-
ఆ సీఈవో రూ.32 కోట్ల సౌధానికి యజమాని
బెంగళూరు: బిగ్గెస్ట్ ఆన్ లైన్ రీటైలర్ ఫ్లిప్కార్ట్ సీఈవో బిన్నీబన్సల్ (32) టెక్ సిటీలోని విలాసవంతమైన ఏరియాలో ఓ బంగ్లాను కొనుగోలు చేశారు. దాదాపు రూ.32కోట్లు (5మిలియన్ డాలర్లు) ఖరీదు చేసే బెంగళూరులోని కోరమంగళ ప్రాంతలో ఓ విశాలమైన సౌధాన్ని సొంతం చేసుకున్నారు. ఈ ఇల్లు దాదాపు 10,000 చదరపు అడుగుల వైశాల్యంలో ఉంది. 32 సం.రాల వయసులో 32 కోట్ల రూపాయిల కలల సౌధానికి అధిపతిగా అవతరించాడు ఫ్లిప్ కార్ట్ బాస్. ఇటీవల బెంగళూరులో జరిగిన అతిపెద్ద గృహ కొనుగోలు డీల్స్లో ఇదీ ఒకటని అంచనా. తొమ్మిదేళ్ల క్రితం ఫ్లిప్కార్ట్ను ప్రారంభించిన ప్రదేశానికి ఇది సమీపంలోనే ఉండడం విశేషం. అన్నట్టు ఫ్లిప్కార్ట్ మరో సహవ్యవస్థాపకుడైన సచిన్ బన్సాల్ దీనికి పొరుగునే కొన్నేళ్ల క్రితం ఓ ఇల్లు కొనుగోలు చేశారు. అప్పట్లో ఆయన ఫ్లిప్కార్ట్లోని కొన్ని షేర్లను విక్రయించి వచ్చిన మొత్తంతో ఇక్కడ ఇల్లు కొన్నారు. ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు నందన్ నీలేకని, క్రిస్ గోపాల కృష్ణన్, డాక్టర్ దేవిశెట్టి, రాజీవ్ చంద్రశేఖర్ తదితరులు నివసించే ఏరియాకి దగ్గరలోనే బన్సాల్ , ఆయన భార్య త్రిష కూడా చేరారు. కాగా బన్సాల్ రెండు ప్రైవేటు బ్యాంకుల్లో కొంత మొత్తం అప్పు తీసుకొని మరీ ఈ ఇంటిని సొంతం చేసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా ఉంటున్న ఇక్బాల్ కుటుంబంనుంచి దీన్ని కొనుగోలు చేశారు. దాదాపు కొన్ని వారాల క్రితమే రిజిష్ట్రేషన్ పూర్తయింది. అయితే దీనిపై స్పందించడానికి బిన్నీ బన్సల్ నిరాకరించారు. -
విద్యుత్కు రూ.32 వేల కోట్లు
సాక్షి, చెన్నై: రాష్ట్రంలో మరో నాలుగు థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. రూ.32 వేల కోట్లతో అంచనా వ్యయం రూపొందించారు. త్వరలో అధికారిక ప్రకటనతో ఈ పనులు ఆరంభం కానున్నాయి. రాష్ట్రంలో ఆదివారం నుంచి అమల్లోకి వచ్చిన కోతల రహిత నిరంతర విద్యుత్ సరఫరా సాధ్యమయ్యేనా? అన్న ప్రశ్న బయలుదేరింది. రాష్ట్రంలో రోజురోజుకూ విద్యుత్ వాడకం పెరుగుతుండడంతో అందుకు తగ్గట్టుగా ఉత్పత్తిని వేగవంతం చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అన్నాడీఎంకే సర్కారు అధికారంలోకి వచ్చాక మూడు కొత్త ప్రాజెక్టుల ద్వారా విద్యుత్ ఉత్పత్తి ఆరంభం అయింది. థర్మల్ విద్యుత్ ద్వారా ఫలాలు దక్కుతుంటే, వర్షాభావ పరిస్థితులతో జలవిద్యుత్ నిరాశ పరిచింది. పవన విద్యుత్ గాలుల ప్రభావం మేరకు అటూ ఇటూ ఊగిసలాడుతోంది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం థర్మల్ విద్యుత్ కేంద్రాల మీద దృష్టి కేంద్రీకరించింది. ఇటీవల కేంద్రంతో కలసి ఉడన్కుడిలో థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నెలకొల్పే పనిలో పడింది. వెయ్యి మెగావాట్ల ఉత్పత్తి లక్ష్యంగా ఇక్కడ రెండు యూనిట్ల ఏర్పాటు పనులు వేగవంతం అయ్యాయి. మరికొన్ని నెలల్లో ఈ కేంద్రాల నుంచి ఫలాలు దక్కనున్నాయి. కొత్త ప్రాజెక్టులు: