-
హిమాచల్లో పోలింగ్.. దృష్టి మాత్రం ‘కాంగ్రా’పైనే
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రమంతా పోలింగ్ జరుగుతోన్నా.. అందరి చూపు మాత్రం ఒక్క జిల్లాలో ఏ పార్టీకి ఓట్లు పడుతున్నాయన్నదానిపైనే ఉంది. హిమాచల్ రాజకీయాల్లో ఆ జిల్లా అత్యంత కీలకమని ఇప్పటికి ఎన్నో సార్లు నిరూపితమయింది. అక్కడ పాగా వేస్తే అధికారం దాదాపు ఖరారైనట్టే. మూడు దశాబ్దాలుగా ఇదే జరుగుతోంది. అందుకే ఈసారి పార్టీలు అదే రిపీట్ అవుతుందా..? అని వేచి చూస్తున్నాయి. ఈ జిల్లా చుట్టే బీజేపీ డబుల్ డ్రీమ్స్, కాంగ్రెస్ అగ్నిపథ్ స్కీమ్ వ్యతిరేకతను క్యాష్ చేసుకోవాలని భావిస్తున్నాయి. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కాంగ్రా హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో అత్యధిక సీట్లున్న జిల్లా కాంగ్రా. 15మంది ఎమ్మెల్యేలు శాసనసభకు నేతృత్వం వహిస్తున్నారు. 1993 నుంచీ కాంగ్రా జిల్లాలో అధిక సీట్లు గెల్చుకుంటున్న పార్టీయే రాష్ట్రంలో పగ్గాలు చేపడుతోంది. 15 సీట్లలో కనీసం 9 వచ్చినవారు హిమాచల్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నారు. 2017 ఎన్నికల్లో బీజేపీ 11 సీట్లు గెల్చుకుంది. అగ్నిపథ్ బీజేపీకి అగ్ని పరీక్ష కాంగ్రా జిల్లాలో రాజ్పుత్ల ప్రాబల్యం ఎక్కువ. ఓబీసీలు గణనీయ సంఖ్యలో ఉన్నారు. ఏదో ఒకపార్టీ వైపు సూటిగా నిలవటం ఈ జిల్లా ప్రత్యేకత. ప్రధాని మోదీపై రాష్ట్రంలో ఆదరణ ఉన్నా.. స్థానిక బీజేపీ ప్రభుత్వంపై వ్యతిరేకత కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా పెరిగిన ధరలు కమలదళాన్ని ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశం కనిపిస్తోంది. సైన్యంలో ప్రవేశాలకు కొత్తగా తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకం కూడా హిమాచల్ ఎన్నికల్లో ప్రధానాంశం అవుతోంది. కాంగ్రాతోపాటు పక్కనున్న హమీర్పుర్, ఉనా, మండి జిల్లాల నుంచి వేల సంఖ్యలో యువత సైన్యంలో చేరుతుంటారు. ఈ నాలుగు జిల్లాలు కలిపి మొత్తం 35 అసెంబ్లీ సీట్లున్నాయి. అగ్నిపథ్ స్కీమ్తో సైన్యంలో ప్రవేశం తగ్గిపోతుందనే ఆందోళన హిమాచల్ వాసులకు ఉంది. విపక్షాలకిది బలమైన అస్త్రంగా మారింది. పక్కలో తిరుగుబాటు బళ్లెం కాంగ్రాలోని 15 స్థానాలకు 91 మంది పోటీలో ఉన్నారు. అన్ని పార్టీలకూ ఇక్కడ తిరుగుబాటు అభ్యర్థులు సమస్యగా తయారయ్యారు. ఫతేపుర్, ధర్మశాల, ఇందోరా, కాంగ్రా, దెహ్రా స్థానాల్లో బీజేపీకి తిరుగుబాటు అభ్యర్థులు తలనొప్పిగా మారారు. పార్టీ అధ్యకుడు నడ్డా, అధిష్ఠానం ఎంతగా నచ్చజెప్పినా రెబెల్స్ వెనక్కి తగ్గలేదు. మొత్తానికి 1993 నుంచీ ఒకసారి కాంగ్రెస్, మరోసారి బీజేపీకి అధిక సీట్లు ఇస్తూ వస్తోంది కాంగ్రా జిల్లా. అలాగే రాష్ట్రంలో అధికారం మారుతూ వస్తోంది. మరి ఈసారి కాంగ్రా ఎటువైపు మొగ్గుతుందో అని పార్టీలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. ఇదీ చదవండి: హిమాచల్ ప్రదేశ్ పోలింగ్: ఈ పోలింగ్ బూత్ ప్రపంచంలోనే ఎంతో ప్రత్యేకం! 52 మంది ఓటర్లతో ఏకంగా.. -
జిల్లాపై కేసీఆర్ నజర్
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించారు. వచ్చే ఎన్నికల్లో ఆదిలాబాద్ పార్లమెంట్తోపాటు పది అసెంబ్లీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ఆయన పావులు కదుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు టీఆర్ఎస్ కీలక నేతలు హరీష్రావు, ఈటెల రాజేందర్లను కేసీఆర్ రంగంలోకి దింపినట్లు తెలిసింది. జిల్లాకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి టీఆర్ఎస్లో చేరేందుకు సుముఖంగా ఉన్న వివిధ పార్టీలకు చెం దిన సీనియర్ నేతలు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలతో ఇటీవల మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. తెలంగాణకు చెందిన ప్రధాన పార్టీల సీనియర్లు పలువురు బీజేపీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు ఇటీవల