breaking news
serching
-
తాతను చంపేందుకు సోషల్ మీడియాలో సెర్చ్.. బాలుడి కిరాతకం
జైపూర్: రాజస్థాన్లో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో యువకుడు తన తాతను కిరాతకంగా హతమార్చాడు. అనంతరం మృతదేహాన్ని మూటలో కట్టి నదిలో పడేశాడు. అయితే ఈ హత్య ఏలా చేయాలో తెలుసుకోవడానికి అతను సోషల్ మీడియాలో వెతికాడు. నది ఒడ్డున మృతదేహం లభించడంతో పోలీసులు విచారణ చేయగా అసలు విషయం బయిటపడింది.పాలి జిల్లాలో కుటుంబ కలహాల కారణంగా 16 ఏళ్ల బాలుడు తన 85 ఏళ్ల తాతను స్నేహితుడి సహాయంతో హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత మృతదేహాన్ని మూటలో కట్టి స్కూటర్పై నది సమీపానికి తీసుకెళ్లి నీటిలో పడేసినట్లు పేర్కొన్నారు. స్థానికులు నది సమీపంలో మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి ఛాతిపై కత్తిపోట్లు ఉండటంతో పాటు గొంతు నులిమిన ఆనవాళ్లు కూడా కనిపించాయి. మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు కుటుంబ సభ్యులను విచారించడంతో కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.కుటుంబ సభ్యులు వృద్ధుడు కనిపించకపోయినా పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించడంతో బాలుడు ఆందోళనకు గురై చివరకు హత్య చేసినట్లు అంగీకరించాడని పోలీసులు తెలిపారు. కాగా ఈ హత్య కోసం బాలుడు ఆన్లైన్లో హత్య చేసే పద్ధతులు, మెడపై ఎలా దాడి చేస్తే ప్రాణాలు పోతాయనే అంశాలపై ఆ వెతికినట్లు దర్యాప్తులో గుర్తించారు. తన స్నేహితుడితో కలిసి స్క్రూడ్రైవర్, కత్తితో తాతపై దాడి చేసి, మృతదేహాన్ని ఓ గోనె సంచిలో పెట్టినట్లు బాలుడు చెప్పాడు. అనంతరం ఇద్దరూ ఆ సంచిని స్కూటర్పై నది సమీపానికి తీసుకెళ్లి మృతదేహాన్ని నీటిలో పడేసి తిరిగి ఇంటికి వచ్చి ఏమి తెలియనట్లు నిద్రపోయాడని పోలీసులు పేర్కొన్నారు.సోషల్ మీడియా ద్వారా తండ్రి మరణించిన విషయం తెలుసుకున్న ముంబైలోని ఇద్దరు కుమారులు పోలీస్ స్టేషన్లో హత్యపై ఫిర్యాదు చేశారు. ఈ కేసులో 16 ఏళ్ల బాలుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, అతడి స్నేహితుడితో పాటు పొలంలో కాపలాదారుగా పనిచేసే 50 ఏళ్ల వ్యక్తిని అరెస్ట్ చేశారు. హత్యకు అసలు కారణం ఏమిటి, ఈ ఘటనలో ఇతరుల పాత్ర ఎంతవరకు ఉందనే దానిపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. -
గూగుల్ సెర్చ్లో ఈ ఏటి మేటి?
2023 ముగియడానికి.. 2024 ప్రారంభం కావడానికి మరెన్నో రోజులు వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఈ ఏడాది భారతదేశంలో ఎక్కువ మంది గూగుల్లో ఏమి సెర్చ్ చేశారు, నెటిజన్ల దృష్టిని ఆకర్శించిన అంశాలు ఏంటి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఇయర్ ఇన్ సెర్చ్ 2023 ప్రకారం.. ఈ సంవత్సరం ఎక్కువమందిని ఆకర్శించిన అంశం చంద్రయాన్ 3. ప్రపంచ దృష్టిని తనవైపు తిప్పుకున్న సంఘటనల్లో చంద్రయాన్-3 సక్సెస్ ఒకటి. ఆ తరువాత కర్ణాటక ఎన్నికలకు సంబంధించిన అంశాలను కూడా ఎక్కువగా గూగుల్ సర్చ్ చేసినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ హమాస్ యుద్దానికి సంబంధించిన విషయాలు, బడ్జెట్ 2023, టర్కీ భూకంపం, ఒడిశా రైలు ప్రమాదానికి సంబంధించిన వార్తలను ఎక్కువమంది గూగుల్ సెర్చ్ చేసినట్లు ఇటీవల విదులైన కొన్ని నివేదికల ద్వారా తెలిసింది. 2023లో ఎక్కువమంది గూగుల్ సెర్చ్ చేసిన విషయాలు చంద్రయాన్-3 కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఇజ్రాయెల్ వార్తలు సతీష్ కౌశిక్ బడ్జెట్ 2023 టర్కీ భూకంపం అతిక్ అహ్మద్ మాథ్యూ పెర్రీ మణిపూర్ వార్తలు ఒడిశా రైలు ప్రమాదం ఇదీ చదవండి: ఆస్ట్రేలియాలో ఇండియన్ బ్రాండ్ డీలర్షిప్ ఎలా ఉందో చూసారా.. (వీడియో) పైన తెలిపిన విషయాలు మాత్రమే కాకుండా చాట్జీపీటీ, ఇన్స్టాగ్రామ్, యూనిఫాం సివిల్ కోడ్ సంబంధిత చాలా విషయాలను కూడా గూగుల్ సెర్చ్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో.. జీ20 అంటే ఏమిటి,యూసీసీ అంటే ఏమిటి, చాట్జీపీటీ అంటే ఏమిటి, హమాస్ అంటే ఏమిటి, 2023 సెప్టెంబర్ 28 ప్రత్యేకత, ఇన్స్టాగ్రామ్ థ్రెడ్ అంటే ఏమిటి, సెంగోల్ అంటే ఏమిటి అనే అంశాలు ఉన్నాయి. -
అమృత్పాల్ కోసం డేరాల్లో గాలింపు
హోషియార్పూర్: వివాదాస్పద సిక్కు మత బోధకుడు, ‘వారిస్ దే పంజాబ్’ చీఫ్ అమృత్పాల్ సింగ్ ఆచూకీ ఇంకా లభించలేదు. అతడి కోసం పంజాబ్ పోలీసులు వేట మరింత ముమ్మరం చేశారు. హోషియార్పూర్ జిల్లాలో ప్రస్తుతం గాలింపు ఉధృతంగా కొనసాగుతోంది. సిక్కు మత సంస్థలైన ‘డేరా’ల్లోనూ పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. హోషియార్పూర్ జిల్లాలోని మర్నియాన్తోపాటు సమీప గ్రామాల్లో వాహనాలను క్షుణ్నంగా తనిఖీ చేస్తున్నారు. నివాసిత ప్రాంతాలే కాకుండా పశువుల పాకలు, పొలాల్లో బోరుబావుల వద్ద ఉండే గదులను సైతం వదిలిపెట్టడం లేదు. డేరాల్లో అమృత్పాల్ తలదాచుకొని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఆ దిశగా గాలింపు కొనసాగిస్తున్నట్లు చెబుతున్నారు. పోలీసులు ఇంటింటికీ తిరిగి అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. -
నేవీ హెలికాప్టర్ తో గాలింపు
-
హనీప్రీత్ కోసం కొనసాగుతున్న వేట
సాక్షి,చండీగర్: అత్యాచారం కేసులో గుర్మీత్ సింగ్ను దోషిగా నిర్ధారించిన నేపథ్యంలో పంచ్కులలో చెలరేగిన అల్లర్లకు సంబంధించి తాజాగా ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. డేరా చీఫ్ దత్తపుత్రిక హనీప్రీత్ ఇన్సాన్, డేరా ప్రతినిధి ఆదిత్య ఇన్సాన్ కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. వీరిద్దరూ విదేశాలకు పారిపోకుండా వీరిపై లుక్అవుట్ నోటీస్ జారీ అయిన విషయం విదితమే. డేరాలో చురుకుగా వ్యవహరించే ప్రదీప్ గోయల్ ఇన్సాన్ను ఆదివారం రాజస్ధాన్లోని ఉదయ్పూర్లో హర్యానా పోలీసులతో కూడిన సిట్ అదుపులోకి తీసుకుంది. ఇక ఆదిత్య ఇన్సాన్ బావ ప్రకాష్ అలియాస్ విక్కీని మొహాలీలో అరెస్ట్ చేసినట్టు పంచ్కుల డీసీపీ మన్బీర్ సింగ్ తెలిపారు. ఇక శనివారం అరెస్ట్ అయిన వ్యక్తిని విజయ్గా గుర్తించినట్టు వెల్లడించారు. డేరా బాబాను దోషిగా నిర్ధారించిన అనంతరం హర్యానా, పంజాబ్లలో జరిగిన హింసాకాండలో వీరి పాత్రపై ఆరా తీస్తున్నామని చెప్పారు. -
హై అలర్ట్ ప్రకటనతో పోలీసు తనిఖీలు
కాకినాడ సిటీ: దేశ సరిహద్దుల్లో నెలకొన్న యుద్ధవాతావరణం దృష్ట్యా కేంద్రం హై అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా ఎస్పీ రవిప్రకాష్ ఆదేశాల మేరకు పోలీసులు సోమవారం రాత్రి ఎక్కడిక్కడ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కాకినాడ వన్ టౌన్, టూటౌన్, త్రీటౌన్, పోర్టు సీఐలు ఏఎస్.రావు, డీఎస్.చైతన్యకృష్ణ, వి.దుర్గారావు, ఎ.రాంబాబు ఆధ్వర్యంలో ఎస్సైలు, సిబ్బంది ఆయా ప్రాంతాల్లోని లాడ్జిల్లో విస్తృతంగా సోదాలు చేశారు. లాడ్జిల్లో ఉన్న వారి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. పోర్టు, టౌన్ రైల్వేస్టేషన్లు, బస్డిపోలోనూ, రహదారుల్లో వాహనాల తనిఖీలు నిర్వహించి అనుమానితులను ప్రశ్నించారు.


