల్ ఆస్పత్రి వరకు బ్రిడ్జి నిర్మించాల్సి ఉంది. ఆ బ్రిడ్జి నిర్మాణం వ్యయంతో కూడుకున్నది కావడంతో సీఆర్డీఏ అధికారులు, ప్రభుత్వ పెద్దలు మంగళగిరి – ప్రకాశం బ్యారేజ్ పాత జాతీయ రహదారికి అనుసంధానం చేస్తూ కొండవీటి వాగు, బకింగ్హామ్ కెనాల్ను దాటిస్తూ అనుమతులు లేకపోయినా తాత్కాలికంగా రూ.68 కోట్లతో స్టీలు బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు.బకింగ్హామ్ కెనాల్లో నీటి ప్రవాహానికి అడ్డురాకుండా ఆ చివర, ఈ చివర నాలుగు పిల్లర్లు ఏర్పాటు చేసి మధ్యలో సుమారు 40 అడుగుల మేర ఈ ఐరన్ గడ్డర్లు ఏర్పాటు చేశారు. ఈ బ్రిడ్జికి.. ప్రకాశం బ్యారేజ్కి దక్షిణం వైపు బిగించిన స్టీలు గడ్డర్లు వంకర పోయి ఒరిగిపోయినట్లు సీఆర్డీఏ, ఇంజినీరింగ్ అధికారులు గుర్తించారు. గతనెల 20వ తేదీన స్టీలు బ్రిడ్జిపై కాంక్రీట్ వేసే సమయంలో ఈ లోపాన్ని గమనించారు. అప్పటి నుంచి బ్రిడ్జి మరింత ఒరగకుండా భారీ క్రేన్తో గడ్డర్ను నిలబెట్టారు. ఇంజినీర్లు పరిశీలించి.. ప్రమాదం జరిగే అవకాశం ఉందని హెచ్చరించడంతో అధికారులు గుట్టుచప్పుడు కాకుండా గడ్డర్లు తొలగింపు చేపట్టారు. ఈ బ్రిడ్జికి శంకుస్థాపన చేసిన సమయంలో మంత్రి నారాయణ దీన్ని అత్యాధునిక టెక్నాలజీతో చేపడుతున్నామని చెప్పారు. కానీ, రాజధాని పనులు ఎంత నిర్లక్ష్యంగా జరుగుతున్నాయో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అని ప్రజలు చర్చించుకుంటున్నారు. -
హైదరాబాద్లో మరో స్టీల్ బ్రిడ్జి
సాక్షి, హైదరాబాద్: నగరంలో మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి రానుంది. ప్యారడైజ్ జంక్షన్ నుంచి శామీర్పేట్ ఔటర్ రింగ్రోడ్డు వరకు ఎలివేటెడ్ స్టీల్బ్రిడ్జి కారిడార్ నిర్మాణానికి హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) చర్యలు చేపట్టింది. వీఎస్టీ నుంచి అశోక్నగర్ వరకు నిర్మించిన బ్రిడ్జి తరహాలోనే ప్యారడైజ్– శామీర్పేట్ మధ్య 18.18 కి.మీ మేర బ్రిడ్జి నిర్మాణం చేపట్టనున్నారు. దాదాపు రూ.4,263 కోట్ల అంచనాలతో రూపొందించిన ఈ ప్రాజెక్టును ప్రముఖ నిర్మాణ సంస్థ బేకమ్ దక్కించుకుంది. రానున్న రెండేళ్లలో దీన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. వెస్ట్ మారేడ్పల్లి, కార్ఖానా, తిరుమలగిరి, బొల్లారం, అల్వాల్, హకీంపేట్, తూంకుంట మీదుగా శామీర్పేట్ ఓఆర్ఆర్ జంక్షన్ (Shamirpet ORR Junction) వరకు నిర్మించే ఈ స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే సికింద్రాబాద్ నుంచి నేరుగా ఔటర్ మీదుగా రాజీవ్ రహదారికి రాకపోకలు సాగించవచ్చు. నగరానికి ఉత్తరం వైపున మేడ్చల్ రూట్లో ప్యారడైజ్ నుంచి డెయిరీఫామ్ వరకు చేపట్టిన మరో ఎలివేటెడ్ కారిడార్తో రెండు మార్గాల్లోనూ ప్రయాణ సదుపాయాలు మెరుగుపడతాయి. స్టీల్ బ్రిడ్జి ఎలివేటెడ్ కారిడార్ ఇలా.. ⇒ ప్యారడైజ్ జంక్షన్ నుంచి శామీర్పేట్ ఓఆర్ఆర్ జంక్షన్ వరకు 18.18 కి.మీ. నిర్మాణంలో 11.52 కి.మీ. ఎలివేటెడ్ కారిడార్ ఉంటుంది. హకీంపేట్ ఎయిర్ఫోర్స్ అకాడమీ వద్ద 6 లేన్లతో టన్మెల్ నిర్మించనున్నారు. తిరుమలగిరి, అల్వాల్ (Alwal) వద్ద రెండు చోట్ల వాహనదారులు బ్రిడ్జిపైకి ప్రవేశించేందుకు, నిష్క్రమించేందుకు ఎంట్రన్స్, ఎగ్జిట్లు ఉంటాయి. ⇒ ఈ ప్రాజెక్టు కోసం 9.35 కి.మీల మార్గంలో 114.50 ఎకరాల రక్షణశాఖ భూములను, 8.35 కి.మీ.మార్గంలో 78.39 ఎకరాల ప్రైవేట్ భూ ములను సేకరించారు. 967 నిర్మాణాలను తొలగించి రోడ్డు విస్తరణ చేపట్టాల్సి ఉంటుంది. వేగిరంగా డెయిరీఫామ్ కారిడార్.. ప్యారడైజ్ జంక్షన్ నుంచి మేడ్చల్ రూట్లో డెయిరీఫామ్ వరకు 5.40 కి.మీ వరకు చేపట్టిన ఎలివేటెడ్ కారిడార్ (elevated corridor) నిర్మాణ పనులు వేగిరంగా కొనసాగుతున్నాయి. ఈ కారిడార్ పనులు 36 నెలల్లో పూర్తయ్యే అవకాశం ఉంది. ఇది అందుబాటులోకి వస్తే సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ మీదుగా మెదక్, నిజామాబాద్ మార్గంలో రాకపోకలు సులభతరమవుతాయి. -
మంత్రి తలసాని క్షమాపణలు
సాక్షి, హైదరాబాద్: ముషీరాబాద్ స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభం సందర్భంగా జరిగిన ఘటనపై మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ స్పందించారు. బైంసా ఏఎంసీ ఛైర్మన్ రాజేష్బాబుకు మంత్రి క్షమాపణలు చెప్పినట్లు వెల్లడించారు. కేటీఆర్ వచ్చిన సందర్భంగా ఎక్కువ రద్దీ ఏర్పడిందని.. పక్కనున్న ఓ వ్యక్తి తన కాలు తొక్కుతూ ముందుకెళ్లడంతో కాలికి గాయం అయ్యిందని ఆ సందర్భంగానే వ్యక్తిని నెట్టివేశానని అన్నారు మంత్రి తలసాని. సోషల్ మీడియాలో కావాలనే ఈ ఘటనను పెద్దది చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారాయన. తను తోసేసిన వ్యక్తి రాజేష్ బాబు అని, గిరిజన బిడ్డ తర్వాతే తెలిసిందని, వెంటనే ఫోన్ చేసి క్షమాపణ చెప్పానన్నారు. ఆ రోజు జరిగిన ఘటనపై గిరిజనుల మనోభావాలు దెబ్బతింటే మరోసారి క్షమాపణ చెబుతున్నానని తలసాని చెప్పారు. తాను బడుగు, బలహీన, దళిత, మైనార్టీ గిరిజన వర్గాల గొంతుకనని, తెలంగాణలో జరిగే సేవాలాల్, కొమురం భీం జయంతి కార్యక్రమాలు ముందుండి చేస్తానన్నారు. ఆ రోజు జరిగిన ఘటనపై వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే మరోసారి క్షమాపణ చెబుతున్నానని తలసాని పేర్కొన్నారు. చదవండి: ‘పాలేరు నుంచే తుమ్మల పోటీ’ -
KTR: హైదరాబాద్ ఉక్కు వంతెన ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం నగరంలో నూతన బ్రిడ్జిలను నిర్మిస్తోంది. ఈ క్రమంలో మరో ప్రత్యేకమైన వంతెన ఇవాళ తెరుచుకుంది. ఇందిరా పార్క్-వీఎస్టీ ఉక్కు వంతెనను మంత్రి కేటీఆర్ శనివారం ఉదయం ప్రారంభించారు. ఈ వంతెన పేరు ఇందిరా పార్కు నాయిని నరసింహ రెడ్డి స్టీల్ బ్రిడ్జ్. కార్మిక నేత, మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి గౌరవార్థం నామకరణం చేశారు. ఇందిరా పార్క్ చౌరస్తా నుంచి ఆర్టీసీ బస్ భవన్ సమీపంలోని VST చౌరస్తా వరకు ఈ బ్రిడ్జిని నిర్మించారు. తద్వారా ఆర్టీసీ క్రాస్రోడ్స్, అశోక్ నగర్, వీఎస్టీ జంక్షన్లలో ఏర్పడే ట్రాఫిక్ రద్దీ తగ్గనుందని ప్రభుత్వం భావిస్తోంది. దక్షిణ భారత దేశంలోనే మొదటి పొడవైన స్టీల్ బ్రిడ్జ్. జీహెచ్ఎంసీ చరిత్రలోనే ఈ బ్రిడ్జికి ఓ ప్రత్యేకత ఉంది. తొలిసారి భూసేకరణ లేకుండానే ఈ బ్రిడ్జిని నిర్మించారు. మెట్రో పై నుంచి ఉండడం ఈ బ్రిడ్జికి ఉన్న మరో ప్రత్యేకత. బ్రిడ్జి పొడవు 2.62 కిలోమీటర్లు.. వెడల్పు నాలుగు లైన్లు ఈ బ్రిడ్జి కోసం 12, 316 మెట్రిక్ టన్నుల ఉక్కు వినియోగించారు. 81 స్టీల్ పిల్లర్లు, 426 ఉక్కు దూలాలు వినియోగించారు. కాంక్రీట్ 60-100 ఏళ్లు, స్టీల్ 100 ఏళ్లకు పైగా మన్నికగా ఉంటుందని ఇంజినీర్లు చెబుతున్నారు. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద(ఎస్ఆర్డీపీ) రూ. 450 కోట్ల వ్యయంతో ఈ బ్రిడ్జిని జీహెచ్ఎంసీ నిర్మించింది. రోజుకు లక్ష వాహనాలు తిరిగే ఈ రూట్లో వాహనదారులకు బిజీ టైంలో 30-40 నిమిషాల టైం పట్టేది. ఈ వంతెన నిర్మాణంలో కేవలం ఐదే నిమిషాల్లో ప్రయాణం కొనసాగించొచ్చని అధికారులు చెబుతున్నారు. Good Morning Friends 😍❤️ Minister @KTRBRS will inaugurate the Naini Narsimhareddy Steel Bridge today#SteelBridge #Hyderabad #KTR pic.twitter.com/UzRW03wQ3M — Latha (@LathaReddy704) August 19, 2023 స్టీల్ బ్రిడ్జికి నాయిని నర్సింహారెడ్డి పేరు పెట్టాం. ఈ బ్రిడ్జి నిర్మాణంతో ట్రాఫిక్ కష్టాలు తీరతాయి. ఎస్ఆర్డీపీలో ఇది 36వ ప్రాజెక్టు. హైదరాబాద్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాం. అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తున్నాం. :::బ్రిడ్జిని ప్రారంభించిన అనంతరం మంత్రి కేటీఆర్ 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
Indira Park to RTC X Road : నేడు దక్షిణ భారతదేశంలోనే తొలి అతిపెద్ద స్టీల్ బ్రిడ్జి ప్రారంభం (ఫొటోలు)


