breaking news
sports certificate
-
‘గురుకుల’ దరఖాస్తు గడువు పెంపు
స్పోర్ట్స్ సర్టిఫికెట్ ఉండాలన్న నిబంధన తొలగింపు సాక్షి, హైదరాబాద్: గురుకుల టీచర్ పోస్టుల భర్తీకి చేపట్టిన దరఖాస్తుల ప్రక్రియలో భాగంగా ఈ నెల 4, 6 వరకు ఉన్న దరఖాస్తుల గడువును 9 వరకు పొడిగించినట్లు టీఎస్పీఎస్సీ గురువారం తెలిపిం ది. 9 రకాల నోటిఫికేషన్లకు అభ్యర్థులు 9 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్(పీఈటీ) పోస్టులకు నిర్ణీత అర్హతలుంటే సరిపోతుంది. స్కూల్/కాలేజీ/జిల్లాస్థాయి గేమ్స్/ స్పోర్ట్స్లో పాల్గొన్న సర్టిఫికెట్ ఉండాలన్న నిబంధనను తొలగించింది. బీపీఈడీ చేసిన అభ్యర్థులకు స్పోర్ట్స్ సర్టిఫికెట్ ఉండాలన్న నిబంధనను తొలగించింది. నిర్ణీత మార్కులు కలిగిన డిగ్రీతో పాటు బీపీఈడీ ఉంటే సరిపోతుంది. 40% మార్కులతో ఫిజికల్ ఎడ్యుకేషన్లో గ్రాడ్యుయేట్/3 ఏళ్ల బీపీఈడీ చేసిన వారికి అవకాశం కల్పించింది. ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే డిగ్రీ అభ్యర్థులకు నిర్ణీత విద్యార్హతలు ఉంటే సరిపోతుంది. ప్రత్యేకంగా స్పోర్ట్స్/గేమ్స్లో పాల్గొన్న సర్టిఫికెట్ ఉండాలన్న నిబంధననూ తొలగించింది. క్రాఫ్ట్ టీచర్ పోస్టుల్లో నిర్ణీత విభాగాల్లో టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు (టీసీసీ) చేసిన వారికి, ఆర్ట్ టైలరింగ్ ఎంబ్రాయిడరీలో వొకేషనల్ ఇంటర్మీడియెట్ చేసిన వారికి, టీసీసీ లోయర్ చేసిన వారికి అవకాశం కల్పించింది. పోస్టులన్నింటికి 1999 జూలై 1 తర్వాత పుట్టినవారు, జనరల్ అభ్యర్థులు 1973 జూలై 2కు ముందు జన్మించిన వారు అర్హులు కాదు. తెలుగు, హిందీ, ఉర్దూ టీజీటీ, పీజీటీ పోస్టుల స్క్రీనింగ్ టెస్టు తేదీలను తర్వాత ప్రకటిస్తామని టీఎస్పీఎస్సీ పేర్కొంది. -
స్పోర్ట్స్ సర్టిఫికెట్ ఉంటేనే పీఈటీ పోస్టుల్లో అవకాశం!
- రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల సర్టిఫికెట్లు ఉండాలని నిబంధన - ఆందోళనలో బీపీఈడీ అభ్యర్థులు సాక్షి, హైదరాబాద్: ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (పీఈటీ) పోస్టులకు టీఎస్పీఎస్సీ విధించిన నిబంధన బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (బీపీఈడీ) అభ్యర్థులకు లేనిపోని చిక్కులు తెచ్చిపెట్టింది. బీపీఈడీతో పాటు ఇంటర్ కాలేజీ, రాష్ట్ర, జాతీయ స్థాయి స్పోర్ట్స్లో పాల్గొన్నట్లు ఏదేని సర్టిఫికెట్ ఉంటేనే పీఈటీ పోస్టులకు అర్హులంటూ గురుకులాల్లో పీఈటీ పోస్టులకు టీఎస్పీఎస్సీ తాజా నోటిఫికేషన్లో పేర్కొంది. ఈ నిబంధన కారణంగానే.. బీపీఈడీ చేసినా పీఈటీ పోస్టులకు అనర్హులు అవుతున్నామని అభ్యర్థులు ఆందోళనలో పడ్డారు. ఇంటర్మీడియెట్లో 45% మార్కులు ఉండి, అండర్ గ్రాడ్యుయేట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (యూజీపీడీ), డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (డీపీఈడీ) చేసిన వారు కూడా ఈ పీఈటీ పోస్టులకు అర్హులే. అయితే వారికి పోటీల్లో పాల్గొన్న సర్టిఫికెట్ ఉండాలన్న నిబంధన మాత్రం లేదు. కేవలం బీపీఈడీ చేసిన వారికి మాత్రమే పోటీల్లో పాల్గొన్న పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ఉండాలని నిబంధన విధించడం ఏంటని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) నిబంధనల ప్రకారం పీఈటీ పోస్టులకు యూజీపీడీ, డీపీఈడీ చేసిన వారు మాత్రమే అర్హులు. అయితే అంతకంటే ఎక్కువ అర్హతలైన డిగ్రీ, బీపీఈడీ ఉన్న వారికి కూడా పీఈటీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని సంక్షేమ శాఖలు నిర్ణయం తీసుకున్నాయి. వారికి అవకాశం కల్పిస్తూనే స్పోర్ట్స్ పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ఉండాలన్న నిబంధన విధించడంతో ప్రయోజనం లేకుండాపోయింది. రాష్ట్రంలో యూజీపీడీ, డీపీఈడీ కాలేజీలకంటే బీపీఈడీ కాలేజీలే అధికంగా ఉన్నాయి. సాధారణ డిగ్రీ చదువుకున్న వారు కూడా బీపీఈడీ చేసేందుకు అవకాశం కల్పించారు. దీంతో అనేక మంది బీపీఈడీ చేశారు. వారెవరికీ స్పోర్ట్స్ సర్టిఫికెట్లు లేవు. టీఎస్పీఎస్సీ విధించిన నిబంధనతో బీపీఈడీ అభ్యర్థులు పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం లేకపోవడంతో తీవ్ర ఆవేదనలో పడ్డారు.