breaking news
snehalatha reddy
-
టాలీవుడ్ హీరోయిన్కు గ్లామన్ మిసెస్ ఇండియా- 2024 అవార్డు
టీవీ యాంకరింగ్ చేసి, నిన్ను చూస్తూ సినిమాతో హీరోయిన్గా ప్రేక్షకుల ముందుకొచ్చిన నటి హేమలత రెడ్డి. తాజాగా గ్లామన్ మిసెస్ ఇండియా 2024 అవార్డు -బెస్ట్ టాలెంట్- బెస్ట్ ఫోటోజెనిక్ ఉప శీర్షికల మీద అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్లోని గచ్చిబౌలిలో గ్రాండ్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు.ఈ సందర్భంగా హీరోయిన్ హేమలత రెడ్డి మాట్లాడుతూ ..' నేను ఎప్పటి నుండో ఇండస్ట్రీలో ఉన్నా. జెమిని టీవీ లో ఒక యాంకర్గా మొదలుపెట్టి సీరియల్స్ చేశాను. ఆ తరువాత ప్ప్రొడ్యూసర్ కావాలనుకుని ఒక సినిమా తీశా. కోవిడ్ టైంలో ఫ్యాషన్ సైడ్ ట్రై చేశా. మలేషియా కాంపిటీషన్లో గెలిచాను. మన మాతృ భాష తెలుగులోనే నేను అక్కడ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చా. అటు నటన.. అలాగే ఇటు గ్లామర్ రెండు కష్టమైన పనులే. ఆడవారు గ్లామర్ మాత్రమే కాదు.. ప్రతి రంగంలో ముందుండాలి. ఆఫర్ వాస్తే ఎలాంటి రోల్స్ అయిన చేస్తా.' అని అన్నారు. -
'అల్లు అర్జున్కు ప్రమాదం జరగలేదు'
-
'అల్లు అర్జున్కు ప్రమాదం జరగలేదు'
హైదరాబాద్: హీరో అల్లు అర్జున్కు ప్రమాదం జరిగినట్లు వచ్చిన వార్తలను ఆయన తండ్రి అల్లు అరవింద్ ఖండించారు. బన్నీకి ఎలాంటి ప్రమాదం జరగలేదని, అభిమానులు కంగారు పడాల్సిన పనిలేదన్నారు. పుకార్లను నమ్మవద్దని ఆయన కోరారు. అయితే అల్లు అర్జున్ భార్య స్నేహలతా రెడ్డికి శస్త్ర చికిత్స కోసమే సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రికి వచ్చినట్లు అల్లు అరవింద్ మంగళవారం వివరణ ఇచ్చారు. సాయంత్రంలోగా స్నేహలతా రెడ్డిని ఆస్పత్రి డిశ్చార్జ్ చేస్తారని తెలిపారు. కాగా రెండేళ్ల క్రితం కారు ప్రమాదంలో ఆమె గాయపడిన విషయం తెలిసిందే.