breaking news
saraswathi sisumandir
-
హైదరాబాద్లో విషాదం.. విహారయాత్రకు వెళ్లి పదో తరగతి విద్యార్థి మృతి
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. పాఠశాల తరపున విహార యాత్రలకు వెళ్లిన 10వ తరగతి విద్యార్థి ప్రమాదవశాత్తు మృతిచెందాడు. వివరాలు.. స్థానిక సరస్వతి స్కూల్కు చెందిన 60 మంది విద్యార్థులు బాసర విహారయాత్రకు వెళ్లారు. ఈ క్రమంలో గోదావరి నది ఒడ్డున తోటివారితో ఆడుతుండగా ప్రమాదవశాత్తు నీటిలో పడి విశాల్ అనే విద్యార్థి మృతి చెందాడు. హైదరాబాద్ నుంచి ఉదయం 5గంటలకు బాసరకు వెళ్లగా...12 గంటలకు మృతి చెందినట్లు పాఠశాల యాజమాన్యం తలిదండ్రులు ఫోన్ చేసి చెప్పింది. అయితే మృతదేహాన్ని హైదరాబాద్ తీసుకువచ్చిన స్కూల్ యాజమాన్యం.. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కుటుంబ సభ్యుల వద్ద వదిలి వెళ్లింది. దీంతో విశాల్ మృతదేహంతో స్కూల్ వద్ద కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. బాలుడి మృతికి స్కూల్ యాజమాన్యం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో సరస్వతి స్కూల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. చదవండి: Drugs Case: డ్రగ్స్ కేసులో కీలక సూత్రధారి అరెస్ట్ కాగా బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10 సరస్వతి విద్యానికేతన్ తరఫునుంచి గత 30 సంవత్సరాలుగా పేద విద్యార్థులను పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్తుంటారు. అందులో భాగంగానే బాసర క్షేత్రానికి తీసుకెళ్లిన విద్యార్థుల్లో ఒక విద్యార్థి గోదావరి నదిలో మునిగి మృతి చెందారు. -
15న శాస్త్ర సాంకేతిక ప్రదర్శన
మెదక్: ఈనెల 15వ తేదిన తమ పాఠశాలలో శాస్త్ర సాంకేతిక ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు శ్రీ సరస్వతీ శిశుమందిర్ పాఠశాల ప్రధానాచార్యులు పురం చంద్రకళ శనివారం ఓప్రకటనలో తెలిపారు. విద్యార్థుల్లో వైజ్ఞానిక ఆలోచనలు పెంపొందించడానికి భారత ప్రభుత్వ సాంస్క ృతిక మంత్రిత్వ శాఖ సహకారంతో విద్యా భారతి సంస్క ృతి శిక్షా సంస్థాన్, కురుక్షేత్ర ద్వారా ఈ ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈనెల 15న ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు జరిగే ఈ ప్రదర్శనలో పట్టణంలోని 12 పాఠశాలల నుంచి సుమారు 500మంది విద్యార్థులు పాల్గొంటారని తెలిపారు.