breaking news
rustumbada
-
ఆటోను ఢీకొన్న బస్సు
నరసాపురం రూరల్ : నరసాపురం–మొగల్తూరు 216 జా తీయ రహదారిలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతి చెందగా మరో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు, నరసాపురం రూర ల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకా రం.. నరసాపురం నుంచి మొగల్తూరు వైపు ఏడుగురు ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను రుస్తుంబాద సెవెన్తడే స్కూల్ సమీపంలో నరసాపురం వైపు వస్తున్న ఓ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన బస్సు ఢీకొంది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న జెట్టిపాలెంకు చెం దిన కడలి రత్నమాణిక్యమ్మ (60) అక్కడికక్కడే మృతిచెందిం ది. మిగిలిన వారికి తీవ్రగాయాలయ్యా యి. మృతురాలికి భర్త, ముగ్గురు కుమారులు ఉన్నారు. వీరంతా వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. మాణిక్యమ్మ రెండు రోజుల క్రితం దిగమర్రు పుట్టింటికి వెళ్లగా తిరిగి వస్తుండగా మృత్యువాత పడింది. క్షతగాత్రులు ప్రభుత్వాస్పత్రికి.. ఆటోలోని ఆరుగురు ప్రయాణికులు, డ్రైవర్కు తీవ్రగాయాలు కాగా వీరిని నరసాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పేరుపాలెం, తూర్పుతాళ్లు గ్రామాలకు చెందిన దొంగ సావిత్రి, దొంగ సీతామహాలక్ష్మి, దొంగ భవాని, కవురు వెంకట కృష్ణారావు, సంపంగి సునీత, ఆటో డ్రైవ ర్ పంపన శ్రీనుప్రసాద్కు తీవ్ర గాయాలు కాగా విద్యార్థి పవన్కు స్వల్పగాయాలయ్యాయి. నరసాపురం రూరల్ ఎస్సై కర్రి సతీష్కుమార్ కేసు నమోదు చేసి సీఐ ఎం.సుబ్బారావు ఆధ్వర్యంలో ద ర్యాప్తు చేస్తున్నారు. మాణిక్యమ్మ మృతదేహనికి పోస్టుమార్టం నిర్వహించాల్సి ఉంది. కళాశాల బస్సు డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రోడ్డు విస్తరణ పనులే కారణమా.. కొంతకాలంగా నరసాపురం–మొగల్తూ రు 216 జాతీయ రహదారి విస్తరణ పనులు చేస్తున్నారు. దీంతో తరచుగా ఈ రోడ్డులో ప్రమాదాలు జరుగుతున్నాయని పలువురు చెబుతున్నారు. రోడ్డు అభివృద్ధి పనుల్లో భాగంగా రహదారిని కొంత భాగం తవ్వి వదిలేయడంతో ప్రమాదా లు జరుగుతున్నట్టు తెలుస్తోంది. -
నిశీధి వేళ.. విషాదం
ఆ ముగ్గురూ.. స్నేహితులు. ఆడుతూ పాడుతూ.. పనులు చేసుకునేవారు. అనుక్షణం కలిసే ఉండేవారు. అప్పటివరకూ సరదాగా గడిపిన వారు అంతలోనే విగతజీవులయ్యారు. అర్ధరాత్రి వేళ.. దారికాచిన మృత్యువు ముగ్గురినీ ఒకేసారి కబళించింది. నిండా 25 ఏళ్లుకూడా లేని ఆ యువకులు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం ప్రతి ఒక్కరినీ కలచివేసింది. నరసాపురం రూరల్ : మరికొద్దినిమిషాల్లో ఇల్లు చేరతామని భావించిన ఆ యువకులను రోడ్డు ప్రమాదం బలితీసుకుంది. బుధవారం అర్ధరాత్రి వేళ.. జరిగిన ఈ హృదయవిదారక ఘటన నరసాపురం మండలం రుస్తుంబాదలో పెనువిషాదాన్ని నింపింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. రుస్తుంబాదకు చెందిన మీసారపు సురేంద్ర(25), పాలపర్తి అశోక్(20), దాసరి మణిరాజు(20) స్నేహితులు. వీరిలో సురేంద్ర, అశోక్ తాపీపనిచేస్తూ ఉంటారు. మణిరాజు ఎలక్రీ్టషియన్. ముగ్గురూ అనుక్షణం కలిసే ఉండేవారు. బుధవారం అర్ధరాత్రి వారు ముగ్గురూ మోటార్సైకిల్పై నరసాపురం నుంచి రుస్తుంబాదకు వస్తుండగా, గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఫలితంగా ముగ్గురూ అక్కడికక్కడే రక్తపుమడుగుల్లో దుర్మరణం పాలయ్యారు. దీంతో ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది. రుస్తుంబాద రోదనలతో మిన్నంటింది. మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చడం ఎవరివల్లా కావడం లేదు. గ్రామంలోని అందరితోనూ కలుపుగోలుగా ఉండే ఈ ముగ్గురూ మరణించడం ప్రతిఒక్కరినీ కలచివేసింది. తండ్రిలాగే.. కొడుకూ రోడ్డు ప్రమాదానికి బలి సురేంద్ర తల్లిదండ్రులు శ్యామల రావు, మిస్సమ్మ నిరుపేదలు. వారికి ముగ్గురు సంతానం. సురేంద్రతోపాటు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. వీరిద్దరికీ పెళ్లిళ్లయిపోయాయి. సురేంద్ర తండ్రి శ్యామలరావు చాలాకాలం క్రితం రోడ్డు ప్రమాదంలోనే మరణించాడు. తల్లి ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లారు. సురేంద్ర ఒక్కడే గ్రామంలో ఉంటూ తాపీ పనిచేస్తూ జీవిస్తున్నాడు. ఇంకా పెళ్లికాలేదు. ఈ క్రమంలో అతను మరణించడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం పోలీసులు నరసాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ట్రైనీ ఎస్సై చంద్రశేఖర్ సీఐ రామచంద్రరరావు ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబానికి చేదోడువాదోడుగా.. దాసరి మణిరాజు ఎలక్రీ్టషియన్. అతని తండ్రి ఆనందరావు వ్యవసాయ కూలీ. ఆయనకు ముగ్గురు సంతానం మణిరాజు చిన్నవాడు. ఇతనికి అక్క, అన్న ఉన్నారు. అన్న కూడా కూలిపనులు చేస్తాడు. వీరెవరికీ వివాహాలు కాలేదు. మణిరాజు ఎంతోకొంత సంపాదిస్తూ.. కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. ఎంత రాత్రైనా రోజూ పనులు ముగించుకుని వచ్చే మణిరాజు రోడ్డుప్రమాదంలో దుర్మరణం పాలవడంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. చెల్లెలి పెళ్లి చేద్దామన్నాడు పాలపర్తి అశోక్ తల్లిదండ్రులు రమేష్, మార్తమ్మ. రమేష్ తాపీపనిచేస్తూ ఉంటాడు. వీరికి ముగ్గురు సంతానం అశోక్ పెద్దవాడు. అతనూతాపీపనులు చేస్తుంటాడు. తమ్ముడు, చెల్లి ఉన్నారు. ఇటీవల అశోక్ పెళ్లిచేద్దామని తల్లిదండ్రులు భావిస్తే.. ముందు చెల్లికి వివాహం చేసిన తర్వాత తను చేసుకుంటానని చెప్పాడు. ఇంతలోనే ప్రమాదంలో అశోక్ మృత్యువాత పడ్డాడు. దీంతో కుటుంబ సభ్యులు తీవ్రంగా రోదిస్తున్నారు. ప్రమాదాలకు నిలయం ఆ రోడ్డు నరసాపురం–మొగల్తూరు రోడ్డు ప్రమాదాలకు నిల యంగా మారింది. వాహనాలు మితిమీరిన వేగంతో వెళ్లడంతో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. మూడు నెలల క్రితం పట్టణ పోలీస్స్టేçÙన్ సమీపంలో లారీ ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మొగల్తూరు మండలం నాగిడిపాలెం వద్ద వంతెన పూర్తవడంతో ఇటీవల రద్దీ పెరిగింది. ఒక పక్క రోడ్డు విస్తరణ పనులు చేపట్టడంతో ఒకవైపే వాహనాలను అనుమతిస్తున్నారు. దీనికితోడు మితిమీరిన వేగం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి.