breaking news
sri latha
-
అది నరబలే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో సంచలనం సృష్టించిన నరబలి కేసులో చిక్కుముడి వీడింది. ఉప్పల్లోని చిలుకానగర్ ఇంటి యజమాని రాజశేఖర్, అతని భార్య శ్రీలత క్షుద్రపూజల పేరిట ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారని రాచకొండ పోలీసులు తేల్చారు. నరబలి ఇస్తే శ్రీలత ఆరోగ్యం మెరుగు పడుతుందని ఓ కోయ దొర చెప్పిన మాటలతో వీరు ఈ దారుణానికి పాల్పడ్డారని వెల్లడించారు. క్షుద్రపూజలు చేసిన గదిలో లభించిన రక్తపు మరకలు, శిశువు తల భాగం నుంచి సేకరించిన డీఎన్ఏ నమూనాలతో సరిపోలడంతో ఈ కేసులో స్పష్టతకు వచ్చిన పోలీసులు.. రాజశేఖర్, అతని భార్య శ్రీలతను గురువారం అరెస్టు చేశారు. కేసు వివరాలను ఎల్బీనగర్ సీపీ క్యాంపు కార్యాలయంలో రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ మీడియాకు తెలిపారు. కోయదొర చెప్పిన మాటలతో.. ఉప్పల్లోని చిలుకానగర్లో తేరుకొండ రాజశేఖర్, శ్రీలత నివాసం ఉంటున్నారు. క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్న రాజశేఖర్ భార్య శ్రీలత కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఎందరు వైద్యులను సంప్రదించినా మార్పురాలేదు. రెండేళ్ల క్రితం సమ్మక్క–సారక్క జాతరకు వెళ్లిన రాజశేఖర్ దంపతులు అక్కడి ఓ కోయదొరను ఆశ్రయించారు. నరబలి ఇస్తే ఆమె ఆరోగ్యం కుదుటపడుతుందని అతడు తెలిపాడు. ఆ తర్వాత కూడా శ్రీలత ఆరోగ్యం కుదుటపడాలనే ఉద్దేశంతో పలువురు మంత్రగాళ్లను ఆశ్రయించినా.. పరిస్థితి మెరుగు పడకపోవడంతో నరబలికి సిద్ధమయ్యారు. బోయిగూడలో శిశువు అపహరణ.. జనవరి 31న రాత్రి ఏడు నుంచి ఎనిమిది గంటల సమయంలో బోయగూడలో రెక్కీ చేసిన రాజశేఖర్ మూడు నుంచి ఆరు నెలల వయసున్న ఆడ శిశువు విచక్షణాజ్ఞానం లేని తల్లిదండ్రుల వద్ద ఉన్నట్టు గుర్తించాడు. చంద్రగ్రహణం రోజున నరబలి ఇవ్వాలనే ఉద్దేశంతో ఫిబ్రవరి ఒకటో తేదీన అర్ధరాత్రి 12.45 గంటలకు ఇంటి నుంచి కత్తి, పాలిథిన్ బ్యాగ్లను తీసుకుని ఏపీ20టీవీ1646 కారులో బయలుదేరి 1.30 గంటలకు బోయిగూడ చేరుకున్నాడు. ఫుట్పాత్పై ఆదమరిచి నిద్రిస్తున్న చిన్నారిని అపహరించి పీర్జాదిగూడ ప్రతాపసింగారం మూసీ కాలువ వద్దకు రెండు గంటలకు తీసుకెళ్లి శిశువు గొంతు, మొండెంను కత్తితో నరికి వేరుచేశాడు. శిశువు మొండెం, కత్తిని మూసీలో పడేసి పాలిథిన్ కవర్లో తలను తీసుకుని తెల్లవారుజామున మూడు గంటలకు ఇంటికి చేరుకున్నాడు. నగ్నంగా భార్యాభర్తల క్షుద్రపూజలు తెల్లవారుజామున మూడు నుంచి నాలుగు గంటల మధ్య శిశువు తలను పెట్టి భార్యాభర్తలిద్దరూ నగ్నంగా క్షుద్రపూజలు చేశారు. అనంతరం శిశువు తలకు సూర్యకిరణాలు పడేలా ఇంటిపై తలను ఉంచి కిందికి వచ్చారు. ఆ తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా రాజశేఖర్ క్యాబ్ను తీసుకుని మాదాపూర్కు బయలుదేరాడు. 10.20కి తిరిగి ఇంటికి చేరుకున్నాడు. రాజశేఖర్ అత్తమ్మ వీరకొండ బాలలక్ష్మి ఉదయం 11 గంటలకు బట్టలు ఆరేసేందుకు భవనంపైకి వెళ్లి శిశువు తలను చూసి కేకలు వేసింది. ఈ మేరకు అందిన సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని శిశువు తలను గాంధీ ఆస్పత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు. రాజశేఖర్ ఇంట్లో దొరికిన రక్తనమూనాలు శిశువు డీఎన్ఏతో సరిపోలాయని ఫోరెన్సిక్ ల్యాబ్ ఇచ్చిన నివేదికతో రాజశేఖర్, శ్రీలతను పోలీసులు అరెస్టు చేశా రు. క్షుద్రపూజలకు రాజశేఖర్ వాడిన వస్త్రాలను, దాచిన బ్యాగ్ను స్వాధీనం చేసుకున్నారు. పౌర్ణమి నుంచి అమావాస్య వరకు నరబలి జరిగిన పౌర్ణమి నుంచి అమావాస్య వరకు అంటే 2 వారాల పాటు ఈ కేసు విచారణ కొనసాగింది. 45 మందిని విచారించామని, ఆధారాల కోసం 112 ఫోన్కాల్స్, 54 సెల్ టవర్ల డేటాను సేకరించామని, 40 మంది సాక్షులను, వందకుపైగా సీసీ కెమెరా పుటే జీలను పరిశీలించామని, డీఎన్ఏ రిపోర్ట్ ద్వారా నరబలికి గురైంది ఆడ శిశువుగా గుర్తించామని, డీఎన్ఏ ఫలితాలతో నిందితులు దొరికిపోయారని సీపీ మహేష్ భగవత్ వెల్లడించారు. వీరిని విచారిస్తే ఈ కేసుపై పూర్తి స్పష్టత వస్తుందని తెలిపారు. -
పిడుగుపాటుకు ముగ్గురు మృతి
బయ్యారం, న్యూస్లైన్: పిడుగు ముగ్గురిని బలితీసుకుంది. బయ్యారం మండలంలోని తులారం ప్రాజెక్టు అలుగుల వద్ద మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. వివరాలిలా ఉన్నా యి. మండలంలోని గౌరారం పంచాయతీ వినోభానగర్కు చెందిన జవ్వాది వెంకటమ్మ(50), ఆమె కుమార్తె శ్రీలత(21)తో పాటు వరంగల్ జిల్లా ఖానాపురం మండలం మంగలివారిపేటకు చెందిన బబ్లు(12)(వెంకటమ్మ మరో కుమార్తె కొడుకు) బట్టలు ఉతికేందుకు తులారం ప్రాజెక్టు వద్దకు మంగళవారం సాయంత్రం వెళ్లారు. ఈ క్రమంలో పిడుగులతో భారీ వర్షం కురిసింది. చీకటి పడుతున్నా వారు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లి చూడగా బబ్లు తులారం ప్రాజెక్టు వద్ద నీటిలో తేలుతూ కనిపించాడు. ఉతికేందుకు తీసుకెళ్లిన దుస్తులు చిందరవందగా పడిపోయి ఉన్నాయి. దీంతో అనుమానం వచ్చిన వారు నీటిలో చూడగా వెంకటమ్మ, ఆమె కుమార్తె శ్రీలత మృతదేహాలు లభించాయి. వారు దుస్తులు ఉతికేందుకు వెళ్లిన సమయంలో అక్కడ పిడుగు పడిందని, పిడుగు పాటుకే వారు మృతి చెందారని స్థానికులు అంటున్నారు. -
సారీ డాడీ..
ఇంటర్ విద్యార్థిని విషాదం నోట్ రాసి ఉరివేసుకుని ఆత్మహత్య చైతన్యపురి, న్యూస్లైన్: ‘నేను ఏ తప్పు చేయకున్నా బంధువులు, ఫ్రెండ్స్ అనుమానించార’ంటూ మనస్తాపం చెందిన ఇంటర్ విద్యార్థిని స్యూసైడ్ నోట్రాసి ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సరూర్నగర్ సీఐ నర్సింహరావు కథనం ప్రకారం.. నల్లగొండజిల్లా చింతపల్లి మండలం గొల్లపల్లికి చెందిన వెంకటయ్య లారీ డ్రైవర్. కర్మన్ఘాట్ మాధవనగర్లో భార్య, కూతురు, కుమారుడితో కలిసి ఉంటున్నాడు. కూతురు శ్రీలత (16) చైతన్యపురిలో శ్రీచైతన్య కళాశాలలో బైపీసీ మొదటి ఏడాది చదువుతోంది. గురువారం సాయంత్రం ఇంట్లో ఒంటరిగా ఉన్న శ్రీలత సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన తల్లి.. భర్తకు, పోలీసులకు తెలిపింది. పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టమ్కు తరలించారు. ఘటనా స్థలి నుంచి ఒక నోట్ను స్వాధీనం చేసుకున్నారు. తన స్నేహితులు తనను దూరంగా ఉంచుతున్నందుకు బాధపడుతున్నానని, కుటుంబసభ్యులు కూడా అనుమానిస్తున్నారని అందుకే ఈ నిర్ణ యం తీసుకుంటున్నట్లు అందులో రాసి ఉంది. ‘సారీ డాడీ.. నీ కోరిక తీర్చలేకపోయాను.. మమ్మీ.. నీకిక కష్టాలుండవు...నన్ను మర్చిపోకండి.. అమ్మమ్మ కోసం బతకాలని ఉంది... కానీ కుదరట్లేదు. కరిగిపోతే క్యాండిల్ విలువ.. గడిచిపోతే కాలం విలువ... దూరమైతే కానీ నా విలువ తెలియవు’ అని పేర్కొంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
దేవుడా.. ఎంతపని చేశావు..?
నాందేడ్ ఎక్స్ప్రెస్ రైలు దుర ్ఘటనలో అనంతపురానికి చెందిన కొత్త దంపతులు శ్రీలత, శ్రీనివాస్ మృత్యువాత పడినట్లు బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రి వైద్యులు నిర్ధారించడంతో కుటుంబ సభ్యులు నిర్ఘాంతపోయారు. దేవుడా.. ఆరు నెలలకే ఆ దంపతుల జీవితాన్ని ముగించేశావా అంటూ రోదించారు. మృతదేహాల కోసం అనంతపురం నుంచి శ్రీనివాస్ కుటుంబ సభ్యులు బెంగళూరు వెళ్లారు. బెంగళూరు నుంచి బయలుదేరిన నాందేడ్ ఎక్స్ప్రెస్ రైలు శనివారం 26 మంది పాలిట మృత్యు శకటంగా మారింది. ఈ ఘోర ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో తీరని వ్యథను మిగిల్చింది. రైలు ప్రమాదంలో మృతి చెందిన వారి బంధువులు నగరంలోని విక్టోరియా ఆస్పత్రి వద్దకు చేరుకొని ‘దేవుడా ఎందుకిలా చేశావ్, ఎందుకు మా కింత శిక్ష విధించావంటూ’ విలపిస్తుంటే వారిని చూస్తున్న వారి కళ్లు కూడా చెమర్చాయి.