ఉడన్ కుడి పనులు ముగిసిన తర్వాత రాష్ట్రంలో కొత్తగా నాలుగు ప్రాజెక్టులకు ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల నాటికి మరో ఐదు వేల మెగావాట్ల ఉత్పత్తి లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నది. రూ.32 వేల కోట్లు ఇందుకు అంచనాగా రూపొందించారు. ఉత్తర చెన్నైలో రెండు యూనిట్లతో ఓ ప్రాజెక్టు ఏర్పాటు చేయనున్నారు. ఒక్కొక్కటి 660 మెగావాట్ల ఉత్పత్తి లక్ష్యంగా ఈ కేంద్రం పనిచేయనున్నది. రామనాథపురం ఉప్పడంలో 800 మెగావాట్ల ఉత్పత్తి లక్ష్యంగా ఓ థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుకు, తూత్తుకుడిలో వెయ్యి మెగావాట్ల లక్ష్యంగా రెండు ప్రాజెక్టులకు కసరత్తు చేస్తున్నారు. మరో ప్రాజెక్టుకు సైతం చర్యలు తీసుకున్నారని, అయితే, అది ఎక్కడ ఏర్పాటు చేయాలన్న దానిమీద స్థల పరిశీలనలో నిమగ్నమయ్యారంటూ విద్యుత్ బోర్డు వర్గాలు పేర్కొంటున్నాయి. నిరంతర విద్యుత్ సాధ్యమా?: రాష్ట్రంలో కోతల రహితంగా నిరంతర విద్యుత్ సరఫరా సాధ్యమయ్యేనా అన్న ప్రశ్న బయలుదేరింది. ఆదివారం నుంచి ఎలాంటి కోతలు, ఆంక్షలు లేకుండా విద్యుత్ సరఫరా చేసే పనిలో రాష్ట్ర ప్రభుత్వం నిమగ్నం అయింది. రాష్ట్రంలో కోటి 41 లక్షల 42 వేల ఇంటి కనెక్షన్లు, 19 లక్షల 11 వేల వ్యవసాయ పంప్ సెట్, 26 లక్షల 32 వేల వాణిజ్య సంస్థలకు, ఐదు లక్షల తొమ్మిది వేల పరిశ్రమలకు కనెక్షన్లు, 20 లక్షల ఎనిమిది వేల అదనపు కనెక్షన్లు ఉన్నాయి. ఈ వినియోగ దారులకు ఒక రోజుకు 12,500 మెగావాట్లు విద్యుత్ అవసరం. అరుుతే విద్యుత్ ఉత్పత్తితో పనిలేదని, ఇక నిరంతర విద్యుత్ తమ లక్ష్యం అంటూ గత నెల సీఎం జయలలిత ప్రకటించారు. జూన్ ఒకటో తేదీ నుంచి విద్యుత్ కోతలకు మంగళం పాడుతున్నామని, పరిశ్రమలు, వాణిజ్య సంస్థలకు అమల్లో ఉన్న అన్ని రకాల ఆంక్షలను ఎత్తి వేస్తున్నామని జయలలిత స్పష్టం చేశారు. ఆ మేరకు ఆదివారం నుంచి అన్ని రకాల ఆంక్షలు రద్దు అయ్యాయి. తొలి రోజు ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేయడంలో సఫలీకృతులయ్యారు. అయితే, ఇదే, సరఫరా మిగిలిన అన్ని రోజులు చేయగలరా? అన్న ప్రశ్న ప్రజల్లో బయలు దేరింది. సీఎం జయలలిత ఒత్తిడి మేరకు అధికారులు చేయగలమని భరోసా ఇస్తున్నా, విద్యుత్ కేంద్రాల్లో ఏదేని సాంకేతిక సమస్యలు తలెత్తిన పక్షంలో పరిస్థితి తారుమారయ్యే అవకాశం ఉంటుంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోలవరంపై అమిత్ షాకు సజ్జల స్ట్రాంగ్ కౌంటర్
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
వరల్డ్కప్ సెలక్టయ్యాడు.. వరుసగా రెండో మ్యాచ్లో గోల్డెన్ డక్
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (05-05-2024)
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
స్కూల్లో బెత్తం దెబ్బలు తిన్నా: సుప్రీం చీఫ్ జస్టిస్
చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
తప్పక చదవండి
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement