రాయరు సన్నిధిలో రామ్చరణ్ సతీమణి ఉపాసన
మంత్రాలయం: శ్రీరాఘవేంద్రస్వామి దర్శనార్థం గురువారం తెలుగు సినీ హీరో రామ్చరణ్ సతీమణి ఉపాసన మంత్రాలయం చేరుకున్నారు. శ్రీమఠం అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి ఆధ్వర్యంలో మఠం అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ముందుగా గ్రామ దేవత మంచాలమ్మకు కుంకుమర్చాన, సంకల్పం చేసుకున్నారు. అనంతరం ఆమె రాఘవేంద్రస్వామి మూలబందావనాన్ని దర్శించుకున్నారు.