breaking news
semi nude
-
భర్త న్యూడ్ ఫొటోలు తీసిన హీరో భార్య.. వైరల్
ఇప్పుడు సినీ ఇండస్ట్రీలోకి కొత్త ట్రెండ్ వచ్చింది. అదే న్యూడ్ ఫొటో షూట్. విజయ్ దేవరకొండ 'లైగర్' మూవీ ప్రమోషన్స్తో మొదలైన ఈ ట్రెండ్ను వివిధ హీరోలు, నటులు ఫాలో అవుతూ కొనసాగిస్తున్నారు. విజయ్ దేవరకొండ తర్వాత ఓ బ్రాండ్ ప్రమోషన్స్లో భాగంగా బాలీవుడ్ నటుడు రాహుల్ ఖన్నా అర్ధనగ్నంగా ఫొటోలు దిగి నెట్టింట్లో పోస్ట్ చేశాడు. ఆ ఫొటోలు చూసిన నెటిజన్స్ దుమ్మెత్తిపోశారు. ఇటీవల బాలీవుడ్ యంగ్ హీరో రణ్వీర్ సింగ్ ఓ మ్యాగజైన్ కోసం నగ్నంగా ఫొజులిచ్చి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఇక ఈ ఫొటోషూట్ను నెటిజన్లు చీల్చి చెండాడారు. తాజాగా మరో హీరో ఇలాంటి న్యూడ్ ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు. దానికి 'ఈ ట్రెండ్లో నేను కూడా జాయిన్ అయ్యా' అంటూ చెప్పుకొచ్చాడు. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు విభిన్నమైన సినిమాలతో అలరించే తమిళ హీరో విష్ణు విశాల్. రానా నటించిన 'అరణ్య'లో ఓ పాత్రతోపాటు ఇటీవల 'ఎఫ్ఐఆర్' సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. విష్ణు హీరోగానే కాకుండా ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, తెలుగు అమ్మాయి గుత్తా జ్వాల భర్తగా సుపరిచితమే. చదవండి: సమంత యాటిట్యూడ్కు స్టార్ హీరో ఫిదా.. సినిమాలో అవకాశం! దిగొచ్చిన శ్రావణ భార్గవి.. ఆ వీడియో డిలీట్.. నడుము కింద వరకు కనిపించేలా, కేవలం దుప్పటి మాత్రమే అడ్డుపెట్టుకుని సెమీ న్యూడ్ ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశాడు విష్ణు విశాల్. 'నా భార్య గుత్తా జ్వాల ఫొటోగ్రాఫర్గా మారడంతో నేను కూడా ఈ ట్రెండ్లో జాయిన్ అయ్యా' అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫొటో కూడా నెట్టింటి వైరల్ అవుతోంది. ఇకపోతే ఈ సెమీ న్యూడ్ ఫొటోలను ట్రెండ్గా తీసుకోని ఇంకెంతమంది హీరోలు ఫాలో అవుతారో చూడాలి. Well... joining the trend ! P.S Also when wife @Guttajwala turns photographer... pic.twitter.com/kcvxYC40RU — VISHNU VISHAL (VV) (@TheVishnuVishal) July 23, 2022 చదవండి: మిస్ ఇండియా సినీ శెట్టికి ఇష్టమైన తెలుగు హీరో అతడే.. ధనుష్ నటించిన హాలీవుడ్ చిత్రం 'ది గ్రే మ్యాన్' రివ్యూ.. -
పబ్ జీ గేమ్కు బానిసై అర్ధనగ్నంగా గలాటా
కర్ణాటక యశవంతపుర : పబ్ జీ గేమ్కు బానిసైన యువకుడు మానసిక అస్వస్థతతో అర్ధనగ్నంగా తిరుగుతూ రాళ్లతో దాడి చేసిన ఘటన విజయపుర పట్టణంలో జరిగింది. పబ్జీ గేమ్కు అలవాటు పడిన యువకుడు మంగళవారం విజయపుర పట్టణంలోని మనగోలి అగసి వద్ద అర్ధనగ్నంగా రోడ్డుపైకి వచ్చాడు. అనంతరం రాళ్లతో కార్లు, బైక్లపై దాడి చేశాడు. పబ్జీలో మాదిరిగా బాంబ్లు విసిరినట్లు గలాటా సృష్టించాడు. దీంతో మహిళలు ఆందోళనకు గురయ్యారు. స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. -
అత్యాచార బాధితురాలికి ఆస్పత్రిలో అవమానం
సభ్యసమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన సంఘటన ఇది. శారీరకంగా, మానసికంగా వికలాంగురాలైన ఓ యువతిపై ఆమె పొరుగింటి వ్యక్తి అత్యాచారం చేయగా, ఆమెను వైద్య పరీక్షల పేరిట కొన్ని గంటల పాటు ఆస్పత్రిలో అర్ధనగ్నంగా వేచి ఉంచారు. ఈ ఘోర సంఘటన కర్ణాటకలో జరిగింది. మైసూరు జిల్లాలోని వరుణ ప్రాంతంలో బాధితురాలిపై ఆమె పొరుగింట్లో ఉండే వ్యక్తి అత్యాచారం చేశాడు. ఈ ప్రాంతం స్వయానా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. బాధితురాలు తొలుత వైద్య పరీక్షలు చేయించుకోడానికి భయపడి నిరాకరించింది. తర్వాత ఆమెను అర్ధనగ్నంగా కొన్ని గంటల పాటు ఆస్పత్రిలో బెడ్ మీద ఉంచేశారు. అయితే ఆమెను అంతసేపు ఎందుకు ఉంచాల్సి వచ్చిందన్న విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ ఈ సంఘటనపై స్పందించి, వైద్యులను పిలిపించి విచారించింది. అత్యాచార బాధితులను పరీక్షించేందుకు తమ ఆస్పత్రిలో తగిన సదుపాయాలు లేవని, అందుకే ఆమెను అంతసేపు ఉంచాల్సి వచ్చిందని ఆయన అన్నట్లు సమాచారం!! (ఇంగ్లీషులో ఇక్కడ చదవండి)