ప్రచారం జోరందుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి సుడిగాలి పర్యటన చేస్తుండటం.. తాజాగా 11న ఆయన జిల్లాకు రానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్లో చేరేందుకు సుముఖంగా ఉన్న పలువురిపై పార్టీ అధినేత కేసీఆర్ దృష్టి సారించడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సీనియర్ నేతలకు టీఆర్ఎస్ గాలం ఆదిలాబాద్పై ఆధిపత్యం పెంచుకునేందుకు టీఆర్ఎస్ నాయకత్వం దృష్టి సారించింది. టీడీపీకి కంచుకోటలాంటి జిల్లాపై ఇప్పటికే టీఆర్ఎస్ పట్టు సాధించింది. మొదటి నుంచి టీడీపీని ఆదరించిన జిల్లా ప్రజలు తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఆ పార్టీకి పూర్తిగా దూరమవుతూ వచ్చారు. ఇప్పటికే ఎంపీ వివేక్, ఎమ్మెల్యేలు వేణుగోపాలాచారి, రామన్నలు టీఆర్ఎస్లో చేరారు. ఎంపీ రాథోడ్ రమేష్ టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల్లో చేరతారన్న ప్రచారం జరుగుతున్నా ఆయన మాత్రం కొట్టిపారేస్తున్నారు. ఇక ఎమ్మెల్యేలు గోడం నగేశ్, సుమన్ రాథోడ్లపై కూడా ఈ రకమైన ప్రచారం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మహేశ్వర్రెడ్డి, ఆత్రం సక్కులు ఆ పార్టీలో కొనసాగుతూ తెలంగాణ మంత్రం జపిస్తుండగా, ప్రధాన పార్టీలపై అసంతృప్తిగా ఉన్న ప్రజాప్రతినిధులు, సీనియర్లపై టీఆర్ఎస్ దృష్టి సారించడం రాజకీయవర్గాల్లో తాజా అంశంగా మారింది. ఆదిలాబాద్, మంచిర్యాల, చెన్నూరు, సిర్పూరు, ముథోల్ నియోజకవర్గాల నుంచి టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తుండగా, 2014 ఎన్నికల్లో బోథ్, నిర్మల్, ఖానాపూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి నియోజకవర్గాల్లోను విజయావకాశాలున్న అభ్యర్థులకు గాలం వేసే పనిలో టీఆర్ఎస్ పడింది. ఈ నెలాఖరులోగా చేరికలకు మాట.. 2014 ఎన్నికలు లక్ష్యంగా టీఆర్ఎస్ అడుగులు వేస్తోంది. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసేందుకు ఇటీవలే శిక్షణ తరగతులు నిర్వహించిన ఆ పార్టీ జిల్లాలో మరో ఐదు నియోజకవర్గాల్లోను పాగా వేసేందుకు పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలోనే నిర్మల్, బోథ్, బెల్లంపల్లి, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లో వివిధ పార్టీలకు చెందిన సీనియర్ నాయకులు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో మంతనాలు జరుపుతోంది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైతం ప్రజల్లో మంచి పట్టున్న ఓ సీనియర్ నేతతో ఇటీవలే మాట్లాడినట్లు తెలిసింది. నిర్మల్లో ఇప్పటికే పార్టీ ఇన్చార్జి ఉన్నా... ఆయనకు నచ్చచెప్పి పార్టీలో చేర్చుకునే విషయమై టీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్రావు కూడా మంతనాలు జరిపినట్లు చెప్తున్నారు. ఓ వైపు కేసీఆర్, మరోవైపు హరీష్రావు, ఈటెల రాజేందర్ జిల్లాకు చెందిన వివిధ పార్టీలకు చెందిన సీనియర్లతో మాట్లాడటం చర్చనీయాంశం అవుతోంది. ఇదిలా వుండగా 2013 డిసెంబర్ మొదటి వారం నాటికి కాంగ్రెస్-టీఆర్ఎస్లు, బీజేపీ-టీడీపీ మధ్య పొత్తులు ఉంటాయన్న ప్రచారం ఉంది. అయితే తాజాగా ఏ పార్టీలకు పొత్తుల విషయమై స్పష్టత లేకపోవడంతో విడివిడిగానే పోటీ చేసేందుకు సమాయత్తమవుతున్నాయి. ప్రజాక్షేత్రంలోకి ఒంటరిగానే వెళ్లేందుకు సిద్ధమైన నేపథ్యంలో టీఆర్ఎస్ పొత్తుల ప్రసక్తి లేకుండా... అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో పడింది. జిల్లాకు చెందిన పలువురికి ‘గులాబి’ కండువా వేసేందుకు ఈ నెలాఖరుకల్లా గడువు పెట్టినట్లు సమాచారం.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
వరల్డ్కప్ సెలక్టయ్యాడు.. వరుసగా రెండో మ్యాచ్లో గోల్డెన్ డక్
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (05-05-2024)
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
తప్పక చదవండి
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement