breaking news
sms alerts
-
ఎస్ఎంఎస్ల పేరుతో రూ.3,388 కోట్ల వసూలు
టెలికాం కంపెనీలు తమ ప్రమోషన్ల కోసం రోజూ వందల కొద్దీ మెసేజ్లను ఉచితంగా పంపిస్తుంటే, మన సొమ్ముకు భద్రతనిచ్చే బ్యాంకులు మాత్రం ప్రతి ఎస్ఎంఎస్కు ఛార్జీలు వసూలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు కస్టమర్లను ఆకర్షించడానికి ఉచితంగా అందించిన సేవలే ఇప్పుడు బ్యాంకుల ఆదాయ వనరులుగా మారాయి. గడిచిన మూడు ఆర్థిక సంవత్సరాల్లో (2023–25) కేవలం 11 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎస్ఎంఎస్ సేవల ద్వారా ఏకంగా రూ.3,388 కోట్లు వసూలు చేశాయని పార్లమెంట్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.భారీగా వసూళ్లు: టాప్ 6 బ్యాంకుల జాబితాఎస్ఎంఎస్ అలర్ట్ల పేరుతో అత్యధికంగా వసూలు చేసిన బ్యాంకుల్లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అగ్రస్థానంలో ఉంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి:బ్యాంక్వసూలు చేసిన సొమ్ము (రూ. కోట్లలో)యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా1,188.14కెనరా బ్యాంక్506.28పంజాబ్ నేషనల్ బ్యాంక్360.45సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా308.72ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్204.89బ్యాంక్ ఆఫ్ బరోడా202.42 గమనిక: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఎస్బీఐ 2020 నుంచి ఎస్ఎంఎస్ సేవలపై ఛార్జీలను రద్దు చేయడం గమనార్హం.ఉచితం నుంచి ఛార్జీల వైపు.. ఎందుకు?ప్రారంభంలో డిజిటల్ బ్యాంకింగ్ను ప్రోత్సహించడానికి బ్యాంకులు ఎస్ఎంఎస్ అలర్ట్లను ఉచితంగా అందించాయి. అయితే, ప్రతి ఎస్ఎంఎస్కు టెలికాం కంపెనీలకు బ్యాంకులు కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఈ వ్యయాన్ని కస్టమర్ల నుంచే వసూలు చేయడం బ్యాంకులు ప్రారంభించాయి. ట్రాయ్ నిబంధనల ప్రకారం, కమర్షియల్ ఎస్ఎంఎస్ల నియంత్రణకు ‘డిజిటల్ లెడ్జర్ టెక్నాలజీ’(డీఎల్టీ) అమలులోకి వచ్చింది. దీనివల్ల బ్యాంకులపై నిర్వహణ భారం పెరిగింది. వడ్డీ రేట్ల తగ్గింపు వల్ల ఏర్పడే ఆదాయ లోటును భర్తీ చేసుకునేందుకు బ్యాంకులు సర్వీస్ ఛార్జీలపై దృష్టి పెట్టాయి.కేవలం ఎస్ఎంఎస్లే కాదు.. ఏటీఎంలు కూడా!గతంలో ఉచితంగా లభించి ప్రస్తుతం భారంగా మారిన సేవల్లో ఏటీఎం లావాదేవీలు ప్రధానమైనవి. ఒకప్పుడు ఎన్నిసార్లైనా ఉచితంగా డబ్బులు డ్రా చేసుకునే వెసులుబాటు ఉండేది. ఇప్పుడు పరిమితి దాటితే ప్రతి లావాదేవీకి అదనంగా ఛార్జీలు (జీఎస్టీ అదనం) చెల్లించాల్సి వస్తోంది. ఖాతాలో మినిమం బ్యాలెన్స్ లేకపోతే జరిమానాల రూపంలో బ్యాంకులు భారీగా వసూలు చేస్తున్నాయి. ఏటా డెబిట్ కార్డ్ మెయింటెనెన్స్ పేరుతో రూ.150 నుంచి రూ.500 వరకు బ్యాంకులు కట్ చేస్తున్నాయి. బ్రాంచ్కు వెళ్లి నగదు జమ చేసినా లేదా విత్డ్రా చేసినా నెలకు నిర్ణీత పరిమితి దాటితే ఛార్జీలు వర్తిస్తున్నాయి.సామాన్యుడి పొదుపుపై బ్యాంకులు ఈ స్థాయిలో ఛార్జీలు వసూలు చేయడంపై సర్వత్రా అసహనం వ్యక్తమవుతోంది. ఒకవైపు డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తూనే, మరోవైపు భద్రత కోసం ఇచ్చే ఎస్ఎంఎస్లపై కూడా భారం మోపడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎస్బీఐ బాటలోనే మిగిలిన బ్యాంకులు కూడా కనీసం ప్రాథమిక ఎస్ఎంఎస్ అలర్ట్లను ఉచితంగా అందిస్తే సామాన్యులకు ఊరట లభిస్తుంది.ఇదీ చదవండి: ప్రేమలో మునిగి తేలుతూ.. వ్యాపారం పెంచుతూ.. -
వరుసగా 200 మెసేజ్లు.. రూ.10 లక్షలు మాయం
బెంగళూరులో ఓ వ్యాపారవేత్త సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి రూ.10 లక్షలు పోగొట్టుకున్న ఉదంతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. కొన్ని గంటల వ్యవధిలోనే 200కు పైగా మెసేజ్లు రావడంతో బాధితుడు నిర్ఘాంతపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు కింది విధంగా ఉన్నాయి.బెంగళూరులోని హెచ్ఆర్బీఆర్ లేఅవుట్కు చెందిన 56 ఏళ్ల భువన్ (పేరు మార్చాం) అనే వ్యాపారవేత్తకు ఫిబ్రవరి 4వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి ఫిబ్రవరి 5వ తేదీ మధ్యాహ్నం 1 గంట మధ్య కాలంలో తన మొబైల్కు వరుసగా ఎస్ఎంఎస్ హెచ్చరికలు రావడం మొదలైంది. ఏవో ఒకటి రెండు కాదు, ఏకంగా 200కు పైగా సందేశాలు రావడంతో ఆయన ఆందోళనకు గురై వాటిని తనిఖీ చేశారు.ఖాతా ఖాళీ చేసిన సైబర్ కేటుగాళ్లువచ్చిన సందేశాలను పరిశీలించగా అవి ఓటీపీలు, బ్యాంకు ఖాతా నుంచి నగదు డెబిట్ అయినట్లు వచ్చిన అలర్ట్లని ఆయన గుర్తించారు. తన ప్రమేయం లేకుండానే రెండు బ్యాంకు ఖాతాల నుంచి అనధికారికంగా లావాదేవీలు జరిగినట్లు గ్రహించిన భువన్ వెంటనే బ్యాంకు అధికారులను సంప్రదించారు. మొదటి ఖాతా నుంచి రూ.26,000 డెబిట్(ఉపసంహరణ) అయ్యాయి. రెండో ఖాతా నుంచి రూ.9.6 లక్షలకు పైగా నగదు మాయమైంది.పోలీసుల దర్యాప్తుఈ ఘటనపై బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం, బాధితుడు తెలియకుండానే మోసగాళ్లు పంపిన ఏదైనా అపాయకరమైన ఏపీకే ఫైల్ లింక్పై క్లిక్ చేసి ఉండవచ్చని భావిస్తున్నారు. ‘సైబర్ నేరగాళ్లు పంపిన మాల్వేర్ లింక్ లేదా ఏపీకే ఫైల్ను క్లిక్ చేయడం ద్వారా బాధితుడి ఫోన్ వారి నియంత్రణలోకి వెళ్లి ఉండవచ్చు. దీనివల్ల బాధితుడికి తెలియకుండానే ఓటీపీలను యాక్సెస్ చేస్తూ నగదును దారి మళ్లించి ఉంటారు’ అని పోలీస్ అధికారి చెప్పారు.జాగ్రత్త వహించాల్సిన అంశాలుతెలియని వ్యక్తులు పంపే వాట్సాప్ సందేశాలు లేదా ఎస్ఎంఎస్లలోని లింక్లను క్లిక్ చేయవద్దు.అపరిచిత సోర్సెస్ నుంచి ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేయకండి.బ్యాంకు ఖాతా నుంచి అనుమానాస్పద లావాదేవీలు జరిగిన వెంటనే 1930 హెల్ప్లైన్ నంబర్కు ఫిర్యాదు చేయాలి.ఇదీ చదవండి: బంగారం ధరల్లో స్వల్ప ఊరట -
త్వరలో 25 వేల మందికి ఐటీ మెసేజ్లు
