breaking news
Siardie bill
-
ప్రజా సమస్యలు చర్చకు రానివ్వలేదు
అసెంబ్లీలో ప్రభుత్వ తీరుపై జగన్ ఆగ్రహం ప్రతిపక్షాన్ని మాట్లాడనీయకుండా సర్కారు అడ్డుకుంది ప్రాధాన్య అంశాలపై నోటీసులు ఇచ్చినా చర్చకు రానీయ లేదు సభలో వారే తీర్మానాలు పెట్టుకుని వారే మాట్లాడుకున్నారు సీఎం ముగింపు ప్రసంగంపై వివరణ కోరడానికీ అవకాశమివ్వలేదు రుణ మాఫీలో తప్పులు తెలుసుకుని సరిదిద్దాలన్న ఆలోచనే లేదు సీఆర్డీఏ బిల్లు పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయొద్దంటే.. రాజధానికి వైఎస్సార్సీపీ వ్యతిరేకమని బురదజల్లుతున్నారు అసెంబ్లీ శీతాకాల సమావేశాల నిర్వహణ తీరుపై ప్రతిపక్ష నేత విమర్శలు హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రజా సమస్యలపై చర్చించకుండా ప్రభుత్వం దాటవేసిందని ప్రతిపక్ష నాయకుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. సమావేశాల్లో ప్రతి పక్షాన్ని మాట్లాడనీయలేదని ఆయన ఆరోపించా రు. మంగళవారం శాసనసభ నిరవధికంగా వా యిదాపడిన అనంతరం జగన్మోహన్రెడ్డి తన చాంబర్లో మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రతి పక్షం గొంతెత్తితే ప్రజా సమస్యలు చర్చకొస్తా యి, ప్రభుత్వ వైఫల్యాలు, లోపాలు బయటపడతాయి. వాటిని కప్పిపుచ్చుకునేందుకే ప్రతిపక్షా న్ని మాట్లాడనీయకుండా అధికారపక్షం అడ్డుపడింద’’ని విమర్శించారు. అత్యంత ప్రాధాన్యం ఉన్న సమస్యలపై చర్చ కోసం తాము నోటీసులు ఇస్తే వాటిలో ఆరింటిని చర్చకు అవకాశం రాకుం డాచేశారని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. కాంట్రాక్టు ఉద్యోగులు, కార్మికుల క్రమబద్ధీకరణ, అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు, డ్వాక్రా మహిళల రుణ మాఫీ, పోలవరం ప్రాజెక్టు, శ్రీశై లం జలాశయం వివాదం, సామాజిక కార్యకర్తల నియామకం వంటి అంశాలు సభలో చర్చించకుండానే ప్రభుత్వం సభను వాయిదా వేసుకుందని దుయ్యబట్టారు. సభలో వారే తీర్మానాలు పెట్టుకుని వారే మాట్లాడుకున్నారని.. ఇది వరకు సభలో వచ్చిన తీర్మానాన్నే రెండోసారి కూడా పెట్టారని జగన్ తప్పుపట్టారు. క్లారిఫికేషన్లకూ అవకాశమివ్వరా?: సభ చివ రిరోజున సీఎం చంద్రబాబు ముగింపు ప్రసం గం పూర్తయ్యాక, కనీసం వివరణ కోరడానికి కూడా ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వలేదని ఆయ న పేర్కొన్నారు. ‘‘చంద్రబాబు తన ప్రసంగంలో నిర్మొహమాటంగా అబద్ధాలు చెప్పుకుంటూ పో యారు. అవి అబద్ధాలు అని చెప్పడానికి కూడా మాకు అవకాశం ఇవ్వలేదు. ఆయన గంట సేపు ముగింపు ప్రసంగం చేస్తే, ఆ తర్వాత కనీసం ప్రతిపక్ష నేతగా నాకు పది నిమిషాలైనా అవకాశమివ్వలేదు. మామూలుగా అయితే స్పీకర్కు పేపర్లు ఇవ్వాలి. అవి ఇవ్వకుండానే వెళ్లిపోయారు.’’ అని జగన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. కేస్ స్టడీస్ చెప్పాలంటే వేలకు వేలు..: ‘‘రుణ మాఫీకి సంబంధించి ఇద్దరు లేదా ముగ్గురు రైతు ల కేస్ స్టడీకి సంబంధించి మాత్రమే మా ప్రసంగంలో చెప్పడానికి ఆస్కారం కల్పిస్తారు. చెప్పాలంటే వేలకు వేలున్నాయి. అవన్నీ చెప్పలేం కదా. అందుకే రెండు ప్రముఖ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలనే మేం ఈ సందర్భంగా ఉటంకించాం. బాబుకు కేస్ స్టడీ అంటే ఏంటో రియల్ స్టడీ అంటే ఎంటో తెలియదు. ఈ మాఫీ వివరాలను కూడా మేం ప్రభుత్వ వెబ్సైట్ల నుంచే తీసుకున్నాం. అవి మేము సృష్టించినవి ఎంత మాత్రం కావు’’ అని జగన్ వివరించారు. ఆత్మహత్యలకు సంబంధించి తాము మొత్తం 86 పేర్లతో ఉన్న జాబితాను స్పీకర్కు అందజేశామం టూ ఆ జాబితాలను విలేకరులకు అందించారు. ‘‘రుణ మాఫీ విషయంలో ఎలాంటి తప్పులు జరిగాయని జగన్ చెబుతున్నారు.. వాటిని తెలుసుకుని సవరిద్దాం.. అని ప్రభుత్వం ఆలోచిం చడం లేదు. ఎంత సేపూ రుణ మాఫీకి కేటాయించిన 4,664 కోట్ల రూపాయలలోపే అంతా సర్దుబాటు చేయాలని చూస్తున్నారు’’ అని విమర్శించారు. మొత్తానికి చంద్రబాబు మాఫీ వ్యవహారం అంతా ‘పౌడర్ కోటింగ్’ (రంగుపూయడం) లాగా చేస్తున్నారని, అబద్ధాలు చెప్పడం వాటిని సమర్థించుకోవడానికే సరిపోతోందని చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయొద్దంటే ఎదురుదాడా?: సీఆర్డీఏ బిల్లులో రైతులకు ఎంతి స్తారు? కౌలు రైతులకు ఎంతిస్తారు? అనే అంశాలను పొందుపర్చలేదేమని ప్రశ్నిస్తూ తాము లోపాలను ఎత్తి చూపితే వాటికి సమాధానం చెప్పకుండా.. రాజధానిని తాము వ్యతిరేకిస్తున్నామని బురద జల్లుతూ చంద్రబాబు ఎదురుదాడికి దిగారని జగన్ మండిపడ్డారు. ‘‘రాజధానికి రూపొందిస్తున్న మాస్టర్ ప్లాన్ ఏమిటి? జోనింగ్ ఎలా చేస్తారు? అనే ప్రశ్నలకు కూడా సమాధా నం రాలేదన్నారు. ‘ల్యాండ్ పూలింగ్’ పేరుతో ‘ల్యాండ్ ఫూలింగ్’ చేయొద్దని, రైతుల భూముల తో ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయొ ద్దని చేసిన సూచనను పట్టించుకోలేదన్నారు. ప్రభుత్వ భూములున్న మంగళగిరి, వినుకొండ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవచ్చు గానీ రైతుల భూమిలో వారికి అరకొర లాభాలు ఇచ్చి మిగతావి నువ్వు తీసుకోవడం ఏమిటని తాము అడిగితే జవాబు లేదన్నారు. యాభై వేల ఎకరా ల్లో 25 వేల ఎకరాలు కనీస అవసరాలకు పోతే 12 వేల ఎకరాలు రైతులకు ఇస్తామంటున్నారు, ఇక మిగిలిన 13 వేల ఎకరాలు నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికే కదా అని ప్రశ్నిస్తే.. వైఎస్సార్సీపీ రాజధానికి వ్యతిరేకమని ముద్ర వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. సభ లో మాట్లాడ్డానికి తమ వారు ఇద్దరికి అవకాశం ఇస్తే అధికారపక్షం నుంచి ఆరుగురితో మాట్లాడించి తమను తిట్టిస్తున్నారని తప్పుబట్టారు. అంతా ఆత్మస్తుతి - పరనింద లాగా సాగిందన్నా రు. ‘‘మంగళవారం చంద్రబాబు గంట సేపు ముగింపు ప్రసంగం చేస్తే వివరణలు అడగడానికి నాకు పది నిమిషాలు కూడా ఇవ్వలేదు. చం ద్రబాబు ప్రసంగం ఎంత సుదీర్ఘంగా సాగిందం టే బీజేపీ నేత విష్ణుకుమార్రాజు గాఢంగా నిద్రపోయారు’’ అని ఆయన ఉదహరించారు. భయపడి రైతులకు పరిహారం ఇస్తామంటున్నారు ‘‘ఆత్మహత్యలు చేసుకున్న ప్రతి రైతు ఇంటికి వెళ్లి వారి కుటుంబీకులను ఓదారుస్తానని విశాఖపట్నంలో నేను ప్రకటించిన తరువాత చంద్రబాబు భయపడి.. మృతిచెందిన రైతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం ఇస్తానని సీఎం అన్నారు. నా పర్యటన దగ్గర పడుతుండటంతో సీఎం ఈ ప్రకటన చేశారు’’ అని జగన్ పేర్కొన్నారు. రైతు కుటుంబాల ఓదార్పు కార్యక్రమం సంక్రాంతి తరువాత చేపడతానన్నా రు. రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం ఏమైనా చేస్తారా? అని అడిగినపుడు ‘‘నేను ఇది వరకు ఓ దార్పు చేసినపుడు కూడా ఆ కుటుంబాలకు ఏం చేశామనేది నా నోట్లో నుంచి ఏనాడూ చెప్పలేదు. వారే (ఆ కుటుంబీకులు) చెప్పుకుని ఉంటే ఉండొచ్చు. ప్రచారార్భాటం చేసుకుని అదే పనిగా ఎప్పుడూ చెప్పలేదు. మానవతా దృక్పథంతో ఏం చేయాలో అది చేశాం’’ అని జగన్ వివరించారు. చంద్రబాబునే అడగండి నాపై కేసులెలా వచ్చాయో... తనపై కేసులెలా వచ్చాయో చంద్రబాబునే అడగాలని జగన్ సూచించారు. ‘‘మీరు ప్రజా సమస్యలను ప్రస్తావించినపుడల్లా మీపై ఉన్న కేసులను పదే పదే అధికారపక్షం ఎత్తి చూపుతోంది కదా. దానికేమంటారు?’ అని ఓ విలేకరి ప్రశ్నించగా.. ‘‘చంద్రబాబునే అడగండి, నా మీద కేసులెలా వచ్చాయో... ఎవరు పెట్టారు? అధికారంలో ఉండిన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాడినందుకే.. చంద్రబాబు, కాంగ్రెస్ కుమ్మక్కై నాపై కేసులు పెట్టించారు. వైఎస్ఆర్ సీఎంగా ఉన్నపుడు నాపై కేసులు ఎందుకు రాలేదు? అధికారంలో ఉన్న కాంగ్రెస్పై పోరాడి ఆ పార్టీని వీడాను కనుకనే నాపై కేసులు పెట్టారు. అన్నింటికీ ఆ దేవుడే ఉన్నాడు’’ అంటూ జగన్ ముగించారు. విలేకరుల సమావేశంలో సహచర ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, బూడి ముత్యాలనాయుడు, కాకాని గోవర్థన్రెడ్డి, పి.అనిల్కుమార్ యాదవ్, కిలివేటి సంజీవయ్య, గడికోట శ్రీకాంత్రెడ్డి పాల్గొన్నారు. మానవతా కోణంలోనే చూడాలి.. ‘‘రుణాలు రానందువల్ల, రుణ మాఫీ చేయనందువల్ల మాత్రమే రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని నేనెప్పుడూ చెప్పలేదు. వార లా చేసుకోవడానికి కారణాలు అనేకం ఉం డొచ్చు. ప్రైవేటు వ్యక్తుల వద్ద రుణాలు తీర్చలేక బాధతో కొవొచ్చు. పంటలకు మద్దతు ధర లభించక నష్టపోయి ఉండొచ్చు. కరువు వల్ల పంటలు లేక చనిపోయి ఉండొచ్చు. కారణాలేమైనా మరణించింది రైతులే కదా. వాటిని మానవతా కోణంలోనే చూడాలి’’ అని జగన్ పేర్కొన్నారు. ‘‘చంద్రబాబు ప్ర తి దానికీ 2004 నుంచి 2014 మధ్య పదేళ్ల లో ఇబ్బందుల వల్లరైతులు చనిపోయారంటారు. కానీ ఈ మనిషి చేసిన మోసం వల్ల ఆత్మహత్యలు చేసుకున్న వాస్తవం మాత్రం అంగీకరించరు’’అని జగన్ దుయ్యబట్టారు. -
ప్రభుత్వ తీరుపై ప్రజాగ్రహం!
అసెంబ్లీలో రైతుల పక్షాన వైఎస్ జగన్ పోరాటాన్ని స్వాగతిస్తున్న రైతులు, రైతు సంఘాలు ప్రతిపక్షం గొంతు నొక్కేందుకు ప్రభుత్వ యత్నాలపై ఆగ్రహం సమగ్ర చర్చ జరగాలని డిమాండ్ విజయవాడ : రైతు రుణమాఫీ, సీఆర్డీఏ బిల్లుపై సోమవారం రాష్ట్ర అసెంబ్లీ సమావేశంలో జరిగిన చర్చ జిల్లా వాసుల్లో ఆసక్తి రేపింది. ఉదయం రైతు రుణమాఫీ, సాయంత్రం సీఆర్డీఏ బిల్లుపై జరిగిన చర్చలో ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతుల పక్షాన నిలిచి ప్రభుత్వాన్ని నిలదీయడాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు. ఎన్నికల సమయంలో రైతులు, డ్వాక్రా మహిళల రుణాలన్నింటినీ మాఫీ చేస్తానని చెప్పి, అధికారంలోకి వచ్చిన తరువాత నిబంధనల పేరుతో కోతలు పెట్టారంటూ జగన్మోహన్ రెడ్డి శాసనసభలో ప్రశ్నించగా, దానికి సరైన సమాధానం ఇవ్వాల్సిన ప్రభుత్వం సహనం కోల్పోయి వ్యవహరించడం సరికాదని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. రైతులకు రుణమాఫీ సరిగా జరగలేదని, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్, గరిష్ట రుణ పరిమితి పేరిట రైతులను మోసం చేస్తున్నారని కృష్ణాజిల్లాలో రైతులకు జరిగిన అన్యాయాన్ని కేస్ స్టడీలు సహా వివరించడంపై స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీఆర్డీఏ బిల్లులో రైతులకు ఇచ్చే వాటా గురించి స్పష్టంగా లేకపోవడం వల్ల అన్నదాతలు నష్టపోతారంటూ ప్రతిపక్ష నేత, ఆ పార్టీ ఎమ్మెల్యేలు ప్రశ్నించడాన్ని వారు స్వాగతిస్తున్నారు. ఇప్పటికే రైతులు, రైతు సంఘాల నేతలు జరీబు భూముల్ని తీసుకోవద్దంటూ మొత్తుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదనేది తెలిసిందే. ప్రతిపక్షం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అధికారపక్షం.. సహనం కోల్పోయి ఇష్టానుసారం మాట్లాడటం మంచిది కాదని పలువురు రాజకీయ మేధావులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, ప్రజావ్యతిరేక విధానాలను ప్రతిపక్షం ఎండగడుతుంటే జీర్ణించుకోలేని స్థితిలో టీడీపీ ఎమ్మెల్యేలు, సీఎం ఉన్నారని స్పష్టమవుతోందని వివరిస్తున్నారు. ప్రభుత్వ చేతకానితనం బయటపడుతోంది శాసనసభలో రుణమాఫీ, సీఆర్డీఏ బిల్లులపై చర్చను చూస్తే ప్రభుత్వ చేతకానితనం బయటపడుతోంది. ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రతిపక్ష నేత జగన్ ఎండగట్టడం బాగుంది. కీలకమైన ఈ అంశాలపై చర్చ జరగకుండా, ప్రతిపక్షాలకు మైక్లు ఇవ్వకపోవడాన్ని ప్రజలు గమనిస్తున్నారు. సీఆర్డీఏ బిల్లులో రైతులకు ఇచ్చే వాటాను పొందు పరచాలంటూ జగన్ చేసిన డిమాండ్ సహేతుకమైనది. కొలనుకొండ శివాజీ సమాధానం చెప్పలేని స్థితిలో ప్రభుత్వం రుణమాఫీ అమలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని జగన్ ప్రశ్నిస్తున్న తీరు చాలా బాగుంది. ఎన్నికలకు ముందు చంద్రబాబు చెప్పిన మాటలు, అధికారంలోకి వచ్చిన తరువాత చెబుతున్న మాటలు, రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని లక్షల కోట్ల రుణాలు ఉన్నదీ తదితర విషయాలను సభలో జగన్ ప్రజలకు అర్థమయ్యేలా వివరించారు. వాస్తవాలను అంకెలు సహా చెప్పడంతో ప్రభుత్వం సమాధానం చెప్పలేని స్థితిలో పడింది. - ఎం.మధు రైతుసంఘం జిల్లా జాయింట్ సెక్రటరీ నాడు తండ్రి.. నేడు కొడుకు.. రైతులను నట్టేట ముంచిన టీడీపీ ప్రభుత్వం గురించి అసెంబ్లీలో జగన్ రైతుల పక్షాన మాట్లాడటం ఎంతో ఆనందాన్నిచ్చింది. ఆనాడు రైతులకు ఇచ్చిన రుణమాఫీని వైఎస్సార్ పూర్తిగా అమలు చేయించారు. ఇప్పుడు రుణమాఫీ పూర్తిగా అమలు చేయాలని జగన్ పోరాడుతున్నారు. ఆయన అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ప్రభుత్వం వ్యక్తిగత విమర్శలకు దిగడం బాధాకరం. అధికారంలో ఉన్నామని మా ఇష్టం వచ్చినట్లు చేస్తామంటే ప్రజలు ఊరుకోరు. - షేక్ షాబుద్దీన్, చెవిటికల్లు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ చెప్పడంలోనూ అబద్ధాలేనా! బ్యాంకులు ఇచ్చే స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ విషయంలోనూ చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. ఎకరానికి పంటకు రూ.24 వేలు ఇస్తుంటే స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ రూ.19 వేలని చెబుతున్నారు. రుణమాఫీ హామీకి కట్టుబడి ఉండకపోగా ఇంకా రైతులను మోసం చేయాలని చూడటం దారుణం. స్టేట్ లెవల్ బ్యాంకర్ల కమిటీ ఎకరానికి రూ.24 వేలు పంటరుణంగా ఇవ్వాలని నిర్ణయించిన విషయం చంద్రబాబుకు తెలియదా? రుణమాఫీ ప్రకటనతో ఏడాదిగా రైతులు బకాయిలు చెల్లించడం లేదు. దీంతో వడ్డీ 14 శాతం చొప్పున చెల్లించాల్సి వస్తోంది. ఎకరానికి రూ.24 వేల రుణం తీసుకుంటే.. రూ.3,360 వడ్డీ అవుతుంది. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం చంద్రబాబు మొదటి విడతగా రూ.3,800 విడుదల చేశారు. దీని ప్రకారం వడ్డీ పోను అసలు చెల్లించేది రూ.440 మాత్రమే. ఏటా ఇలా చెల్లిస్తే.. ఐదేళ్లకు వడ్డీ పోను చెల్లించేది రూ.2,200 మాత్రమే. మిగలినది తీరేదెప్పుడు? ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలి. - ఎంవీఎస్ నాగిరెడ్డి, వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్