breaking news
Rush Hour
-
ఆ సమయంలో అమ్మాయిని ఫాలో కావడం అసాధ్యం.. కోర్టు కీలక తీర్పు
ముంబై: మహిళపై వేధింపుల కేసులో ముంబై మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు గతవారం కీలక తీర్పునిచ్చింది. 40 ఏళ్ల నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ముంబైలో ఉదయం వేళ చాలా రద్దీగా ఉంటుందని, ఆ సమయంలో ఒకరిని మరొకరు ఫాలో కావడం అసాధ్యమని వ్యాఖ్యానించింది. ఏం జరిగిందంటే..? ముంబై చిరా బజార్లో నివసించే ఓ మహిళ.. ఓ వ్యక్తి తనను రోజు ఫాలో అవుతున్నాడని ఆరోపించింది. ఉదయం రైల్వే స్టేషన్కు వెళ్లే సమయంలో అతడు తనను బైక్పై అనుసరిస్తున్నాడని, తనవైపే చూస్తూ ఇబ్బంది పెడుతున్నాడని కేసు పెట్టింది. నిందితుడు కూడా అదే ప్రాంతంలో ఓ గ్యారేజీ నడుపుతున్నాడు. ఆమె వెళ్లేదారిలోనే ఆ షాపు కూడా ఉంది. అయితే మహిళ చేసిన ఆరోపణలపై కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ముంబైలో ఉదయం వేళ చాలా రద్దీగా ఉంటుందని, ఆపీసులకు వెళ్లేవారితో రోడ్లు కిక్కిరిపోతాయని పేర్కొంది. అలాంటి సమయంలో ఒకరిని మరొకరు ఫాలో చేయడం అసలు సాధ్యం కాదని చెప్పింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడికి బెయిల్ ఇచ్చింది. ఈ కేసు 2017 ఆగస్టు 3న నమోదైంది. చదవండి: ఇండియన్ కరెన్సీ నోట్లపై కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు -
టాలీవుడ్ టు హాలీవుడ్
‘భద్రమ్ బీ కేర్ ఫుల్ బ్రదరూ’లో హీరోగా నటించిన శ్రీ రాజ్ హాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నారు. ‘రష్ అవర్’ మూడు భాగాలతో పాటు పలు హాలీవుడ్ చిత్రాలకు దర్శకత్వం వహించిన బ్రెట్ రాట్నర్ ఈ చిత్రానికి దర్శకుడు. హాలీవుడ్ చిత్రంలో ఛాన్స్ దక్కించుకున్న సందర్భంగా శ్రీరాజ్ మాట్లాడుతూ– ‘‘నటనంటే నాకు ప్రాణం. అందుకే అమెరికాలోని న్యూయార్క్ ఫిల్మ్ ఆకాడమీలో ఫిల్మ్ మేకింగ్ అండ్ యాక్టింగ్ కోర్సు చేశాను. ‘రష్ అవర్’ వంటి బ్లాక్ బ్లస్టర్ చిత్రాలను రూపొందించిన బ్రెట్ రాట్నర్ దర్శకత్వంలో సినిమా చేయడం హ్యాపీగా ఉంది. న్యూయార్క్ నేపథ్యంలో రెండు జంటల మధ్య సాగే మ్యూజికల్ లవ్స్టోరియే ఈ చిత్రం. ఇందులో నాది టాక్సీ డ్రైవర్ పాత్ర. తెలుగులో రెండు పెద్ద బేనర్లు నిర్మిం చనున్న రెండు సినిమాల్లో హీరోగా చేయబోతున్నా’’ అన్నారు.