breaking news
sataya narayana
-
స్కెచ్చేశాడు.. చంపించాడు
సాక్షి, అమరావతి బ్యూరో: విజయవాడలో చిత్తు కాగితాల వ్యాపారిగా ప్రస్థానం మొదలెట్టిన కోగంటి సత్యనారాయణ అలియాస్ సత్యం రూ. కోట్లు టర్నోవర్ చేసే స్టీల్ వ్యాపారి స్థాయికి ఎదిగాడు. మరోవైపు భూకబ్జాలకు పాల్పడటం, స్థల వివాదాల్లో తలదూర్చి సెటిల్మెంట్లు చేయడం.. ప్రత్యర్థులను తుదముట్టించడం వంటి నేర కార్యకలాపాలకు పాల్పడుతూ ఏ–1 రౌడీషీటర్గా ఎదిగాడు. ఈ తరహా ఆరోపణల నేపథ్యంలో బెజవాడలోని వివిధ పోలీస్ స్టేషన్లలో సత్యంపై 21 కేసులు నమోదయ్యాయి. సత్యం ఆగడాలు మితిమీరడంతో పోలీసులు అతడిపై ఏ–1 రౌడీషీట్ తెరిచారు. వ్యాపార లావాదేవీల్లో వచ్చిన స్పర్థల నేపథ్యంలో స్టీల్ వ్యాపారి తేలప్రోలు రాంప్రసాద్ను కోగంటి సత్యం తుదముట్టించినట్టు తేలడం నగరంలో కలకలం రేపింది. పక్కా స్కెచ్ అమలు.. తేలప్రోలు రాంప్రసాద్, కోగంటి సత్యం ఇద్దరూ 2003 నుంచి కలిసి వ్యాపారం చేశారు. ఈ నేపథ్యంలో రూ.70 కోట్లను కోగంటి సత్యంకు రాంప్రసాద్ బకాయిపడ్డాడు. ఈ వివాదం పెద్దల వద్దకు వెళ్లడంతో రూ.23 కోట్లు చెల్లించేవిధంగా సెటిల్మెంట్ చేశారు. రుణ మొత్తం భారీగా తగ్గించినా రాంప్రసాద్ అప్పు తీర్చకపోవడంతో కోగంటి సత్యం ఆగ్రహంతో రగిలిపోయాడు. ఎలాగైనా రాంప్రసాద్ను హతమార్చాలనే నిర్ణయానికొచ్చి తన అనుచరుడు శ్యామ్ను ఆశ్రయించాడు. రాంప్రసాద్ హత్య కేసులో ఏ–3గా ఉన్న ఆంజనేయ ప్రసాద్ అంతకుముందు తన మామగారి మెడికల్షాపు కేసు విషయమై సత్యంను కలిశాడు. అతడి అవసరాలను ఆసరాగా చేసుకున్న శ్యామ్ హత్య ప్రణాళిక గురించి అతడికి తెలిపాడు. హత్య కేసును అతనిపై రానివ్వకుండా చూసుకుంటామని, మెడికల్ షాపు వ్యవహారంలో అతనికి న్యాయం చేస్తామని నమ్మబలకడంతో రాంప్రసాద్ను హత్య చేయడానికి ఆంజనేయ ప్రసాద్ ఒప్పుకున్నాడు. ఇలా మొత్తం రూ.10 లక్షలకు సుపారీ ఇచ్చి హత్యకు పథక రచన చేశారు. ఇందులో ఆంజనేయ ప్రసాద్కు శ్యామ్ రూ.2 లక్షలు ఇచ్చాడు. ఇదే కేసులో ఏ–7 నిందితునిగా ఉన్న చంద్రిక ఆనంద్కు రూ.3 లక్షలు ఇచ్చాడు. కాగా కోగంటి సత్యం ఏ–6 నిందితుడైన తిరుపతి సురేష్కు రూ.25 వేలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఈ నెల 6న పంజాగుట్ట సమీపంలో వ్యాపారి రాంప్రసాద్ను నిందితులు కత్తులతో దాడి చేసి పరారయ్యారు. తీవ్రంగా గాయపడ్డ రాంప్రసాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆయన భార్య వైదేహి ఇచ్చి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేసిన పోలీసులు.. ఈ కేసులో మొత్తం 10 మందిని నిందితులుగా గుర్తించారు. ఏ–1 నిందితుడైన కోగంటి సత్యం, శ్యామ్, ప్రసాద్, ప్రీతమ్, రామును పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేయగా.. మిగిలిన ఆరుగురు నిందితులు తిరుపతి సురేష్, చంద్రిక ఆనంద్, శ్రీరామ్ రమేష్, షేక్ అజారుద్దీన్ అలియాస్ చోటు, పత్తిపాటి నరేష్, వెంకట రామ్రెడ్డి పరారీలో ఉన్నారు. కేసును పక్కదోవ పట్టించేలా.. కోగంటి సత్యం సూచన మేరకు అతని అనుచరుడు శ్యామ్ మీడియాతో పాటు పోలీసులకు ఈ హత్యతో సత్యంకు ఎలాంటి సంబంధం లేదని పలుమార్లు చెప్పాడు. శ్యామ్ మాటలపై పోలీసుల అనుమానం మరింత పెరిగింది. ఆ దిశగా పోలీసులు విచారణ చేపట్టారు. రాంప్రసాద్ నుంచి డబ్బు రాకపోవడంతో రాంప్రసాద్ను హత్య చేయిస్తే.. అతడి బావమరిది తనకు ఇవ్వాల్సిన రూ.12 కోట్లు అయినా భయపడి ఇస్తాడని ఆశించి కోగంటి సత్యం ఈ హత్య చేయించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. -
సమాచారం ఇవ్వకపోతే జరిమానా
ఇన్చార్జ్ కలెక్టర్ సత్యనారాయణ అనంతపురం సప్తగిరి సర్కిల్:సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తుదారుడికి సమాచారం ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తే వ్యక్తిగతంగా చేతి నుంచి జరిమానా చెల్లించాల్సి ఉంటుందని ఇన్చార్జ్ కలెక్టర్ సత్యనారాయణ హెచ్చరించారు. గురువారం కలెక్టరేట్లోని రెవెన్యూభవన్లో స మాచార హక్కు చట్టం రాష్ట్ర కమిటీ సభ్యులు చలపతి, మఠం ఆనంద్కుమార్లతో కలిసి సమాచార హక్కు చట్టంపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఇన్చార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ చాలా మంది అధికారులకు సమాచార హక్కు చట్టం కింద వచ్చిన దరఖాస్తును బుర్ర పెట్టి చదివే ఓపిక లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. దరఖాస్తు దారుడు కోరిన సమాచారాన్ని 30 రోజులలోపు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. లేని పక్షంలో పీఐఓ, అప్పీలేట్ అథారిటీ వరకు వెళ్లే అవకాశం ఉందన్నారు. గతంలో పాడేర్ సబ్కలెక్టర్గా ఉండి(ప్రస్తుతం రిటైర్డ్ అయిన) ఐఏఎస్ స్థాయి అధికారి ఒకరికి సమాచారం ఇవ్వడంలో నిర్లక్ష్యం వహించినందుకు పెన్షన్ ఆపిన దాఖలాలు ఉన్నాయని గుర్తు చేశారు. ప్రతి కార్యాలయంలో పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్(పీఐఓ), అసిస్టెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్(ఏపీఐఓ) పేర్లు, ఫోన్ నంబర్లతో సమాచార బోర్డులు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమాచారం కోసం వచ్చిన దరఖాస్తులను ఆన్లైన్లో ఆయా డిపార్ట్మెంట్లు అప్లోడ్ చేయాలని సూచించారు. అనంతపురం తహశీల్దార్ కార్యాలయంలో బోర్డు ఏర్పాటు చేయలేదని సమాచార హక్కు కమిటీ సభ్యులు అధికారుల దృష్టికి తీసుకె ళ్లారు. 67 శాఖలకు గాను 32 శాఖలు సమాచారం అప్లోడ్ చేయలేదని డీఆర్వో హేమసాగర్ ఇన్చార్జ్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. శుక్రవారం సాయంత్రంలోగా ఫిర్యాదులను ఆన్లైన్లో అప్లోడ్ చేసి సోమవారం ప్రజావాణికి రిజిష్టర్లో నమోదు చేసుకుని తీసుకురావాలని డీఆర్వో సూచించారు. సమావేశంలో హౌసింగ్ పీడీ ప్రసాద్, ఐసీడీఎస్ పీడీ జుబేదాబేగం, పట్టుపరిశ్రమ జేడీ అరుణకుమారి, డీఈఓ మధుసూధన్రావు, అనంతపురం ఆర్డీఓ హుస్సేన్సాబ్, తదితరులు పాల్గొన్నారు. మసీదుల్లో మౌలిక సౌకర్యాలకు చర్యలు: పవిత్ర రంజాన్ మాసంను దృష్టిలో ఉంచుకుని మసీదుల వద్ద మౌలిక వసతులు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ఇన్చార్జ్ కలెక్టర్ సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. గురువారం తన చాంబర్లో మున్సిపల్, పోలీస్, మైనార్టీ, రెవెన్యూ, విద్యుత్ అధికారులతో స మావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మసీదుల వద్ద తాగునీటిసౌకర్యం, పా రిశుద్ధ్యం, పోలీసు గస్తీ, షెహరీ, ఇఫ్తార్ వేళల్లో విద్యుత్ సరఫరా ఉండేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. కార్మిక శాఖ అధికారులు మసీదుల వద్ద పండ్ల వ్యాపారులు తోపుడుబండ్లు ఏర్పాటు చేసుకేనేందుకు అనుమతివ్వాలన్నారు. సమావేశంలో డీఆర్వో హేమసాగర్, డీఎస్ఓ ఉమామహేశ్వర్రావు, మైనార్టీ కార్పొరేషన్ , మైనార్టీ సంక్షేమాధికారి, పుట్టపర్తి, గుత్తి, క ళ్యాణదుర్గం మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. ఆధార్ సీడింగ్పై అలసత్వం వహిస్తే చర్యలు : రేషన్కార్డులకు, ఉపాధి హామీ పెన్షన్లకు ఆధార్ సీడింగ్ విషయంలో అలసత్వం వహించే వారిపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఇన్చార్జ్ కలెక్టర్ ఆదేశించారు. పౌరసరఫరాలశాఖ, డ్వామా అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. రేషన్కార్డుల అనుసంధానం వచ్చే వారానికి 75 శాతం పైబడి లక్ష్య సాధన ఉండాలని అధికారులను ఆదేశించారు. ప్రజావాణి ఫిర్యాదులపై నిర్లక్ష్యం తగదు జిల్లాలో ప్రజావాణిలో వచ్చే అర్జీలపై నిర్లక్ష్యం తగదని ఇన్చార్జ్ కలెక్టర్ గురువారం ప్రజావాణి సమీక్షలో అధికారులకు సూచించారు. ఏ కేటగిరిలో 15 రోజుల్లోగా డిస్పోజల్ చేయాల్సి ఉన్నా ఎందుకు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 అర్జీల కంటే ఎక్కువగా పెండిం గ్లో ఉన్న శాఖల వారీగా సమీక్షించారు. ప్రతి వారం ప్రజావాణికి వచ్చే ముందు ఎన్ని అర్జీలు పరిష్కారమయ్యాయి,ఎన్ని పెండింగ్లో ఉన్నాయనే సమగ్ర సమాచారంతో రావాలని సూచించారు.