breaking news
Rs 600 crore
-
ఆధార్, పాన్ లింకింగ్: ఆలస్యానికి రూ.600 కోట్లు..
ఆధార్, పాన్ కార్డు లింకింగ్ అనేది చాలా అవసరం. బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయాలన్నా.. పెద్ద మొత్తంలో ట్రాన్సాక్షన్స్ చేయాలన్నా.. ఇది తప్పనిసరి. అయితే ఈ లింకింగ్ కోసం కేంద్రం గడువును 2024 డిసెంబర్ 31 వరకు పెంచినట్లు సమాచారం. ఆధార్ కార్డుతో పాన్ కార్డును లింక్ చేయకపోతే.. పాన్ కార్డులు డీయాక్టివేట్ అవుతాయి.నిజానికి 2023 జూన్ 30 నాటికి ఆధార్, పాన్ కార్డు లింకింగ్ గడువు ముగిసింది. గడువు లోపల లింక్ చేసుకొని వారు ఫెనాల్టీ కింద రూ.1,000 చెల్లించి మళ్ళీ యాక్టివేట్ చేసుకోవాల్సి వచ్చింది. జనవరి 29, 2024 నాటికి ఆధార్తో లింక్ చేయని పాన్ల సంఖ్య 11.48 కోట్లు అని ఫిబ్రవరిలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పార్లమెంటుకు తెలియజేశారు.దీంతో 2023 జులై 1 నుంచి 2024 జనవరి 31 వరకు ఆధార్, పాన్ కార్డు లింకింగ్ కోసం ఫెనాల్టీ కింద కేంద్రం 601.97 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. పాన్ కార్డ్ డియాక్టివేట్ అయితే.. తరువాత లావాదేవీలలో ఇబ్బందులను ఎదుర్కోవడమే కాకుండా దాన్ని మళ్లీ యాక్టివేట్ చేయడం కూడా కొంత కష్టమే.ఇదీ చదవండి: 'ఆఫీసు నుంచి లేటుగా వెళ్తున్నా.. రేపు ఆలస్యంగా వస్తా': ఉద్యోగి మెసేజ్ వైరల్వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేయకుండా నిరోధించే లక్ష్యంతో.. పాన్ ద్వారా వ్యక్తిగత వివరాల యాక్సెస్ను పరిమితం చేయాలని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదాయపు పన్ను శాఖను ఆదేశించింది. కాబట్టి తప్పకుండా పాన్, ఆధార్ లింకింగ్ చేసుకోవాలి. దీని కోసం అధికారిక వెబ్సైట్ సందర్శించి.. ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 234H కింద రూ. 1,000 ఫెనాల్టీ చెల్లించాలి. -
600 కోట్ల హెరాయిన్ పట్టివేత
-
600 కోట్ల హెరాయిన్ పట్టివేత
పోర్బందర్: అక్రమంగా గుజరాత్ తీరంలోకి ప్రవేశించిన మరో పాకిస్థాన్ బోటును పట్టుకున్నారు. పాక్ నుంచి గుజరాత్ మీదుగా భారత్లోకి భారీఎత్తున మత్తుమందులు, శాటిలైట్ ఫోన్లు తదితరాలతో ప్రవేశిస్తున్న ఈ భారీ నావను నౌకాదళ అధికారులు సీజ్ చేశారు. భారత నౌకాదళ అధికారులు, కోస్ట్ గార్డ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంయుక్త ఆపరేషన్లో గుజరాత్లోని పోరుబందర్ పోర్ట్లో ఈ నౌకను పట్టుకున్నారు. ఇందుకు సంబంధించి 8 మందిని అరెస్ట్ చేశారు. ఇంటిలిజెన్స్ వర్గాల సమాచారం మేరకు గత కొన్ని రోజులుగా నిఘాపెట్టినట్లు నౌకా దళ అధికారులు తెలిపారు. దీనిపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన అధికారులు, దీనికి ఉగ్రచర్యలకు సంబంధం ఉన్నట్టుగా అనుమానం వ్యక్తం చేశారు. సుమారు 140 కిలోల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. దీని విలువ 600కోట్ల రూపాయల విలువ ఉంటుందని సమాచారం. అలాగే పాక్ నావకు సమీపంలో అనుమానాస్పదంగా కనిపించిన భారత మత్స్యకారులను ఇద్దర్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. సంచలనం రేపుతున్న ఈ వ్యవహారంపై పూర్తి వివరాలను వెల్లడించేందుకు అధికారులు నిరాకరించారు. దీనిపై విచారణ కొనసాగుతోందని తెలిపారు.