breaking news
Satya Sirisha
-
కేపీహెచ్బీలో బ్యూటీషియన్ ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్ : ఆర్థిక ఇబ్బందులతో ఓ బ్యూటీషియన్ అనుమానస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కేపీహెచ్బీలో చోటుచేసుకుంది. అయిదో ఫేజ్లో నివాసం ఉంటున్న సత్య శిరీష గతంలో బ్యూటీపార్లర్ నిర్వహించేవారు. అయితే ఆర్థిక ఇబ్బందులతో దాన్ని ఆమె మూసివేసి ఇంట్లోనే ఉంటున్నారు. అయితే బ్యూటీపార్లర్ బిజినెస్లో నష్టాలు రావడంతో శిరీష మనస్తాపంతో సోమవారం సాయంత్రం తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా దొమ్మేరు. కాగా ఆర్థిక ఇబ్బందులు కారణంగానే ఆమె ఈ ఘటనకు పాల్పడినట్లు శిరీష భర్త గోపాలకృష్ణ, బంధువులు చెబుతున్నారు. మరోవైపు కేసు నమోదు చేసుకున్న పోలీసులు...శిరీషది ఆత్మహత్యా లేక హత్యా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. మృతురాలి ఫోన్ కాల్స్ ఆధారంగా విచారణ చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతురాలికి ఓ కుమారుడు ఉన్నాడు. -
భర్త ఇంటి ముందు మౌనదీక్ష
కొత్తపల్లి మండలంలో భర్త ఇంటి ముందు భార్య మౌనదీక్షకు దిగింది. వివరాలు..తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడకు చెందిన సత్యశిరీష అనే యువతిని కొత్తపల్లికి చెందిన స్వామిరెడ్డి సుబ్రహ్మణ్యానికి ఇచ్చి మూడేళ్ల క్రితం వివాహం జరిపించారు. పెళ్లైన ఏడాది వరకు వీరి కాపురం సజావుగానే సాగింది. మరుసటి ఏడాది నువ్వంటే ఇష్టంలేదని, విడాకులు కావాలని శిరీషను పుట్టింటిలో వదిలేశాడు. రెండు సంవత్సరాలైనా కాపురానికి తీసుకెళ్లకపోవటంతో శిరీష తన అత్తగారింటి ముందు మౌనదీక్ష చేపట్టింది. తనకు న్యాయం జరిగేంతవరకు అక్కడి నుంచి కదలబోనని భీష్మించుకు కూర్చుంది.