breaking news
Special visit
-
రేపు పోలవరం ప్రాజెక్ట్ పరిశీలనకు సజ్జల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం
సాక్షి, అమరావతి: ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలోని 10 మంది సభ్యుల బృందం రేపు పోలవరం ప్రాజెక్ట్ పరిశీలనకు బయల్దేరనుంది. బృందంలో ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, బూడి ముత్యాలనాయుడు, దాడిశెట్టి రాజా, సామినేని ఉదయభాను, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, కాపు రామచంద్రారెడ్డి, గంగుల ప్రభాకర్రెడ్డి ఉన్నారు. చదవండి: కృష్ణా నది కరకట్ట పనులకు రేపు సీఎం జగన్ శంకుస్థాపన -
పెరగనున్న భద్రాద్రి ప్రత్యేక దర్శనం టికెట్ ధర
భద్రాచలం : ఖమ్మం జిల్లాలోని భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో ప్రత్యేక దర్శనం టికెట్ ధర పెంచేందుకు దేవస్థానం అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం రూ.20 ఉన్న ప్రత్యేక దర్శనం టికెట్ ధరను రూ.50 వరకు పెంచేందుకు నిర్ణయించారు. దీనిపై భక్తులు తమ అభిప్రాయూలు తెలపాలంటూ దేవస్థానం అధికారులు ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. దీనిపై భక్తుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నారుు. ఇప్పటి వరకూ రూ.20 టికెట్ తీసుకున్న వారు సుదర్శన ద్వారం నుంచి నేరుగా స్వామివారిని దర్శించుకుని గర్భగుడి నుంచి బయటకు వస్తున్నారు. రూ.150 అర్చన టికెట్ తీసుకున్న భక్తులను మాత్రం గర్భగుడిలోని స్వామి వారి మూలవరుల వరకూ పంపిస్తున్నారు. శని, ఆదివారాల్లోనూ, అదే విధంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న రోజుల్లో ప్రత్యేక దర్శనం పేరుతో రూ.20 కు బదులుగా రూ.100 టికెట్ను విక్రరుుస్తున్నారు. ఒక దర్శనం కోసం ఇలా వేర్వేరు టికెట్ల పేరుతో ఎక్కువ వసూలు చేయడంపై కూడా భక్తులు మండిపడుతున్నారు. దీంతో ప్రత్యేక దర్శనం టికెట్ను ఇక నుంచి రూ.50కు పెంచి, రద్దీ రోజుల్లో కూడా దీనినే విక్రయించేలా దేవస్థానం అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఈ నెల 20న జారీచేసిన ప్రకటనపై 15 రోజులలోపు భక్తులు తమ అభ్యంతరాలు, సూచనలు, సలహాలు అందజేయాలని పేర్కొన్నారు. కానీ ఈ విషయంపై దేవస్థానం అధికారులు తగిన రీతిలో ప్రచారం చేయకపోవడం సరైంది కాదని భక్తులు వాపోతున్నారు. -
'తిరుమలలో ప్రత్యేక దర్శనాలు రద్దు'
-
ఇకపై గంటలోపే శ్రీవారి దర్శనం
సాక్షి, తిరుమల: శ్రీవారి దర్శనానికి వైకుంఠం క్యూకాంప్లెక్స్లో గంటకు 4200 మంది భక్తులకు తగ్గకుండా అన్ని రకాల దర్శనాలను శాస్త్రీయ పద్ధతిలో అనుమతించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు మంగళవారం తెలిపారు. దీనివల్ల రూ.300 టికెట్లను ఆన్లైన్, ఈ-దర్శన్లో టైంస్లాట్లో కేటాయించినప్పటికీ అన్ని క్యూలు ఏకకాలంలోనే కొనసాగే వీలుంటుందని చెప్పారు. కంపార్ట్మెంట్ నుంచి వచ్చిన భక్తుడికి గంటలోపే స్వామి దర్శనం లభించేలా ప్రత్యేకంగా ‘కోరమాండల్ ఇన్ఫోటెక్’ సంస్థ ద్వారా సాఫ్ట్వేర్ రూపకల్పన చేశామన్నారు. శ్రావణమాసంలో ఆగస్టు 8, 9, 10వ తేదీలు, తిరిగి 15, 16, 17వ తేదీల్లో వరుస సెలవు రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు జేఈవో వెల్లడించారు. ఆ రోజుల్లో ప్రొటోకాల్ వీఐపీలను మాత్రమే అంగీకరించనున్నామన్నారు. శ్రీవారి దర్శనానికి 24 గంటలు తిరుమలలో మంగళవారం కూడా భక్తుల రద్దీ కొనసాగింది. సాయంత్రం 6 గంటల వరకు సర్వదర్శనం కోసం మొత్తం 31 కంపార్ట్మెంట్లలో భక్తులు నిండిపోయారు. వీరికి 24 గంటలు, కాలిబాట మార్గాల్లో వచ్చిన వారికి 8 గంటలు, రూ. 300 టికెట్ల భక్తులకు 6 గంటల తర్వాత దర్శనం లభించనుంది. శ్రీవారి హుండీ ఆదాయం సోమవారం రూ. 3.59 కోట్లు, మంగళవారం కూడా రూ.3.47 కోట్లు లభించింది. సాధారణంగా జూలై నెలలో రూ. 3 కోట్లుపైబడిన సందర్భాలు అరుదు. గిరిజనులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం వరంగల్ జిల్లాలోని మారుమూల గ్రామాలు, తండాలకు చెందిన 250 మంది గిరిజనులు మంగళవారం వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. కాకినాడలోని శ్రీ పీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామి ఆధ్వర్యంలో వచ్చిన వీరిని టీటీడీ ప్రత్యేకంగా సుపథం మార్గం ద్వారా ఆలయానికి తీసుకెళ్లారు. కాగా, తిరుపతిలో వకుళమాత ఆలయం నిర్మించేంతవరకు తాను శ్రీవారిని దర్శించుకోనని పరిపూర్ణానంద మరోసారి స్పష్టం చేశారు. మంగళవారం ఆలయ సమీపంలోని ఆస్థాన మండపం వరకు మాత్రమే పరిపూర్ణానంద వచ్చి తిరిగి వెళ్లిపోయారు. తిరుమలకు ‘గంగ’ కోటా పెంపు శ్రీవారి భక్తుల దాహార్తి తీర్చేందుకు తెలుగుగంగ నీటి కోటాను పెంచారు. మంగళవారం నుంచి రోజుకు 50 లక్షల లీటర్ల (5 ఎంఎల్డీ) నీరు సరఫరా చేస్తున్నారు. రోజుకు 10 ఎంఎల్డీ (కోటి లీటర్లు) తెలుగుగంగ నీటిని టీటీడీ అవసరాలకు(తిరుమల, తిరుపతికి) తరలించేందుకు ప్రభుత్వం, టీటీడీ మధ్య గతంలో ఒప్పందం కుదిరింది. జలాశయాలు ఎండిపోవటంతో మంగళవారం నుంచి ఆ మేరకు విడుదల చేస్తున్నారు.