న్యూఢిల్లీ: 2025–26 అసెస్మెంట్ ఇయర్కి (ఏవై) గాను దాఖలు చేసిన ఆదాయ పన్ను రిటర్నుల్లో విదేశీ ఆస్తుల వివరాలను వెల్లడించని వారికి ఆదాయ పన్ను శాఖ త్వరలో ఎస్ఎంఎస్లు/ఈ–మెయిల్స్ పంపించనుంది. చట్టపరమైన చర్యలను నివారించేందుకు 2025 డిసెంబర్ 31లోగా సవరించిన ఐటీఆర్ను దాఖలు చేయాలంటూ తొలి దశలో 25,000 ‘హై–రిస్్క’ కేసులుగా పరిగణిస్తున్న వారికి వీటిని పంపించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రెండో దశలో డిసెంబర్ మధ్య నుంచి మిగతా కేసులను కూడా పరిగణనలోకి తీసుకోనున్నట్లు వివరించాయి. ఆటోమేటిక్ ఎక్సే్చంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ (ఏఈఓఐ) కింద విదేశీ జ్యూరిస్డిక్షన్ల నుంచి వచి్చన సమాచారాన్ని బట్టి, విదేశాల్లో ఆస్తులున్నప్పటికీ ఆ వివరాలను వెల్లడించని నిర్దిష్ట ట్యాక్స్పేయర్లకు డిపార్ట్మెంట్ గతేడాది కూడా ఇలాగే ఎస్ఎంఎస్లు, ఈమెయిళ్లు పంపించింది. దీంతో నోటీసులు వచ్చిన వారు, రాని వారు మొత్తం మీద 24,678 మంది రూ. 29,208 కోట్ల విలువ చేసే విదేశీ అసెట్స్ వివరాలను పొందుపరుస్తూ సవరించిన ఐటీఆర్లను దాఖలు చేశారు. ఈ ఏడాది జూన్ వరకు ఆదాయ పన్ను శాఖ 1,080 కేసులను మదింపు చేసి, రూ. 40,000 కోట్లకు సంబంధించి డిమాండ్ నోటీసులు పంపింది. ఇప్పటికే ఢిల్లీ, ముంబై, పుణే తదితర నగరాల్లో పలు సోదాలు నిర్వహించింది. -
అన్ని ఎస్ఎంఎస్లు ఇక రావా? ఆర్బీఐని ఆశ్రయించిన బ్యాంకులు
కొన్ని ఆన్లైన్ లావాదేవీలకు (Digital transactions) సంబంధించిన ఎస్ఎంఎస్ సందేశాలను (SMS Alerts) వినియోగదారులకు పంపడాన్ని బ్యాంకులు భవిష్యత్తులో నిలిపేయవచ్చు. రూ.100 లోపు లావాదేవీలకు ఎస్ఎంఎస్ అలర్టులు పంపడాన్ని నిలిపివేసేందుకు అనుమతినివ్వాలని కోరుతూ బ్యాంకులు ఆర్బీఐ (RBI) ని ఆశ్రయించాయి.ఆన్ లైన్లో ముఖ్యంగా యూపీఐ ద్వారా పదీ.. ఇరవై.. ఇలా చిల్లర పేమెంట్లు పెరిగిపోయాయి. వీటికి సంబంధించిన ఎస్ఎంఎస్ నోటిఫికేషన్లు వినియోగదారులను ముంచెత్తుతున్నాయి. దీంతో అలర్ట్ వ్యవస్థ మందగమనానికి దారితీసిందని, దీంతో కొన్నిసార్లు, కస్టమర్లు పెద్ద లావాదేవీలకు సంబంధించిన సందేశాలను కూడా కోల్పోతున్నారని సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ ఎకనమిక్స్ టైమ్స్ కథనం పేర్కొంది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులతో అంతర్గత సంప్రదింపులు జరిపిన తరువాత గత నెలలో ఆర్బీఐకి ఈ విజ్ఞప్తి చేశామని ఓ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ చెప్పారు. ఎస్ఎంఎస్లు నిలిపేసిన పక్షంలో ప్రతిపాదిత ప్రత్యామ్నాయ రక్షణలు ఇంకా వినియోగదారులకు తెలియజేయాల్సి ఉందని మరొక బ్యాంకింగ్ అధికారి తెలిపారు. ఒక వేళ రూ.100 పరిమితి ఉన్న తక్కువ విలువ లావాదేవీల అలర్టులు కావాలంటే ఎస్ఎంఎస్లు కాకుండా బ్యాంకింగ్ యాప్లు లేదా ఈమెయిల్స్ లో నోటిఫికేషన్ల ద్వారా వాటిని పొందవచ్చని వివరించారు.ప్రస్తుతం ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. బ్యాంకులు అన్ని ఎలక్ట్రానిక్ లావాదేవీలపై ఎస్ఎంఎస్ అలర్డుల కోసం కస్టమర్లతో నుంచి నమోదు చేయించుకోవాలి. అయితే ఈమెయిల్ అలర్టులు ఐచ్ఛికం. అంటే ఎస్ఎంఎస్లు ఆటోమేటిక్గా వెళ్తాయి. కానీ ఈమెయిల్ అలర్ట్ లు ఎంచుకున్న వారికి మాత్రమే వెళతాయి.ఒక్క ఎస్ఎంఎస్ పంపడానికి సుమారు 20 పైసలు ఖర్చవుతుంది. ఇది సాధారణంగా వినియోగదారుల మీదే పడుతుంది. కానీ కొన్ని బ్యాంకులు మాత్రం ఈ ఖర్చును తామే భరిస్తున్నాయి. అదే ఈమెయిల్ అలర్టులకు అయితే పెద్దగా ఖర్చు ఉండదు.


