breaking news
seemandhra tdp mps
-
`ఆయన అనుమతితోనే సమైక్య పోరాటం`
హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లు రాష్ట్ర అసెంబ్లీలో చర్చకు రానున్న కీలక తరుణంలో తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల నేతల్లో వాడీవేడిగా చర్చ కొనసాగుతోంది. దీంతో ఇరుప్రాంతాల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంత టీడీపీ ఎంపీలు తమ పార్టీ అధినేత టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అనుమతితోనే సమైక్యం కోసం పోరాడుతున్నామని తెలిపారు. తెలంగాణకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకిస్తూ తాము రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు విశ్వప్రయత్నం చేస్తామని చెప్పారు. కాగా, 2008లో తెలంగాణపై ఇచ్చిన లేఖకు కాలం చెల్లిందంటూ సీమాంధ్ర టీడీపీ ఎంపీలు విమర్శించారు. -
ఆంధ్రప్రదేశ్ను కాపాడాలంటూ టీడీపీ ఎంపీల ధర్నా
న్యూఢిల్లీ : రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సీమాంధ్ర టీడీపీ ఎంపీలు మంగళవారం ఉదయం పార్లమెంట్ ప్రధాన ద్వారం గేటు నెంబర్ 1 వద్ద ధర్నాకు దిగారు. ఆంధ్రప్రదేశ్ను కాపాడాలంటూ వారు ఫ్లకార్డులో ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. కాంగ్రెస్సేతర పక్షాలతో చర్చలు జరుపుతున్నామని, సభలో అవిశ్వాస తీర్మానానికి మద్దతు లభిస్తుందని భావిస్తున్నట్లు ఎంపీలు తెలిపారు. అంతకు ముందు టీడీపీ సీమాంధ్ర ఎంపీలు ....ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి నివాసంలో సమావేశం అయ్యారు. అవిశ్వాస తీర్మానం నోటీసుపై వారు చర్చ జరిపారు.