sitarama wedding
-
న్యూజెర్సీ, పార్సిప్పనీలో వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం
న్యూజెర్సీలోని పార్సిప్పనీలో శ్రీ సీతారాముల కల్యాణం రమణీయంగా, కమనీయంగా సాగింది. న్యూయార్క్లోని శ్రీ రంగనాథ ఆలయం నుంచి స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను తీసుకొచ్చారు. వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ ఊరేగింపుగా కల్యాణ మండపానికి స్వర్ణ సింహాసనంపై స్వామివారిని, అమ్మవారిని ఆసీనులను చేశారు. కళ్యాణం సందర్భంగా భక్తులు చేయించిన అభరణాలను వధూవరులకు ధరింపజేశారు. రాముల వారికి, సీతమ్మ వారికి పట్టు వస్త్రాలు, తాళిబొట్టు, మెట్టలు, ఆభరణాలు, ముత్యాల తలంభ్రాలను సమర్పించారు. మేళంతో ఊరేగింపుగా పట్ట వస్త్రాలను తీసువచ్చారు. సీతమ్మ, రామయ్యల ఎదుర్కోలు ఘట్టం కనులారా తిలకించిన భక్తులు ఆనందపరవశులయ్యారు. భక్తజనంతో న్యూజెర్సీలో పండగ వాతావరణం నెలకొంది. సంస్కృతి, సంప్రదాయలకు అనుగుణంగా వివాహ వ్యవస్థపై కృష్ణ దేశిక జీయర్ స్వామిజీ చేసిన వ్యాఖ్యానం విశేషంగా ఆకట్టుకుంది. దండలు మార్చుకునే క్రమంలో అర్చకులు నృత్య ప్రదర్శన చేసి సంప్రదాయాన్ని గుర్తు చేశారు. మరిన్నిNRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి!అనంతరం గణపతి పూజ, విశ్వక్సేన ఆరాధన, మహాసంకల్పం, మంగళఅష్టకాలు, కన్యాదానం, తలంబ్రాల ఘట్టం, పూలదండల మార్పు, మహా హారతి, నివేదన తదితర ఘట్టాలు శాస్త్రోక్తంగా జరిగాయి. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, భక్తుల జయజయధ్వానాల నడుమ జగదభిరాముడు జానమ్మను మనువాడారు. కోదండ రాముడు సీతమ్మ మెడలో మూడుముళ్లు వేసిన వేళ, రఘునందనుడి దోసిట తలంబ్రాలు ఆణిముత్యాలే నీలపురాశులుగా, జగన్మాత లోకపావని సీతమ్మ దోసిట అక్షింతలు మణిమాణిక్యాలై సాక్షాత్కారించిన వేళ కల్యాణ ప్రాంగణం భక్తిపారవశ్యంతో ఓలలాడింది.ఈ సీతారాముల కాళ్యానికి పార్సిప్పనీకి మేయర్ జేమ్స్ బార్బెరియోతో పాటు 300 మందికి ప్రవాస తెలుగువారు సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేశారు. దాదాపు అందరూ సంప్రదాయబద్ధంగా తయారై కళ్యాణంలో పాల్గొన్నారు. 72 పైగా జంటలు ఈ కళ్యాణ మహోత్సవంలో పాలు పంచుకున్నాయి. ఈ కల్యాణాన్ని ప్రవాసులు కన్నులారా వీక్షిం చి తరించారు. ఈ ఉత్సవం.. భద్రాచల రాముల వారి కళ్యాణమహోత్సవాన్ని తలపించింది. కల్యాణం అనంతరం ఉత్సవ మూర్తులను భక్తులు దర్శనం చేసుకున్నారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు, అక్షింతలు అందజేశారు. -
రాములోరి పెళ్లికి కోటి తలంబ్రాలు
గోకవరం: భద్రాచలం, ఒంటిమిట్ట ఆలయాల్లో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణానికి ఏటామాదిరిగా కోటి తలంబ్రాలు సిద్ధం చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం అచ్యుతాపురంలో కోరుకొండ శ్రీకృష్ణచైతన్య సంఘం అధ్యక్షుడు కళ్యాణం అప్పారావు తన ఎకరం పొలంలో కోటి తలంబ్రాల కోసం ధాన్యం పండించారు. శుక్రవారం ఈ పంట కోతలు కోయించారు. శ్రీరాముని వేషధారణతో పాటు జాంబవంతుడు, ఆంజనేయుడు, సుగ్రీవుడు, అంగదుడు వేషధారణలో భక్తులు రామనామం జపిస్తూ కోతల్లో పాల్గొన్నారు. కళ్యాణం అప్పారావు మాట్లాడుతూ.. వచ్చే ఏడాది భద్రాచలం, ఒంటిమిట్టల్లో నిర్వహించే సీతారాముల కళ్యాణానికి తలంబ్రాల కోసం సుమారు 800 కేజీల ధాన్యం అవసరం అవుతుందన్నారు. ఇక్కడ పండించిన ధాన్యాన్ని ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాల్లోని సుమారు 3 వేల మంది భక్తులకు పంపించి గోటితో ఒడ్లు ఒలిపించి తలంబ్రాలు సిద్ధం చేయడం జరుగుతుందన్నారు. కొన్నేళ్లుగా ఆయన ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. -
రాములోరి పెళ్లికి కేసీఆర్!
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఎప్పటి నుంచో ఊరిస్తున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జిల్లా పర్యటన ఎట్టకేలకు ఖరారైంది. 28న భద్రాచలంలో జరిగే సీతారాముల కల్యాణ మహోత్సవానికి సీఎం హాజరు కానున్నారు. దీనిపై మంగళవారం హైదరాబాద్లోని తన కార్యాలయంలో సీఎం అధికారులు, జిల్లాకు చెందిన ముఖ్య నేతలతో చర్చించారు. గత మూడునెలలుగా వాయిదా పడుతూ వచ్చిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవ పనులను పూర్తి చేయాలని సీఎం భావిస్తున్నట్లు తెలుస్తోంది. సీతారాముల కల్యాణ మహోత్సవానికి ఒకరోజు ముందే ముఖ్యమంత్రి జిల్లాకు చేరుకునే అంశంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. 27న సీఎం జిల్లాకు విచ్చేసి మణుగూరులో నిర్మించనున్న విద్యుత్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయాలని, అలాగే ఖమ్మం, కొత్తగూడెం, పాల్వంచ ప్రాంతాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహించే అంశంపై సీఎం కార్యాలయ అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి.. సీఎం కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి భద్రాచలం సీతారామచంద్రస్వామి కల్యాణ మహోత్సవంలో పాల్గొంటారు. ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారు. సీఎం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో, ముఖ్యంగా భద్రాచలంలో పర్యటించనుండటంతో పోలీస్ యంత్రాంగం భారీ బందోబస్తుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. అరుుతే సీఎం పర్యటన అధికారికంగా మాత్రం మరో రెండు రోజుల్లో ఖరారు కానుంది. కల్యాణ మహోత్సవానికి ఒకరోజు ముందుగా రావడమా..? కల్యాణ మహోత్సవం పూర్తయ్యాక మరుసటి రోజు జిల్లాలో పర్యటించడమా..? అన్న అంశం సైతం ఇంకా తేలలేదు. ఈసారి మాత్రం సీఎం జిల్లా పర్యటన దాదాపు ఖాయమని, ఈనెల 25 తర్వాత జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ సైతం తొలగిపోనుండటంతో సీఎం పర్యటనకు సాంకేతికంగా ఎటువంటి అవరోధాలు ఉండకపోవచ్చునని అధికారులు భావిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సైతం తొలిసారిగా ముఖ్యమంత్రి హోదాలో జిల్లాకు వస్తున్న కేసీఆర్కు భారీ స్వాగతం పలికేందుకు సమాయత్తం అవుతున్నారుు. పలుమార్లు వారుుదా.. జిల్లాలో సీఎం పర్యటనకు సంబంధించి గత మూడునెలలుగా పలు తేదీలు ఖరారైనప్పటికీ వివిధ కారణాల వల్ల చివరి నిముషంలో వాయిదా పడుతూ వస్తోంది. జనవరి- ఫిబ్రవరి నెలల్లోనే జిల్లాకు సీఎం వస్తారని విస్తృతంగా ప్రచారం జరిగింది. ఇందుకు అనుగుణంగానే అధికారులు సైతం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. జిల్లా అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేశారు. ఒక దశలో తేదీలు సైతం ఖరారయ్యాయి. సీఎం ఢిల్లీ పర్యటన, ఆదిలాబాద్ జిల్లాలో గిరిజ నుల జాతర, ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలకు సం బంధించి కోడ్ అమల్లోకి రావ డం వంటి కారణాలతో సీఎం పర్యటన వాయి దా పడుతూ వచ్చింది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు, సీతారాముల కల్యాణ మహోత్సవం